Chittoor

News April 19, 2024

జీడీనెల్లూరు టీడీపీ అభ్యర్థి మార్పు..?

image

చిత్తూరు జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు జరిగేటట్లు తెలుస్తోంది. ప్రముఖ డాక్టర్ వీఎం థామస్‌కు చంద్రబాబు జీడీనెల్లూరు టికెట్ కేటాయించారు. ఆయన మత మార్పిడి కారణంగా ఎస్సీ సామాజికవర్గంలోకి రారని.. నామినేషన్ చెల్లదన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మాజీ ఎమ్మెల్యే ఆర్.గాంధీ గురువారం జీడీనెల్లూరు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన 1994లో వేపంజేరి MLAగా గెలిచారు.

News April 19, 2024

చిత్తూరు: వైసీపీకి సినీ విలన్ మద్దతు

image

చిత్తూరులో ఇవాళ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైసీపీ చిత్తూరు MLA అభ్యర్థి విజయానందరెడ్డి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సినీ విలన్ కబాలి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో విజయానందరెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.

News April 18, 2024

జీడీ నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

image

గంగాధరనెల్లూరు మండలం నెల్లేపల్లి బస్టాండ్ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కొత్తపల్లి మిట్టకు చెందిన గణేష్, వరదరాజపురానికి చెందిన చిన్నబ్బ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News April 18, 2024

చిత్తూరు: మొదటి రోజు నామినేషన్ వివరాలు

image

చిత్తూరు పార్లమెంటు స్థానానికి గురువారం ఒక నామినేషన్ దాఖలు అయినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. పుంగనూరు అసెంబ్లీ స్థానానికి నాలుగు, నగరిలో ఒకటి, జీడీ నెల్లూరులో రెండు, చిత్తూరులో రెండు, పలమనేరులో రెండు నామినేషన్లు దాఖలు అయినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. కుప్పం, పూతలపట్టు అసెంబ్లీ స్థానాలకు ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదు.

News April 18, 2024

చిత్తూరు: వైసీపీకి సినీ విలన్ మద్దతు

image

చిత్తూరులో ఇవాళ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైసీపీ చిత్తూరు MLA అభ్యర్థి విజయానందరెడ్డి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సినీ విలన్ కబాలి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో విజయానందరెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.

News April 18, 2024

తిరుపతి: TTCలో ప్రవేశాలకు దరఖాస్తులు

image

టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌(TTC) 42 రోజుల వేసవి ట్రైనింగ్‌ కోర్సుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మే 1 నుంచి జూన్‌ 11 వరకు శిక్షణ జరుగుతుంది. ఈనెల 25వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తిరుపతి జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు ఓ ప్రకటనలో కోరారు. అర్హత, ఇతర వివరాలకు www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు.

News April 18, 2024

అందరి చూపు మంత్రి పెద్దిరెడ్డి ఆస్తి వివరాలపైనే..!

image

నామినేషన్ల సమయంలో అభ్యర్థులు తమ ఆస్తి, కేసుల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రూ.130 కోట్ల ఆస్తి, రూ.20 కోట్ల అప్పులు ఉన్నట్లు చూపారు. తనకు కారు లేదని చెప్పారు. తనకు 50 గ్రామల బంగారం, భార్యకు 1.5 కేజీల బంగారం ఉందని వెల్లడించారు. మరి తాజా ఎన్నికల్లో ఆయన తన ఆస్తి ఎంత చూపిస్తారనేది జిల్లా ప్రజల్లో ఆసక్తి రేపుతోంది.

News April 18, 2024

తిరుపతిలో 16.97 లక్షలు సీజ్

image

సరైన పేపర్లు లేకుండా తరలిస్తున్న డబ్బును అలిపిరి పోలీసులు సీజ్ చేశారు. సీఐ రామచంద్రారెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ వాహనాలు తనిఖీ చేశారు. కాటన్ మిల్లు వద్ద బైకుపై తీసుకెళ్తున్న రూ.12.98 లక్షలు పట్టుకున్నారు. మంగళం రోడ్డు డీమార్ట్ వద్ద రూ.1.99 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి కేటీ రోడ్డులో మరో రూ.2 లక్షలు పట్టుబడింది. మొత్తంగా రూ.16.97 లక్షలు సీజ్ చేసి ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు అప్పగించారు.

News April 18, 2024

నలుగురికే అనుమతి: చిత్తూరు SP

image

నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతిస్తామని చిత్తూరు ఎస్పీ మణికంఠ స్పష్టం చేశారు. అభ్యర్థుల పీఎస్వోలను ఆర్వో కార్యాలయంలోకి అనుమతించబోమన్నారు. తుపాకులను వెంట తీసుకు వెళ్లరాదని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ర్యాలీలో టపాసులు కాల్చకూడదని చెప్పారు.

News April 17, 2024

తిరుపతి MLA అభ్యర్థికి బీఫాం అందజేత

image

తిరుపతి జిల్లాలో గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈక్రమంలో జనసేన తిరుపతి MLA అభ్యర్థి శ్రీనివాసులు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మంగళగిరిలో బీఫాం అందుకున్నారు. చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఆయనకే టికెట్ వచ్చింది. నాన్ లోకల్ అంటూ పలువురు ఆయన్ను వ్యతిరేకించినా అధినేత పవన్ అందరికీ సర్దిచెప్పారు.