India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కుప్పం – పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం <<13742093>>మండలం<<>> గుండి శెట్టిపల్లి వద్ద మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తిని లారీ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాళ్లబూదుగూరు ఎస్సై నరేశ్ తెలిపారు.
తిరుపతి జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు 96.98% పెన్షన్ పంపిణీ చేశారు. పెన్షన్ పంపిణీ వివరాలు ఇలా ఉన్నాయి: తిరుపతి(R)96.32, శ్రీకాళహస్తి(M)98.05, తిరుపతి(M)97.67, రేణిగుంట 96.79, చంద్రగిరి 96.74, వెంకటగిరి 97.21, నాయుడుపేట 97.58, వడమాల పేట 96.55 పంపిణీ చేసినట్లు తిరుపతి కలెక్టర్ యస్. వెంకటేశ్వర్ తెలిపారు.
సీఎం చంద్రబాబు సమక్షంలో నిన్న టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు ఎంపీటీసీలను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ భరత్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేసిన కుప్పం, గుడిపల్లి, శాంతిపురం మండలాలకు చెందిన 13 మంది ఎంపీటీసీలతో పాటు కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
చిత్తూరు జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంది. ఉదయం 11 గం. ల వరకు 90.28% పెన్షన్ పంపిణీ చేశారు. పెన్షన్ పంపిణీ వివరాలు ఇలా ఉన్నాయి. యాదమరి-96.97, నగరి-94.99, విజయపురం-94.43, చిత్తూరు -94, పుంగనూరు-92, పెద్దపంజాని -92, కార్వేటినగరం-92, ఐరాల-92, నిండ్ర-92, పుంగనూరు-91, పులిచెర్ల-91, పలమనేరు-91, సోమల-91 పంపిణీ చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జడ్పీటీసీల పరిధిలో రూ.30 లక్షలు, ఎమ్మెల్యేల పరిధిలో రూ.50 లక్షల పనులు చేయడానికి ప్రతిపాదనలు పంపాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు కోరారు. ఇందులో 50 శాతం పనులు వాటర్ వర్క్స్, మిగిలినవి రోడ్లు, కాలువల పనులకు వాడుకోవాలన్నారు. మండలాల వారీగా జడ్పీటీసీలు సంబంధిత పనుల వివరాలు, అంచనా వ్యయంతో వివరాలను సిద్ధం చేసి రెండు వారాల్లోపు తమ కార్యాలయంలో అందజేయాలన్నారు.
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఆగస్టు 8న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ) ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమగ్రశిక్ష జిల్లా ఏపీసీ వెంకట రమణారెడ్డి తెలిపారు. 8వ తేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ ఉంటుందని చెప్పారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక, మధ్యాహ్నం 2 గంటలకు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు.
డీఎల్ఎడ్ రెండో సెమిస్టర్ పరీక్ష ఫీజు ఈనెల 11వ తేదీలోగా చెల్లించాలని డీఈవో దేవరాజు సూచించారు. 2023-25, 2021-23, 2022-24 బ్యాచ్ ఒన్స్ ఫెయిల్డ్ విద్యార్థులకు సెప్టెంబరులో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రూ.50 అపరాధ రుసుంతో ఈనెల 19 వరకు గడువు ఉందన్నారు. రెగ్యులర్ విద్యార్థులు, నాలుగు నుంచి ఆరు సబ్జెక్టులు తప్పినవారు రూ.150, మూడు సబ్జెక్టులకు రూ.140 అని చెప్పారు.
అర్థం కాని పాఠాలు, చదువుల ఒత్తిడి విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి. కురబలకోట యవకుడు నవీన్ కుమార్ <<13746460>>ఆత్మహత్య <<>>ఘటనే ఇందుకు నిదర్శనం. ‘అమ్మా.. నాన్న.. తరగతిలో చెప్పే విషయాలు నాకు అర్థం కావడం లేదు. అందుకే నేను చచ్చిపోతున్నా’ తిరుపతిలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదివే నవీన్ చివరి మాటలు ఇవి. జీవితంలో పైకి రావడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. బలవన్మరణాలకు పాల్పడి తల్లిదండ్రులను బాధపెట్టడం సరికాదు.
మదనపల్లెలో రికార్డుల దగ్ధంపై CM చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. భూ బాధితులందరికీ న్యాయం జరగాలంటే ఈ కేసును CIDకి అప్పగించాల్సిందేనని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై అధికారులతో ఆయన సమీక్ష చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో బాధితులు ఉంటారనేది తాను అసలు ఊహించలేదని మదనపల్లెలో అర్జీలు స్వీకరించిన సిసోడియా సీఎంకు చెప్పారు. సీఐడీ విచారణపై రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.
కుప్పం పట్టణంలోని పాత వైసీపీ కార్యాలయం హోటల్గా మారనుంది. ఎన్నికల్లో ఓటమి అనంతరం పలువురు వైసీపీ నాయకులు స్థానికంగా అందుబాటులో ఉండటం లేదని సమాచారం. పార్టీ కార్యకలాపాలు పెద్దగా నిర్వహించడం లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన భరత్ తన క్యాంపు కార్యాలయంలోనే పార్టీ వ్యవహారాలు నడుపుతున్నారు. దీంతో పాత ఆఫీసు భవనాన్ని ఖాళీ చేశారు. సదరు యజమాని అందులో హోటల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.