Chittoor

News July 25, 2024

హైకోర్టులో పెద్దిరెడ్డిపై విచారణ

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఆస్తి వివరాలను దాచిపెట్టి ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని బీసీవై అధినేత రామచంద్రయాదవ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో పిటిషన్ వేయగా బుధవారం విచారణ జరిగింది. ఈ విచారణకు ఇరువర్గాల న్యాయవాదులతో పాటు పుంగనూరు రిటర్నింగ్ అధికారి హైకోర్టుకు హాజరయ్యారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది.

News July 25, 2024

హత్యలపై తిరుపతి ఎస్పీ ఆరా

image

తిరుపతి పద్మావతి వర్సిటీ సమీపంలోని మునిరెడ్డి నగర్‌లో బుధవారం రాత్రి జరిగిన హత్యల ఘటనా స్థలాన్ని ఎస్పీ సుబ్బారాయుడు పరిలించారు. ఘోర ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హత్యలకు ఆస్తి గొడవలా? లేక అక్రమ సంబంధమా? అనే కోణంలో ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 24, 2024

మదనపల్లె ఘటన.. పోలీసులపై వేటు

image

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధం ఘటనలో పోలీసులపై వేటు పడింది. సబ్ కలెక్టరేట్‌కు వన్ టౌన్ CI వల్లీబాషా పటిష్ఠ బందోబస్తు కల్పించలేదని గుర్తించిన ఉన్నతాధికారులు ఆయనను వీఆర్‌కు పంపించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం లేకపోవడం, అక్కడ పోలీసులను సెక్యూరిటీగా పెట్టకపోవడం వంటి అభియోగాలను ఆయనపై మోపి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అలాగే మరో ఇద్దరు పీసీలను సస్పెండ్ చేశారని సమాచారం.

News July 24, 2024

అన్నప్రసాదంలో సమూల మార్పులు: ఈవో

image

అన్నప్రసాదాల తయారీలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. టీటీడీకి బియ్యం సరఫరా చేస్తున్న రైస్‌మిల్లర్లతో ఈవో బుధవారం సమావేశం నిర్వహించారు. ఏపీ, టీఎస్‌కు చెందిన రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. వెంగమాంబ అన్నప్రసాదంలో వంట పరికరాలు దశాబ్దన్నర కాలం నాటివి కావడంతో వాటికి మరమ్మతులు చేయాలని అక్కడి సిబ్బంది ఈవో దృష్టికి తీసుకెళ్లారు.

News July 24, 2024

తిరుపతి : 27న జాబ్ మేళా

image

ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం నందు 27వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ MLT పూర్తి చేసిన వారు అర్హులన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొత్తం 870 ఉద్యోగాలు ఉన్నట్లు చెప్పారు.

News July 24, 2024

కుప్పం: పోస్టుల భర్తీకి దరఖాస్తు

image

కడా కార్యాలయంలో పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కడా పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. ముగ్గురు ఆఫీస్ సబార్డినేట్స్, వాచ్‌మెన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు రెండు పోస్టులు ఖాళీలు ఉన్నాయని వివరించారు. తమ క్వాలిఫికేషన్లతోపాటు, ఉద్యోగ అనుభవానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను projectdirectorekada@gmail.comకి పంపాలన్నారు.

News July 24, 2024

తిరుపతి: TTD బోర్డు రద్దు

image

TTD బోర్డు రద్దయింది. 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌‌అఫీషియో మెంబర్లతో కూడిన బోర్డును గత YCP ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త ప్రభుత్వం రావడంతో TTD ఛైర్మన్ ఇప్పటికే రాజీనామా చేయగా.. ఇప్పుడు 24 మంది సభ్యులు రాజీనామా చేశారు. వారందరి రాజీనామాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. వీరి రాజీనామాల ఆమోదంతో TTDకి కొత్త ఛైర్మన్, బోర్డు సభ్యులను ప్రభుత్వం నియమించుకోవాల్సి ఉంటుంది.

News July 24, 2024

తిరుపతి: దిండుతో అదిమి భర్తను చంపేసిన భార్య

image

పాడిపేట పంచాయతీ శివపురంలో దారుణం చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్ నరేశ్ (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. కొన్ని రోజులుగా భార్య ధనలక్ష్మి, నరేశ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో నరేష్ మృతి చెందడంతో స్థానికులు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మే హరి అనే వ్యక్తితో కలిసి తండ్రిని దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు కుమార్తె నిదిశ్రీ పోలీసులకు తెలిపింది.

News July 24, 2024

చిత్తూరు: విభిన్న ప్రతిభావంతులకు గమనిక

image

చిత్తూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు కృత్తిమ కాలు అమర్చేందుకు ఈనెల 26న ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. చెన్నైకు చెందిన ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరులోని రాస్(తపోవనం) వద్ద నిర్వహించే శిబిరంలో అర్హులు పాల్గొనేలా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రూ.51వేలు విలువైన ఆధునిక వెయిట్ లెస్ కాలు ఉచితంగా అమర్చుతారని చెప్పారు.

News July 24, 2024

చిత్తూరు: దరఖాస్తులకు నేడే చివరి తేదీ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ITI కళాశాలల్లో రెండో విడత ప్రవేశాల దరఖాస్తులకు బుధవారంతో గడువు ముగియనుంది. పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి ఉన్నవారు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలి. ఇతర వివరాలకు iti.ap.gov.in వెబ్‌సైట్ చూడగలరు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 24.