India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మదనపల్లె ఫైళ్ల దగ్ధం ఘటనలో మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. ఇందులో నలుగురు నిందితులపై నాన్ బెయిల్బుల్తో వన్ టౌన్ పోలీసులు FIR నమోదు చేశారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, మదనపల్లె మున్సిపల్ వైస్ ఛైర్మన్ జింకా చలపతి, పెద్దిరెడ్డి అనుచరులు మాధవ రెడ్డి, కె.రామకృష్ణారెడ్డి ఉన్నారు. కేసు వివరాలను మదనపల్లె ఏడీజే కోర్టులో సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో 8 ఉండరాని ఫైల్స్ దొరకడంతోనే కేసు నమోదు చేశారు.
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూధన్ కోటి రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు డీడీని తిరుమలలోని గోకులం రెస్ట్ హౌస్లో టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు భరత్ కుమార్,నవీన్కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో అధికారులతో సమీక్ష సమావేశంనిర్వహించారు. అడిషనల్ ఈ.ఓ మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
AP బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ తిరుపతి వారి వివరాల మేరకు శనివారం సాయంత్రం బులియన్ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10gm బంగారం ధర రూ.72160, 22 క్యారెట్ల 1gm బంగారం ధర రూ.6674గా ఉంది. ఒక సవరం బంగారం (8gm) ధర రూ.53392లుగా ఉంది. వెండి 1కిలో రూ.85,000, రిటైల్ ధర 1gm రూ.87.00గా ఉంది.
కోసువారిపల్లిలో ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ రోజు జరిగిన ఈ ఘటనపై తంబళ్లపల్లె SI శివకుమార్ ప్రకారం.. చరణ్, నందినిల కుమార్తె రూప(2) ఇంటి ముందు ఆడుకుంటుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని కుటుంబీకులు మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందిందినట్లు వైద్యులు తెలిపారు. చరణ్ దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కోనేరులో పడి అవ్వ, మనుమడు మృతి చెందిన విషాదకర ఘటన సదుం మండలంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పీలేరుకు చెందిన తులసమ్మ (55) మనవడు అద్విక్ (3) తో కలసి మండలంలోని కొత్తపల్లిలో జరుగుతున్న గృహనిర్మాణం పరిశీలించేందుకు వచ్చారు. శనివారం కావడంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యలో విరుపాక్షమ్మ ఆలయం వద్దనున్న కోనేరులో ఇద్దరూ ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు.
బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ రోడ్ వద్ద బెంగళూరు నుంచి వెళ్తున్న బస్సు వేకువ జామున బోల్తా పడింది. మొత్తం 28 మంది ప్రయాణికులు ఉండగా, 13 మందికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
చిత్తూరు జిల్లాలోని డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) నందు -9 పోస్టులు, మిషన్ శక్తి ప్రాజెక్టు కింద -9 పోస్టులు, ICDS – నందు 8 మొత్తం 26 కాంట్రాక్ట్ ప్రాతిపదికగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత ఇతర వివరాలకు https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 10.
శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నందు 2024-25 విద్యా సంవత్సరానికి B.Tech డైరీ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ చంగల్ రాయులు ప్రకటనలో పేర్కొన్నారు. AP EAPCET-2024 ప్రవేశపరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.svvu.edu.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 12.
మదనపల్లె సబ్ కలెక్టరేట్లో పైళ్ల దగ్ధం కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఫైళ్ల దగ్ధంకు సంబంధించి మదనపల్లె మున్సిపల్ వైస్ ఛైర్మన్ జింక వెంకటచలపతిపై వన్ టౌన్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. జింక చలపతిపై ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్టుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే 8 మందిపై కేసులు నమోదు కాగా మాధవ రెడ్డి, బాబ్జాన్ తదితరులు పరారీలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.