Chittoor

News April 22, 2024

చిత్తూరు: మండుతున్న ఎండలు

image

చిత్తూరు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిండ్రలో 42.6, పులిచెర్లలో 42.4 పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే తవణంపల్లె 41.7, గుడుపల్లె 41.7, పెద్దపంజాణి 41.5, శ్రీరంగరాజపురం 41.4, గుడిపాల 41.2, పుంగనూరు 41.2, సదుం, బంగారుపాలెంలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రాత్రి వేళల్లోనూ 33 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు అవుతోంది.

News April 22, 2024

మదనపల్లె: పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

image

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరిని చిన్నపాటి రాక్షసి అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ ఎత్తివేస్తామని మాట్లాడారని ఆరోపించారు. అలాగే రాజంపేట ఎన్డీఏ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి వలన రాష్ట్రం రెండుగా విడిపోయిందని, సీఎంగా చేసిన కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందని అన్నారు.

News April 22, 2024

వైభవంగా శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ప్రారంభం

image

తిరుపతి శ్రీకోదండరామస్వామి తెప్పోత్సవాలు ఆదివారం శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను రామచంద్ర పుష్కరిణికి వేంచేపు చేశారు. రాత్రి తెప్పోత్సవం నిర్వహించారు.

News April 21, 2024

చిత్తూరు: వడదెబ్బ తగిలి ఏఎస్ఐకి తీవ్ర గాయాలు

image

తంబళ్లపల్లికి ఎన్నికల విధులకు వెళుతున్న ఏఎస్ఐ వడదెబ్బ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి కథనం.. ఎన్నికల విధులకు తంబళ్లపల్లికి వెళ్తున్న మదనపల్లి ట్రాఫిక్ ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం కురబలకోట మండలం, ముదివేడు క్రాస్ వద్ద వడదెబ్బ తగలడంతో రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. అదే సమయంలో మదనపల్లికి వస్తున్న లోకేశ్ అనే యువకుడు తన కారులో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

News April 21, 2024

మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన ఎంపీ రెడ్డప్ప

image

బి.ఫాం తీసుకోవడానికి మదనపల్లెకి వచ్చిన చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లకు మొక్కి బీఫాం అందుకున్నారు. ఈ కార్యక్రమం మదనపల్లెలో ఆదివారం ఎన్నికల ప్రచారసభ మిషన్ కాంపౌండ్‌లో జరిగింది. అందరూ కష్టపడి గెలవాలని పెద్ది రెడ్డి సూచించారు.

News April 21, 2024

అభ్యర్థులకు బీఫాంలు అందించిన పెద్దిరెడ్డి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీఫాంలు అందజేశారు. మదనపల్లెలో జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో భరత్(కుప్పం), వెంకటే గౌడ(పలమనేరు), డాక్టర్ సునీల్(పూతలపట్టు), రెడ్డెప్ప(చిత్తూరు ఎంపీ) వీటిని అందుకున్నారు. అందరూ కష్టపడి పనిచేసి గెలవాలని పెద్దిరెడ్డి సూచించారు.

News April 21, 2024

తంబళ్లపల్లెపై వీడని సస్పెన్స్

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు బీఫాంలు అందజేశారు. ముందు రోజు ఇచ్చిన సమాచారంతో అభ్యర్థులంతా మంగళగిరికి చేరుకున్నారు. చంద్రబాబు మినహాయిస్తే చిత్తూరు జిల్లాలో 13 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రా రెడ్డికి బీఫాం ఇవ్వలేదు. ఇక్కడ అభ్యర్థిని మార్చడం లేదా బీజేపీకి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీపాం ఇవ్వకుండా ఆపారు.

News April 21, 2024

తిరుపతి: ఆ రోజు కార్మికులకు సెలవు

image

ఎన్నికలు జరిగే మే 13న ఉద్యోగ, ఉపాధి, కార్మికులకు సెలవు రోజని కర్నూలు జోన్ సంయుక్త కార్మిక కమిషనర్ బాలు నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దుకాణాలు, సంస్థల చట్టం- 1988 ప్రకారం ఎన్నికల రోజున వేతనాలతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించారు. అర్హుడైన ఓటరుకు పోలింగ్ రోజున సెలవు ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘించి సెలవు జారీ చేయకపోతే జరిమానాతో కూడిన శిక్షార్హులని చెప్పారు.

News April 21, 2024

చిత్తూరు: పోస్టల్ బ్యాలెట్ గడువు పెంపు

image

పోస్టల్ బ్యాలెట్ గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు చిత్తూరు కలెక్టర్ షన్మోహన్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది ఫారం-12ను పూర్తి చేసి.. హెచ్ఓడీల ద్వారా కలెక్టర్‌కు అందజేయాలని సూచించారు. ఇందుకోసం ఈనెల 22 వరకు ఉన్న గడువును 23కు పెంచినట్టు చెప్పారు.

News April 21, 2024

ముగ్గురు పోలీసులపై సస్పెండ్ ఎత్తివేత

image

తిరుపతి జిల్లా పరిధిలో ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ తొలగించారు.ఈ మేరకు తిరుపతి జిల్లా SP కృష్ణకాంత్ పటేల్ ఉత్తర్వులు విడుదల చేశారు. చంద్రగిరిలో గంజాయి ముఠా అరెస్ట్ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ పురుషోత్తం నాయుడు, లంచం అడిగిన భాకరాపేట కానిస్టేబుల్ వెంకటరమణపై వేటు వేశారు. అలాగే మద్యం తాగి రైటర్‌తో గొడవపడిన పాకాల హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేశారు. తాజాగా వీరిపై సస్పెండ్ ఎత్తేశారు.