Chittoor

News April 29, 2024

చిత్తూరు జిల్లా ఫలితాలపై సర్వత్రా ఆసక్తి

image

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జిల్లాలో టీడీపీకి మెజార్టీ సీట్లు రాలేదు. 2009లో కాంగ్రెస్‌కు 7, టీడీపీకి 6, పీఆర్పీకి ఓ స్థానం వచ్చింది. 2014లో వైసీపీకి 8, టీడీపీకి 6 దక్కాయి. 2019లో వైసీపీకి 13 రాగా టీడీపీ కుప్పంతో సరిపెట్టుకుంది. మరి ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయో కామెంట్ చేయండి.

News April 29, 2024

మదనపల్లె ఇండిపెండెంట్ అభ్యర్థికి గ్లాస్ గుర్తు కేటాయింపు

image

మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్.షాజహాన్‌కు గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు. దీంతో స్థానిక జనసేన పార్టీ నేతల్లో కలవరం చోటు చేసుకుంది. గాజు గ్లాసు గుర్తు షాజహాన్‌కు కేటాయించడం తగదన్నారు. మదనపల్లె జనసేన పార్టీ నేత దారం అనిత తదితరులు ఎన్నికల అబ్జర్వర్ కవిత(ఐఏఎస్), ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.

News April 29, 2024

చంద్రగిరి : టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానికి 1+1 భద్రత

image

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానితో పాటు కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేసినా సెక్యూరిటీ ఇవ్వలేదని నాని హైకోర్టును ఆశ్రయించారు. నాని తరఫున న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. పోటీ చేసిన అభ్యర్థికి భద్రత ఇవ్వాలి కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇవాళ నుంచి 1+1 సెక్యూరిటీ ఇవ్వాలని ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

News April 29, 2024

TPT: దూరవిద్య పీజీ ఫలితాల విడుదల

image

తిరుపతి : శ్రీవేంకటేశ్వర దూరవిద్య (DDE) విభాగం పరిధిలో గత ఏడాది సెప్టెంబర్‌లో పీజీ ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. ఫలితాలు సోమవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in, www.schools9.com ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News April 29, 2024

CTR: కొనసాగుతున్న నామినేషన్ల ఉపసంహరణ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని 14 నియోజకవర్గాల్లో నామినేషన్ల ఉపసంహరణ ఇవాళ సాయంత్రం ముగియనుంది. ఈక్రమంలో పలువురు అభ్యర్థులు ఆర్వో కార్యాలయానికి వెళ్లి తమ నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకుంటున్నారు. కొన్ని పార్టీల తరఫున డమ్మీ సెట్లు వేసిన వాళ్లు విత్ డ్రా చేసుకుంటున్నారు. ఈక్రమంలో చిత్తూరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన విజయానందరెడ్డి భార్య ఇందుమతి నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.

News April 29, 2024

ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగింపు

image

TTD ఈవోగా మరో రెండు నెలలు పాటు ధర్మారెడ్డే కొనసాగనున్నారు. కేంద్ర రక్షణ శాఖ అధికారిగా ఉన్న ఆయన్ను డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి EOగా నియమించారు. ఆయన డిప్యుటేషన్ మే 14తో ముగియనుంది. ఎన్నికల్లో ఐఏఎస్ అధికారులందరూ బిజీగా ఉంటారని.. ధర్మారెడ్డి డిప్యుటేషన్ గడువు పొడిగించాలని CM జగన్ కేంద్రానికి లేఖ రాశారు. ఈమేరకు ఆయన డిప్యుటేషన్‌ను జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి.

News April 29, 2024

చిత్తూరు: ఆ రోజున వేతనంతో సెలవు

image

ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేందుకు మే 13వ తేదీ కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, దుకాణాలు, హోటళ్లు ఇతరత్రా వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సెలవు ప్రకటించాలని స్పష్టం చేశారు. నిబంధనలను పాటించని యాజమాన్యాలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News April 29, 2024

తిరుమలలో జరిగే ఉత్సవాలు ఇవే

image

తిరుమలలో శ్రీవారి గురువు జగద్గురు భగవద్ శ్రీరామానుజ ఉత్సవాలు మే 3న ప్రారంభం అవుతాయి. 4న‌ సర్వ ఏకాదశి, 10న అక్షయ తృతీయ నిర్వహిస్తారు. 12న జగద్గురు భగవద్ శ్రీ రామానుజ(శ్రీ భాష్యకారుల) శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు జరుపుతారు. 22న నృసింహ జ‌యంతి, నమ్మాల్వార్ వార్షిక శాత్తుమొర, 23న అన్నమాచార్య జయంతి జరుగుతుంది.

News April 29, 2024

21 నుంచి కళ్యాణ వేంకన్న బ్రహ్మోత్సవాలు

image

నారాయణవనం శ్రీపద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు మే 21 నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. మే 15న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేసి మే 20న అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో రోజూ ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

News April 28, 2024

ఎల్లుండి కలికిరికి జగన్ రాక

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ప్రచారానికి సీఎం జగన్ రానున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు కలికిరికి చేరుకుంటారు. కలికిరి నాలుగు రోడ్ల కూడలిలో జరిగే బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ మేరకు వైసీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.