India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పుంగనూరు పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్త హేమాద్రిని వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జానపద కళల అకాడమీ ఛైర్మన్ కొండవీటి నాగభూషణం ఇంటి వద్దకు వారు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వైసీపీ, టీడీపీ నాయకులను వెళ్లగొట్టారు. పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎన్నికల నిబంధనలు
ఉల్లంఘించిన ఘటనపై వైసీపీ, టీడీపీ నాయకులకు నోటీసులు అందించినట్లు ఏఆర్ఓ నాగేశ్వరరావు తెలిపారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పది మంది నాయకులకు నోటీసులు అందించామన్నారు. విగ్రహం వద్ద అనుమతి లేకున్నా వైసీపీ శ్రేణులు బైఠాయించి, నిరసన తెలపడంతో ఎమ్మెల్సీ భరత్, మరో 17 మందికి నోటీసులు జారీ చేశామన్నారు.
గుర్రంకొండ దవలత్ ఖాన్ పల్లికి చెందిన ఇద్దరు వాస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం.. గ్రామానికి చెందిన ఒకరి భార్య మరోక పురుషుడితో ఒకచోట ఉండగా భర్త గమనించి భార్యను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె వాస్మొల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి కూడా విషం తాగేశాడు. ఇద్దరిని వేరువేరు వాహనాల్లో మదనపల్లికి తరలించారు.
తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం క్రీస్తు పూర్వం 1402లో నరసింహ మొదలియార్ నిర్మించారు. ఇక్కడ సీతమ్మ రాముల వారికి కుడి వైపున, లక్ష్మణుడు ఎడమవైపున దర్శనమిస్తారు. తిరుమల శ్రీవారిని పోలిన విధంగా రాముడు దర్శనమిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న సీతారాముల విగ్రహాలలో కూడా ఇలాగే సీతమ్మ కుడి వైపు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయానికి ఎదురుగా ప్రసన్న ఆంజనేయస్వామి వారు కొలువై ఉన్నారు.
మదనపల్లి స్పెషల్ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పెద్దపంజాణి మండలం ముత్తుకూరుకు చెందిన మొగిలప్ప(67), సారా కేసులో అరెస్ట్ అయ్యాడు. పోలీసులు మొగిలప్పను తీసుకొచ్చి మదనపల్లి స్పెషల్ సబ్ జైల్లో ఉంచారు. రిమాండ్ ఖైదీగా ఉన్న మొగిలప్ప బుధవారం ఉదయం తను ఉంటున్న బ్యారక్ లోనే కుప్పకూలిపోవడం గుర్తించిన జైలర్లు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు
జిల్లాలో 2023 జనవరి 6 నుండి 2024 మార్చి 30 వరకు మొత్తం 337130 ఎపిక్ కార్డులను జనరేట్ చేయగా 314710 ప్రింట్ చేసి జిల్లా కలెక్టర్ నుంచి పోస్టల్ శాఖకు పంపారు. పోస్టల్ ద్వారా 265823 ఓటర్లకు పంపిణీ చేయగా అందులో 12875 రిటర్న్ రావడంతో బిఎల్ఓల ద్వారా 10439 ఓటర్ కార్డులు పంపిణీ చేసారు. బిఎల్ఓ వద్ద 2436, పోస్టల్ శాఖ వద్ద 60,868 ఓటర్ కార్డులు పంపిణీ కి సిద్ధంగా ఉన్నాయి.
గుర్రంకొండ మండలం తుమ్మల గొందిలో భూ వివాదం తలెత్తి తమ్ముడిని అన్న తుపాకీతో కాల్చి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుని కథనం.. మండలంలోని తుమ్మల గొంది హరిజనవాడలో కాపురం ఉంటున్న బాలపోగు విశ్వనాథ(45)కు అతని అన్న బాలపోగు జయప్పకు కొంతకాలంగా భూ వివాదమై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాత్రి ఇద్దరూ గొడవపడగా జయప్ప తుపాకీతో కాల్చారు.
జిల్లాలోని ఒక పార్లమెంట్, 7అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్లను నియమించినట్లు కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. చిత్తూరు పార్లమెంటు, నియోజకవర్గ ఎక్స్పెండీచర్ అబ్జర్వర్గా శంకర్రాప్రసాద్, నగరి అసెంబ్లీ, GDనెల్లూరు నియోజకవర్గాలకు జనరల్ అబ్జర్వర్గా కైలాశ్ వాంఖడే, చిత్తూరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలకు షాధిక్ అలం, ఎక్సెండీచర్ అబ్జర్వర్గా రోహన్రాఖుర్ నియమితులయ్యారు.
చిత్తూరు : ప్రేమ పెళ్లి చేసుకున్నాం రక్షణ కల్పించండని అని ఓ ప్రేమజంట జిల్లా ఎస్పీ మణికంఠను ఆశ్రయించారు. పెనుమూరు మండలం ఎగువ పూనేపల్లి గ్రామానికి చెందిన మౌలాలి కుమార్తె జాస్మిన్, తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ చారాల దళితవాడకు చెందిన మురుగేశ్ కుమారుడు తిరుమలేష్ మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త తిరుమలేశ్ ఎస్సీ కులస్తుడు కావడంతో మా తల్లిదండ్రులు అడ్డుపడ్డారని ఆమె వాపోయారు.
తిరుపతి: శ్రీవేంకటేశ్వర దూరవిద్య(DDE) విభాగం పరిధిలో గత ఏడాది సెప్టెంబర్లో పీజీ (PG) ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ & పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in, www.schools9.com ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Sorry, no posts matched your criteria.