India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుపతి: శ్రీవేంకటేశ్వర దూరవిద్య(DDE) విభాగం పరిధిలో గత ఏడాది సెప్టెంబర్లో పీజీ (PG) ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ & పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in, www.schools9.com ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, సీఎస్ఓ నాగభూషణం వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామి అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి, వేద పండితులు ఆశీర్వచనాలను అందజేశారు.
ఆలోచించి ఓటు వేయకపోతే మీ జీవితాలను ఇతరులకు రాసిచ్చినట్లేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. న్యాయ యాత్రలో భాగంగా మంగళవారం పీలేరు బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. వైసీపీ, టీడీపీలు బీజేపీకి బానిసలుగా మారారన్నారు. పీలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమశేఖర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజంపేట ఎంపీ అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
చిత్తూరు జిల్లాలో ఎల్లుండి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఎవరు, ఎక్కడ నామినేషన్ వేయాలో తెలుసా..?
➤ చిత్తూరు MP: చిత్తూరు కలెక్టర్ ఆఫీసు
➤ పుంగనూరు MLA: పుంగనూరు MRO ఆఫీసు
➤ నగరి MLA: నగరి MRO ఆఫీసు
➤ GDనెల్లూరు MLA: జీడీనెల్లూరు MRO ఆఫీసు
➤ చిత్తూరు MLA: జాయింట్ కలెక్టర్ ఆఫీసు, CTR
➤ పూతలపట్టు MLA: పూతలపట్టు MRO ఆఫీసు
➤ పలమనేరు MLA: పలమనేరు RDO ఆఫీసు
➤ కుప్పం MLA: కుప్పం MRO ఆఫీసు
చిత్తూరు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జాతర నిర్వహణపై కలెక్టర్ షన్మోహన్ కీలక సూచనలు చేశారు. మే 10 లోపు లేదా మే 15 తర్వాత గంగ జాతరలు చేసుకోవాలని కోరారు. ఆయన మాట్లాడుతూ.. జాతర నిర్వహణకు పోలీస్ స్టేషన్ నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. రోడ్లను బ్లాక్ చేయడం, ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ పార్టీల నాయకుల ఫోటోలు ఏర్పాటు చేయరాదని సూచించారు.
సీఎం జగన్పై సింపతీ ఎక్కడ పెరిగిపోతుందోనన్న భయం టీడీపీలో మొదలైందని.. అందుకే చంద్రబాబు తన మీద తానే రాళ్లు వేయించుకుంటున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ‘అలిపిరి బాంబ్ బ్లాస్ట్ తర్వాత చంద్రబాబు ఎన్నికలకు వెళ్లారు. సింపతీతో ప్రజలు ఓట్లు వేయరని ఆ ఘటన నిరూపించింది. సీఎం జగన్పై దాడి విషయంలో చంద్రబాబు, లోకేశ్ నీచంగా మాట్లాడుతున్నారు’ అని పెద్దిరెడ్డి మండిపడ్డారు.
నగరి నియోజకవర్గంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అల్లుడు, పుత్తూరు పట్టణ 11వ వార్డు వైసీపీ కౌన్సిలర్ జాన్ కెనడీ టీడీపీ గూటికి చేరారు. ఆయనకు నగరి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కెనడీతో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీని వీడారు. కోనేటి ఆదిమూలం కూడా వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరడం విశేషం.
సౌండ్ ఎక్కువ ఉన్న ప్రచార వాహనాలను సీజ్ చేయాలని కలెక్టర్ షన్మోహన్ ఆదేశించారు. సోమవారం ఆర్వోలు , ఏఆర్ఓలు , నోడల్ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఇంటింటి ప్రచారాలపై ముందస్తుగా పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలపై అధికారులు పరిశీలించాలన్నారు.
రామచంద్రాపురం మండలంలోని 23 పంచాయతీల పరిధిలో 130 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను ఎంపీడీవో ప్రత్యూషకు అందజేశారు. ప్రతిపక్షాలు తమపై ఆరోపణలు చేయడం బాధించాయని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కుప్పం మండలం మహమ్మద్ పురం పంచాయతీ గణేష్ పురానికి చెందిన వైసీపీ వార్డు సభ్యుడు పళణి సోమవారం టీడీపీ కుప్పం ఇన్ఛార్జ్ మునిరత్నం, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో పార్టీలో చేరారు. అయితే గంట గడవకముందే మళ్లీ చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వైసీపీ కండువా వేసుకుని సొంత గూటికి చేరారు.
Sorry, no posts matched your criteria.