Chittoor

News July 31, 2024

చిత్తూరు జిల్లాలో BSNLకు 19వేల మంది షిప్ట్..?

image

టెలికాం సంస్థల రేట్ల ప్రభావం చిత్తూరు జిల్లాలోనూ కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 3.5 లక్షలమంది BSNL కస్టమర్లు ఉన్నారు. ఫైబర్ నెట్‌ను 28 వేల మంది, ల్యాండ్ లైన్ సేవలను 4500 మంది వినియోగించుకుంటున్నారు. ఒక్క జులైలోనే ఈసంస్థకు 19వేల మంది కస్టమర్లు పెరిగారు. సాధారణ రోజుల్లో నెలకు 5 వేల మంది పెరుగుతుంటారు. త్వరలోనే 4G సేవలు అందుబాటులోకి తెస్తామని తిరుపతి ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ CAరెడ్డి వెల్లడించారు.

News July 31, 2024

పెద్దిరెడ్డి కుటుంబానికి 236 ఎకరాలు..?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన భార్య స్వర్ణలత, కుమారుడు మిథున్ రెడ్డి పేరిట 236 ఎకరాలు ఉన్నట్లు తేలింది. ‘మీ భూమి’ పోర్టల్ ప్రకారం పెద్దిరెడ్డి పేరుతో 41.35, మిథున్ రెడ్డి పేరిట 23.42, స్వర్ణలత పేరిట 171.23 ఎకరాలు ఉన్నాయి. పుంగనూరు మండలం రాగానిపల్లె, మేలుపట్ల, భీమగానిపల్లె, చౌడేపల్లె మండలం దిగువపల్లె, మంగళంపేట, వెంకటదాసరపల్లె, తిరుచానూరు తదితర గ్రామాల్లో భూములు కొన్నారు.

News July 31, 2024

కాల్ సెంటర్ పోస్టర్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్

image

తాగునీటి సమస్యలపై జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు సదరు పోస్టర్‌ను విడుదల చేశారు. కాల్ సెంటర్ నెంబర్ 9441725450 కు ప్రజలు అన్ని పని దినములలో, సమయాలలో ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.

News July 30, 2024

తిరుపతి: PIC OF THE DAY

image

తిరుపతి బస్టాండ్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుపతి నగరానికి చుట్టూ పక్కల కొండలు, బస్టాండ్‌కు ఇరువైపుల ఎత్తైన భవంతులు ఉన్న ఫొటో చూపరులను ఆకట్టుకుంటోంది.

News July 30, 2024

తిరుపతి : ఆగస్టు 1 నుంచి 15 వరకు MBA పరీక్షలు

image

తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని MBA 2023 2024 మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు ఆగస్టు 1 గురువారం నుంచి నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ మంగళవారం తెలిపారు. రెండో సెమిస్టర్ పరీక్షలు 10 గంటల నుంచి 12 వరకు, 4వ సెమిస్టర్ పరీక్షలు 2 గంటల నుంచి 5 గంటలకు వరకు జరుగుతాయని అన్నారు. పరీక్షా కేంద్రానికి అర గంట ముందే చేరుకోవాలని తెలిపారు.

News July 30, 2024

తిరుపతి: ఆగస్టు 2న జాబ్ మేళా

image

ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం నందు ఆగస్టు 2వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదవ తరగతి, ఐటిఐ, ఇంటర్, డిప్లొమా, B.Sc మ్యాథ్స్, కెమిస్ట్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 265 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News July 30, 2024

మదనపల్లె ఘటనలో ఉద్యోగులే బలి..!

image

మదనపల్లెలో రికార్డుల దగ్ధం ఘటనలో ఇప్పటి వరకు ఉద్యోగులే బలయ్యారు. పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు సస్పెండ్‌కు గురికాగా మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు నమోదైంది. సస్పెండ్ అయిన అధికారులు వీళ్లే.
☞ మురళి (పూర్వ ఆర్డీవో)
☞ హరిప్రసాద్(ప్రస్తుత ఆర్డీవో)
☞ వలీబసు-మదనపల్లె సీఐ(వీఆర్)
☞ గౌతమ్ తేజ్(సీనియర్ అసిస్టెంట్)
☞ హరిప్రసాద్, భాస్కర్(కానిస్టేబుళ్లు)

News July 30, 2024

చిత్తూరు: టీచర్ అవార్డులకు దరఖాస్తు

image

చిత్తూరు జిల్లాలో అర్హత ఉన్న ప్రభుత్వ టీచర్లు రాష్ట్రస్థాయి, నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్(NFTW) అవార్డులకు దరఖాస్తులు చేసుకోవాలని డీఈవో దేవరాజు సూచించారు. జడ్పీ, సాంఘిక సంక్షేమ, ఎయిడెడ్, మున్సిపల్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో పనిచేస్తున్న టీచర్లు అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తుల(మూడు సెట్లు)ను ఆగస్టు 5వ తేదీ లోపు MEO, DYEOకు అందజేయాలన్నారు.

News July 30, 2024

మోహిత్ రెడ్డికి బెయిల్.. షరతులు ఇవే!

image

తిరుపతిలో జరిగిన ఘర్షణ కేసులో మోహిత్ రెడ్డికి హైకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని పేర్కొంది. కేసులో ఛార్జిషీట్ వేసే వరకు 15 రోజులకు ఓసారి విచారణ అధికారి వద్ద హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. మోహిత్‌ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేసిన విషయం తెలిసిందే

News July 30, 2024

పెద్దిరెడ్డికి ప్రాణహాని లేదు: SRC

image

గతంలో మంత్రిగా ఉన్నప్పుడు తనకు ఉన్న 5+5 భద్రతను కొనసాగించాలంటూ పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో పెద్దిరెడ్డికి ప్రాణహాని లేదని సెక్యూరిటీ రివ్యూ కమిటీ(SRC) తేల్చిందని పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి హైకోర్టుకు వివరించారు. SRC నివేదికపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే సవాల్ చేసుకోవాలని జడ్జి జస్టిస్ BVLN చక్రవర్తి ఆదేశించారు.