Chittoor

News May 4, 2024

పోస్టల్ బ్యాలెట్‌కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ ఎస్.షణ్మోహన్

image

ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది వారి ఓటు హక్కును 5, 6వ తేదీలలో వినియోగించుకోవచ్చని కలెక్టర్ ఎస్.షణ్మోహన్ శుక్రవారం తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించిందన్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.

News May 3, 2024

చిత్తూరు: ఈతకు వెళ్లి యువకుడి మృతి

image

ఈతకు వెళ్లి యువకుడు మృతిచెందిన ఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో శుక్రవారం జరిగింది. ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు వివరాల మేరకు.. మదనపల్లె(M) బసినికొండకు చెందిన జగదీశ్ సెలవులు కావడంతో కాటిపేరులోని బంధువుల ఇంటికి వచ్చాడు. తోటి పిల్లలతో కలిసి గ్రామ సమీపంలోని బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి బంధువులకు అప్పగించారు.

News May 3, 2024

మదనపల్లె: ఉరి వేసుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

image

మదనపల్లె మండలంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. వేంపల్లి గ్రామంలోని సతీశ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం బెంగళూరు నుంచి ఇంటికి వచ్చిన సతీశ్ నేడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యతో విడాకులు తీసుకోవడం, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.

News May 3, 2024

రోజా బ్లాక్ మెయిల్ చేసి సీటు తెచ్చుకున్నారు: చక్రపాణి రెడ్డి

image

మంత్రి రోజా బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నారని శ్రీశైలం ఆలయ ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రోజా గెలిచిన తర్వాత పార్టీ నేతలను పట్టించుకోలేదని విమర్శించారు. పార్టీ సర్వేలో ఆమె ఓడిపోతుందని తేలిందన్నారు. రోజా వల్ల నగరి కేడర్ దెబ్బతిందన్నారు.

News May 3, 2024

శ్రీవారి నెల ఆదాయం 101.63 కోట్లు

image

తిరుమల శ్రీవారిని ఏప్రిల్ నెలలో దర్శించుకున్న సంఖ్యను టీటీడీ శుక్రవారం వెల్లడించింది. ఒక్క నెలలోనే శ్రీవారిని 20.17 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా 101.63 కోట్లు ఆదాయం వచ్చింది. 94.22 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించారు. 39.73 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 8.08 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

News May 3, 2024

కాలువలో పురిటి బిడ్డ మృతదేహం

image

తిరుపతిలో విషాదకర ఘటన వెలుగు చూసింది. నగరంలోని తిరుమల నగర్, కృష్ణవేణి యాదవ్ కాలనీ డ్రైనేజీలో ఓ పురిటి బిడ్డ మృతదేహం కలకలం రేపింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత శిశువు పుట్టిందా లేక బిడ్డ పుట్టగానే డ్రైనేజీలో పడేశారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

News May 3, 2024

పెద్దిరెడ్డికి పైనాపిల్ మాలతో స్వాగతం

image

మదనపల్లెలో రెడ్ల సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఇతర నాయకులకు ఫైనాపిల్ గజమాలతో స్థానికులు స్వాగతం పలికారు. స్థానిక రెడ్డి సంక్షేమ సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశానికి మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థులు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరయ్యారు. వైసీపీకి మద్దతుగా నిలవాలని కోరారు.

News May 3, 2024

7న తిరుపతికి పవన్ కళ్యాణ్ రాక

image

ఎన్నికల ప్రచారం కోసం పవన్ కల్యాణ్ ఈనెల 7న తిరుపతికి రానున్నారు. అదే రోజున చంద్రగిరి నుంచి వారాహి రోడ్ షో, తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటం, తిరుపతిలో జనసేన అభ్యర్థి పోటీ చేస్తుండడంతో ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. త్వరలోనే పర్యటన పూర్తి వివరాలు ప్రకటిస్తామని జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు.

News May 3, 2024

ఆ విషయంలో జగన్ వెనక్కి తగ్గరు: పెద్దిరెడ్డి

image

ల్యాండ్ టైటిలింగ్ యాక్టును CM జగన్ కచ్చితంగా అమలు చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పుంగనూరు ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘చంద్రబాబు అధికారంలోకి వస్తే చట్టాన్ని రద్దు చేస్తానంటున్నారు. ఆయన గెలవడు, చట్టం రద్దు చేసేదీ లేదు. పింఛన లబ్ధిదారుల కష్టాలకు చంద్రబాబు బంధువు నిమ్మగడ్డ రమేశే కారణం. ఆయన వాలంటీర్లపై ఫిర్యాదు చేయడంతో ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వడం లేదు’ అన్నారు.

News May 3, 2024

పుంగనూరులో వంద శాతం వెబ్‌కాస్టింగ్

image

సదుం మండలం ఎర్రాతివారిపల్లె, పుంగనూరు మండలం మాగాండ్లపల్లెలో బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్ పర్యటనలో గొడవలు జరిగాయి. వీటిని ఆయన ఈసీ దృష్టికి తీసుకెళ్లడంతో సంచలన నిర్ణయం తీసుకుంది. పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. పలమనేరులోనూ వంద శాతం వెబ్‌కాస్టింగ్ చేస్తామన్నారు.