India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుపతి జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 208 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అందులోకి లోతట్టు ప్రాంతాల నుంచి 1,183 మందిని తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీలకు కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం కూడా సెలవు ప్రకటించారు. సెలవు ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి జిల్లాలో కాసేపటి క్రితమే రేపటికి సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా(మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె)లో సెలవుపై ఎలాంటి ప్రకటన రాలేదు.

తిరుపతి జిల్లాలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇవాళ జిల్లాకు రెడ్ జోన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. దీంతో కలెక్టర్ వేంకటేశ్వర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు గురువారం సెలవు ప్రకటించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. అన్నమయ్య జిల్లాలో సెలవుపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

అల్పపీడన ప్రభావంతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. అత్యధికంగా నింద్రలో 22.8 మిమీ, అత్యల్పంగా తపణంపల్లెలో 1.0 మిమీ వర్షం కురిసింది, మండలాల వారీగా రొంపిచెర్లలో 12, సదుంలో 9.6, పులిచెర్లలో 16.2, వెదురుకుప్పంలో 44, విజయపురంలో 5.4, నగరిలో 8.6, కార్వేటినగరంలో 5.4, పెనుమూరులో 3.6, పూతలపట్టులో 8.8, సోమలలో 12.6, చౌడేపల్లిలో 5.4, పుంగనూరులో 6.2మీ.మీ వర్షపాతం నమోదు అయింది.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో తిరుపతి నుంచి తమిళనాడు రాష్ట్రం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. తిరుపతి- చెన్నై సెంట్రల్ (16203) తిరుపతి ఎక్స్ప్రెస్, తిరుపతి- చామరాజనగర్ (16220)కాట్పాడి మీదుగా కర్ణాటక రాష్ట్రానికి వెళ్లే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు.

తిరుపతి జిల్లాలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ వి.శేఖర్ ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో కాలేజీలకు కూడా వర్తిస్తుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది. కేబినెట్లోని మంత్రులందరికీ కొత్త జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అనగాని సత్యప్రసాద్, చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కురిసే భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ తుఫాను కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007,గూడూరు కంట్రోల్ రూమ్ నెం: 8624252807,సూళ్లూరుపేట-8623295345,
తిరుపతి ఆర్డీఓ 7032157040,శ్రీకాళహస్తి ఆర్డీఓ-కంట్రోల్ రూమ్ నెం:9966524952

104 మద్యం దుకాణాలకు నిర్వహించిన లాటరీలో జిల్లాలో 12 మంది మహిళలు దుకాణాలను దక్కించుకున్నారు. చిత్తూరులో యామిని, కీర్తన, బంగారుపాళ్యంలో పల్లవి (2 షాపులు), ఐరాలలో లక్ష్మి, వెదురుకుప్పంలో పార్వతి, శాంతమ్మ, బైరెడ్డిపల్లెలో భారతి, గుడుపల్లెలో ప్రభావతి, శాంతిపురంలో పుష్ప, రామకుప్పంలో ధనలక్ష్మి, పులిచెర్లలో సరస్వతి దుకాణాలను దక్కించుకున్నారు.

చిత్తూరు జిల్లాలో తుఫాను కారణంగా వైద్యాధికారులకు మూడు రోజులపాటు సెలవులు రద్దు చేసినట్లు డిఎంహెచ్వో ప్రభావతి దేవి తెలిపారు. వైద్యాధికారులతో సోమవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులతో కలిసి పని చేయాలని సూచించారు. ఇంటింటి సర్వే చేపట్టి అనారోగ్య సమస్యల గుర్తించి తెలుసుకోవాలని ఆదేశించారు. డయేరియా పెరగకుండా చూసుకోవాలని చెప్పారు.
Sorry, no posts matched your criteria.