India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట నుంచి తిరుమల వరకు కాన్వాయ్ ట్రైల్ రన్ ను ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. భద్రత ఏర్పాట్లను ఎస్పీ ఇంటిలిజెన్స్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. విమానాశ్రయంలో వాహన శ్రేణి పోలీస్ అధికారులు, డ్రైవర్లు పాటించాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు.

తిరుపతిలోని పద్మావతిపురం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా శుక్రవారం నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ, ఎంకాం పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గ్రానైట్ అక్రమ రవాణా జోరుగా సాగుతోందని విమర్శలు వస్తున్నాయి. కుప్పం నుంచి గ్రామీణ రహదారుల్లో వ్యాపారులు నిత్యం తమిళనాడుకు అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్నారు. అనుమతులు లేకుండా గ్రానైట్ లారీలు సరిహద్దులు దాటుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కుప్పం(M) పైపాళ్యం మీదుగా తమిళనాడుకు అక్రమంగా తరలిపోతున్న గ్రానైట్ లారీని పై ఫొటోలో చూడవచ్చు.

తిరుపతి జిల్లాలో ఈనెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్ష జరగనుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో శేఖర్ తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.

తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు నుంచి ఎంతో మంది పేదలు వస్తుంటారు. ఇందులో చాలా మంది చదువు రాని వాళ్లే ఉంటారు. వీళ్లంతా ఓపీ తీసుకోవడంతో పాటు ఆయా ఆసుపత్రుల్లో ఏ విభాగానికి ఎటు వెళ్లాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఆసుపత్రి, ఓపీ గురించి మీకు తెలిసి ఉంటే.. ఇలా ఇబ్బంది పడుతూ మీకు ఎదురు పడిన వాళ్లకు సాయపడితే ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది.

పుంగనూరులో అస్పియా అంజుమ్(7) మృతి కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి బాలిక అదృశ్యమైంది. అదే రోజు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉబేదుల్లా కాంపౌండ్ వద్ద బాలిక మిస్ అయినట్లు గుర్తించి చెంగ్లాపురం రోడ్డు పరిసరాల్లో పోలీసు జాగీలాలతో సోమవారం గాలించారు. డీఐజీ షేముషఇ భాజ్పాయి మంగళవారం పుంగనూరు వచ్చి బాధితులతో మాట్లాడారు. బుధవారం సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో బాలిక శవమై కనిపించింది.

అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి రోజా ట్వీట్ చేయగా.. దీనికి కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ కౌంటర్ ఇచ్చారు. ‘రోజా గారూ మీరు మంచి మనసుతో ఇలా స్పందించడం చాలా ఆనందం. కానీ ఆరోజు రాజకీయాలకు సంబంధంలేని లోకేశ్ తల్లి భువనేశ్వరిని నిండు సభలో YCP నేతలు అవమానించినప్పుడు పకపక నవ్వారు కదా అప్పుడు ఏమైంది మీ స్పందన?’ అని వాసంశెట్టి ట్వీట్ చేశారు.

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబరు 3వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేస్తారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.

తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. 16 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. కాగా మంగళవారం 63,300 మంది వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారికి రూ.4.23 కోట్లు నిన్న హుండీ రూపంలో ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

జిల్లా సమగ్ర అభివృద్దే లక్ష్యంగా సర్ణాంధ్ర @ 2047 విజన్ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ స్వర్ణాంధ్ర@ 2047 అమలుపై ప్రజా ప్రతినిధులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, రైతు సంఘాలు, జిల్లా అధికారులతో ఒక రోజు వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.