India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదివారం సాయంత్రం తిరుమలలోని పలు ప్రాంతాలను, దర్శన క్యూ లైన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆల్వార్ ట్యాంక్ అతిథి గృహాల వద్ద ఉన్న ఏస్ఎస్డీ క్యూలైన్లు, టోకెన్ తనిఖీ కేంద్రాలను పరిశీలించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1,2లోని కంపార్ట్మెంట్లు, సుపథం వద్ద చిన్నపిల్లల తల్లిదండ్రులు, దాతలతోపాటు వివిధ దర్శనాలను సంబంధిత అధికారులు ఆయనకు క్షుణ్ణంగా వివరించారు.
‘అరకాసుపల్లి కోటకు ఆరుగురు రెడ్లు, ఒక్కో రెడ్డికి ఆరుగురు భోగంసానులు’ అని కథలుగా చెప్పుకొన్న ఆ కోట నేడు కనుమరుగైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా రామసముద్రం(M) ఎలవానెల్లూరు పంచాయతీలో ఉన్న ఈ కోటపై పలువురి కన్నుపడింది. కోనేరు, నగారా రాయి, ధ్వజస్తంభం గుప్తనిధుల అన్వేషకులు నాశనం చేశారు. కోటను కొందరు ఆక్రమించి చదును చేసి తమ పొలంలో కలిపేసుకున్నారు.
9న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ. 10న కల్కి జయంతి. 13న తరిగొండ వెంగమాంబ వర్ధంతి. 14న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ. 15న స్వాతంత్య్ర దినోత్సవం. స్మార్త ఏకాదశి. 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు. 16న వరలక్ష్మీ వ్రతం. 19న శ్రావణ పౌర్ణమి. గరుడ సేవ. 27న శ్రీకృష్ణాష్టమి, తిరుమల శ్రీవారి ఆస్థానం.
మదనపల్లెలో పైళ్ల దగ్ధంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ‘ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదు. దెబ్బతిన్న సీసీ కెమెరాలనే కావాలనే బాగు చేయించలేదు. చుక్కల భూములను అక్రమంగా కొట్టేశారు. ఈ అక్రమాలు బయటకు రాకూడదనే కాల్చేశారు. 2,440 పైళ్లు కాలిపోగా 700 పైళ్లను కాపాడారు. ఈ ఘటనలో పెద్దిరెడ్డి పీఏ, ఆయన అనుచరుల ప్రమేయం ఉండొచ్చు’ అని సిసోడియా పేర్కొన్నారు.
విదేశాల్లో చదివిన వాడిని వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘నా కుమారుడి వయస్సు 25 ఏళ్లు. ప్రజా జీవితంలోకి వచ్చిన నా బిడ్డను అక్రమ కేసులో అరెస్ట్ చేయించారు. నన్ను మించి నా కొడుకు ప్రజల పక్షాన ప్రజా పోరాటాలు ఎలా చేస్తారో ఈ ప్రభుత్వానికి, పోలీసు అధికారులకు రుచి చూపిస్తారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు’ అని చెవిరెడ్డి అన్నారు.
జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU) నందు 2024-25 విద్యా సంవత్సరానికి గాను పార్ట్ టైం పద్ధతిలో సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలు https://nsktu.ac.in/ వెబ్సైట్లో చూడొచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 12.
తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని జేఈఓ కార్యాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ.. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు జరుగనున్నాయని తెలిపారు.
ఎన్నికల తర్వాత మే 14న పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్రూమ్ల పరిశీలనకు పులివర్తి నాని వెళ్లారు. అక్కడ ఆయనపై దాడి జరిగింది. చెవిరెడ్డి అనుచరులు తనపై దాడికి పాల్పడినట్లు నాని ఫిర్యాదు చేయడంతో భానుకుమార్రెడ్డి, గణపతిరెడ్డితోపాటు మరికొందరిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తర్వాత కేసుకు సంబంధించిన 34 మందిని జైలుకు పంపారు. ఇటీవల 37వ నిందితుడిగా చెవిరెడ్డి <<13721816>>మోహిత్రెడ్డి<<>> పేరు చేర్చారు.
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల తర్వాత చంద్రగిరి టీడీపీ అభ్యర్థి (ప్రస్తుత ఎమ్మెల్యే) పులివర్తి నానిపై దాడికి సంబంధించి మోహిత్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో పోలీసులు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ సర్పంచ్ ఈశ్వరమ్మ భర్త బండపల్లి అక్కులప్పను పోలీసులు తాజాగా అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఎంపీ మిథున్ రెడ్డికి అక్కులప్ప ప్రధాన అనుచరుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. పలు భూ అక్రమాల్లో ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.