India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం కంచిబందార్లపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటించారు. ఆమె మట్లాడుతూ.. ఎక్కువ మెజారిటీ వచ్చిన బూత్ని తాను దత్తత తీసుకుంటానని ఎన్నికల సమయంలో చెప్పానన్నారు. మాట ప్రకారం కంచిబందార్లపల్లిని దత్తత తీసుకుంటున్నట్ల వెల్లడించారు. ఈ గ్రామాన్ని మోడల్ విలేజ్గా మారుస్తానని చెప్పారు.
తిరుపతిలోని రాయల్ నగర్లో ఈనెల 18న జరిగిన జయలక్ష్మి వృద్ధురాలి హత్య కేసులో నిందితుడు శ్రీనివాసులును పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ సుబ్బారాయుడు కేసు వివరాలను వివరించారు. జయలక్ష్మి ఇంటి పక్కనే ఉండే శ్రీనివాసులును 2019లో అతని తండ్రి మందలించడంతో హైదరాబాద్కు వెళ్లాడు. ఆ సమయంలో ఓ అమ్మాయిని తీసుకు వెళ్లిపోయాడని జయలక్ష్మి, ఆమె కుమార్తె రక్ష దుష్ప్రచారం చేశారు. కక్ష పెంచుకున్న శ్రీనివాసులు హత్య చేశాడు.
మదనపల్లె రైస్మిల్లు మాధవ రెడ్డి ఇంట్లో రెవెన్యూ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మంత్రిని అడ్డుపెట్టుకొని ఆర్డీవో సహకారంతో మదనపల్లె డివిజన్లో రూ.కోట్ల విలువైన భూములను కైవసం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధంలో కూడా ఆయన పాత్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
గుండెపోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన రామచంద్రాపురం మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. రేకలచేను గ్రామానికి చెందిన హేమంత్ (31) తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్తూ గుండెపోటుకు గురై పొలంలోని బురదలో కూరుకుపోయాడు. దీనిని గమనించి శునకాలు అరవసాగాయి. గుర్తించిన స్థానికులు అతనిని బయటకు తీశారు. మొదట కరెంట్ షాక్ తో మృతి చెందినట్లు భావించగా అధికారులు అక్కడికి వచ్చి పరిశీలించారు. షాక్ కొట్టలేదని నిర్ధారించారు.
మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధంపై సీఐడి చీఫ్ రవిశంకర్ రంగంలోకి దిగారు. మంగళవారం దర్యాప్తు బృందం కాలిన ఫైళ్లతో కూపీ లాగుతోంది. ఏయే విభాగాలకు చెందినవో గుర్తించేందుకు సేకరించిన ఫైళ్లను పరిశీలిస్తున్నారు. సోమవారం మదనపల్లెకు వచ్చిన DGP, సీఐడీ చీఫ్, ఎస్పీ, కలెక్టర్.. ఫైళ్ల దగ్ధం యాక్సిడెంట్ కాదని ఇన్సిడెంట్ వల్ల జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు.
మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధంపై పూర్వ RDO మురళి, ప్రస్తుత RDO హరిప్రసాద్ను అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. గతంలో ఒంగోలులో పనిచేసిన మురళిపై అవినీతి ఆరోపణ రావడంతో మదనపల్లె RDOగా ఉన్నప్పుడే సస్పెండ్ చేయడంతోపాటు MROగా రివర్షన్ సైతం ఇచ్చారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి జోక్యంతో సస్పెన్షన్ ఎత్తివేత, రివర్షన్ ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మురళి తిరుపతి కలెక్టరేట్లో పనిచేస్తున్నారు.
మిస్ యూనివర్స్ తెలంగాణ, AP, కర్ణాటక స్టేట్ 1వ ఆడిషన్ ఫినాలే పోటీలు హైదరాబాదులోని శ్రీనగర్కాలనీలో ఆదివారం నిర్వహించారు. ఇందులో శాంతిపురం మండలానికి చెందిన చందన జయరామ్ మిస్ యూనివర్స్ ఏపీగా ఎంపికయ్యారు. శాంతిపురం(మం) ఎంకేపురంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన చందన హైదరాబాద్లో టూరిజం-హాస్పటాలిటీ కోర్సు పూర్తి చేశారు. ఈ కిరీటాన్ని సొంతం చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధంపై విచారణ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విచారణకు మరికొందరు అధికారులు వెళ్లనున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియాను వెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం.
ఇంజినీరింగ్ కళాశాలల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్ రెండోవిడత ఆన్లైన్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కేటీరోడ్డులోని ఎస్వీప్రభుత్వ పాలి టెక్నిక్ హెల్ప్ లైన్ కేంద్రంలో ఈనెల 23 నుంచి 25వరకు మూడురోజులపాటు ఈ కౌన్సెలింగ్ జరగనుందని ప్రిన్సిపల్ డాక్టర్ వై.ద్వారకనాథరెడ్డి పేర్కొన్నారు.
లడ్డూ కౌంటర్, టీటీడీ రూములు కేటాయించే ఉద్యోగాలంటూ శ్రీలక్ష్మీశ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ పేరిట ఓ నోటిఫికేషన్ వైరల్ అవుతోంది. దీనిపై TTD స్పందించింది. ‘ఓ ఫేక్ నోటిఫికేషన్ వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అది ఫేక్ నోటిఫికేషన్. దానిని ఎవరూ నమ్మకండి’ అని TTD ట్వీట్ చేసింది.
Sorry, no posts matched your criteria.