Chittoor

News February 27, 2025

జీడీ నెల్లూరు: సీఎం పర్యటనకు పటిష్ఠ బందోబస్తు

image

మార్చి 1న సీఎం చంద్రబాబు పర్యటనకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్ కుమార్‌తో కలిసి ఆయన గురువారం పర్యవేక్షించారు. సీఎం పర్యటన ముగిసే వరకు ఎలాంటి అలసత్వం వహించకుండా బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైయుజన్ నిర్వహించి అధికారులు చేపట్టాల్సిన విధులపై దిశా నిర్దేశం చేశారు.

News February 27, 2025

ఆడపిల్లలను అక్కున చేర్చుకున్న చిత్తూరు కలెక్టర్

image

గంగాధర నెల్లూరులోని ఓ దంపతులకు రక్షిత, హేమశ్రీ అనే ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. కొన్ని అనివార్య కారణాలతో తల్లిదండ్రులు విడిపోయి వారి జీవితాలను మరొకరితో పంచుకున్నారు. ఈ కారణంగా అనాథలైన రక్షిత, హేమశ్రీ బాగోగులు వారి తాతయ్య చూసుకుంటున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న కలెక్టర్ సుమిత్ కుమార్.. ఇద్దరి పిల్లల ఉన్నత విద్య బాధ్యత తానే తీసుకున్నట్లు ప్రకటించారు. దీంతో పలువురు కలెక్టర్‌ను అభినందిస్తున్నారు.

News February 27, 2025

చిత్తూరులో వృద్ధురాలి సూసైడ్

image

వృద్ధురాలు ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన చిత్తూరు వైఎస్ నగర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై మల్లికార్జున తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా జ్ఞానమని (65) అనే వృద్ధురాలు తీవ్రమైన నడుము నొప్పి, కడుపు నొప్పితో బాధపడుతోంది. బుధవారం నొప్పి భరించలేక మనస్తాపానికి గురై ఇంట్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా మనవడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. మార్గ మద్యమంలో మృతి చెందగా, కేసు నమోదు చేశామన్నారు.

News February 26, 2025

జీడీ నెల్లూరు: సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

image

ఏపీ సీఎం చంద్రబాబు మార్చి 1న జీడీ నెల్లూరులో జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మణికంఠ ఆదేశాల మేరకు సీఎం చంద్రబాబు పర్యటనకు భారీ ఎత్తున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ వాసంతి తెలిపారు. సీఎం కాన్వాయ్, హెలిపాడ్, పెన్షన్ల పంపిణీ స్థలం వద్ద భద్రతను పరిశీలించామన్నారు.

News February 25, 2025

చిత్తూరు జాయింట్ కలెక్టర్ హెచ్చరికలు ఇవే..!

image

చిత్తూరు జిల్లాలో గ్యాస్ సిలిండర్లను నిర్దేశిత ధరలకే విక్రయించాలని జాయింట్ కలెక్టర్ విద్యాధరి సూచించారు. కలెక్టరేట్‌లో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. అధిక ధరలకు సిలిండర్లను విక్రయిస్తే చర్యలు ఉంటాయన్నారు. పలు ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని.. అలాంటి ఏజెన్సీలను రద్దు చేస్తామని హెచ్చరించారు. మీ ఏరియాలో సిలిండర్ ఎంత ధరకు ఇస్తున్నారో కామెంట్ చేయండి.

News February 25, 2025

తిరుమలలో చైన్ స్నాచర్ హల్‌చల్

image

తిరుమలలో ఓ దొంగ హల్‌చల్ చేశాడు. భక్తురాలి మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో తోటి భక్తులు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం టీటీడీ, పోలీస్ విజిలెన్స్ సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటన తిరుమలలోని మాధవం అతిథిగృహం వద్ద జరిగింది.

News February 25, 2025

CM చిత్తూరు జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే..

image

సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన ఖరారైంది. మార్చి 1న ఆయన జీడీనెల్లూరుకు రానున్నారు. శనివారం 11.25కి రేణిగుంటకు వస్తారు. 11.50కి హెలికాప్టర్ ద్వారా జీడీనెల్లూరుకు వెళ్తారు. అక్కడ పింఛన్లు పంపిణీ చేస్తారు. తర్వాత గ్రామస్థులతో మాట్లాడతారు. 2.30 తర్వాత తిరిగి రేణిగుంట వెళ్తారు. ఈనేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.

News February 25, 2025

మొగిలి: హంస వాహనంపై మొగిలేశ్వర స్వామి

image

బంగారుపాలెం మండలంలోని మొగిలి గ్రామంలో వెలసిన మొగలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండవ రోజు స్వామివారు హంస వాహనంపై గ్రామంలో ఊరేగారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలిచారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించారు.

News February 24, 2025

చిత్తూరు యువతి హీరోయిన్‌గా అరంగేట్రం

image

చిత్తూరు జిల్లాకు చెందిన సౌందర్య రవికుమార్ తమిళ చిత్రంలో తళుక్కుమన్నారు. నటన పట్ల ఆసక్తిగల సౌందర్య తన ప్రతిభతో గొప్ప అవకాశాన్ని దక్కించుకున్నారు. తమిళంలో దర్శకుడు గౌతమ్ మీనన్ అసిస్టెంట్ బాలు పులిచెర్ల దర్శకత్వంలో రూపొందుతున్న విక్రమ్ కే దాస్ చిత్రంలో సౌందర్య హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ కుమార్తె సౌందర్య చిన్ననాటి నుంచి కళల రంగంలో రాణిస్తోంది.

News February 24, 2025

అసెంబ్లీలో YCPని ప్రతిపక్షంగా గుర్తించాలి: పెద్దిరెడ్డి 

image

అసెంబ్లీలో వైసీపీని ప్రభుత్వం ప్రతిపక్షంగా గుర్తించాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విధ్వంసం సృష్టించినట్లు ఆరోపణలు చేస్తున్న కూటమి ప్రభుత్వం వాటిని ఎక్కడా నిరూపించలేదన్నారు. అసెంబ్లీలో మాజీ సీఎం జగన్‌కు మాట్లాడే అవకాశం కల్పించాలని,  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు.