Chittoor

News August 12, 2024

తిరుపతి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి

image

తిరుపతికి చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆదివారం తమిళనాడులో జరిగింది. యగేశ్(21), చేతన్(23) చెన్నైలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నారు. వారు స్నేహితులతో అరుణాచలేశ్వర ఆలయానికి కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారును తిరువళ్లూరు జిల్లాలో లారీ ఢీకొంది. దీంతో యగేశ్, చేతన్‌తో పాటు ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.

News August 12, 2024

తిరుమల: ఘాట్ రోడ్డులో చిరుత కలకలం

image

తిరుమల ఘాట్ రోడ్డులో ఆదివారం చిరుత సంచారం కలకలం రేపింది. రాత్రి తొమ్మిది గంటల సమయంలో మొదటి ఘాట్ వద్ద ఓ చిరుత రోడ్డు దాటుతుండగా వాహనదారులు గమనించి టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే భక్తుల భద్రత కోసం చర్యలు చేపట్టాలని వారు కోరారు.

News August 11, 2024

రేణిగుంటకు చేరుకున్న మంత్రులు గొట్టిపాటి, అనగాని  

image

తిరుమల శ్రీవారి దర్శనం కోసం నేడు మంత్రి గొట్టిపాటి, అనగాని సత్యప్రసాద్ హైదరాబాదు నుంచి రేణిగుంటకు వచ్చారు. ఈ మేరకు వారికి పలువురు టీడీపీ నేతలు స్వాగతం పలికారు. మంత్రులు రేపు వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. 

News August 11, 2024

కలకడ: చెల్లెలి భర్తపై కత్తితో డాడి చేసిన బావ

image

కలకడలోని రాజీవ్ నగర్‌కు చెందిన షేక్ నవాజ్ కడపకు చెందిన నౌషీన్‌ను ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి చిన్నపాటి ఘర్షణలతో నౌషిన్ తన అన్న షాలూర్‌ను పిలిపించింది. దీంతో ఆదివారం మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో నవాజ్‌ను షాలూర్ కత్తితో పొడిచాడు. క్షతగాత్రుడిని పోలీసులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలించారు.

News August 11, 2024

తవణంపల్లి: బైక్‌ను ఢీకొన్న లారీ.. మహిళ మృతి

image

తవణంపల్లి మండలంలో ఆదివారం విషాదం నెలకొంది. పట్నం బ్రిడ్జి వద్ద ఓ బైక్‌ను లారీ ఢీకొట్టడంతో చంద్రమ్మ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 11, 2024

చౌడేపల్లి: చోరీ చేసిన నగలు ఇంటి ముందు పడేశారు..ఎందుకంటే.!

image

సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాల బండ పేరు చెప్పగానే  చోరీ అయిన 40 గ్రాముల బంగారు రూ.25 వేల నగదును ఇంటి వద్ద పడేసి వెళ్లారని కర్ణాటకకు చెందిన బాలసుబ్రహ్మణ్యం తెలిపాడు. ఈనెల 2న చోరీ జరిగిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేదన్నారు. పెద్దమనుషుల సూచనల మేరకు ఇంటికొకరు రాజనాల బండకు రావాలని తీర్మానించారు. దీంతో భయపడిన దొంగలు పడేసి వెళ్లారు.

News August 11, 2024

చిత్తూరు జిల్లాలో నాటు బాంబుల కలకలం

image

చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో నాటు బాంబులు కలకలం రేపుతున్నాయి. చిత్తపార అటవీ ప్రాంతంలో 19 నాటు బాంబులను పోలీసులు గుర్తించారు. అయితే వీటిని వన్యప్రాణుల వేటకోసం తయారుచేసినట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

News August 11, 2024

తిరుపతి: SVU విద్యార్థి మృతి

image

SVUలో ఇంజినీరింగ్ చదువుతున్న ప్రియాంక మృతి చెందింది. పోలీసుల కథనం..ఒంగోలుకు చెందిన యువతి తిరుపతిలో చదువుకొంటోంది. యువతి కుటుంబీకులకు తెలియకుండా శివ కళ్యాణ్‌‌ను గత ఏడాది వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భిణి. శుక్రవారం రాత్రి అనారోగ్యంతో ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భర్త, కుటుంబీకులు పరారై, ఆమె తండ్రికి ఫోన్‌లో సమాచారం ఇవ్వగా అసలు విషయాలు వెలుగులోకొచ్చాయి.

News August 11, 2024

తిరుపతి- కాచిగూడ మార్గంలో 2 ప్రత్యేక రైళ్లు

image

స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని తిరుపతి- కాచిగూడ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కాచిగూడ- తిరుపతి(07653), తిరుపతి- కాచిగూడ (07654) రైళ్లు ఉమానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, యర్రగుంట్ల, కడప, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగించనున్నాయి.

News August 10, 2024

చిత్తూరు జిల్లాలో TODAY TOP NEWS

image

➽ తిరుపతి: ఆకట్టుకుంటున్న కపిల తీర్థం
➽ తిరుపతిలో భారీ వర్షం
➽ చిత్తూరు: వ్యక్తి ప్రాణం తీసిన జల్లికట్టు
➽ పుత్తూరు నూతన డీఎస్పీగా రవికుమార్ బాధ్యతలు
➽ SVU: LLB ఫలితాలు విడుదల
➽ మదనపల్లెలో దంపతులపై దాడి
➽ బి.కొత్తకోటలో పేకాట రాయళ్లు అరెస్టు
➽ రోడ్డుపై SVU విద్యార్థుల ఆందోళన