India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుపతిలోని ఎస్వీయూ, వేదిక్ యూనివర్సిటీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం రాత్రి హెచ్ బ్లాక్ ప్రాంతంలో విద్యార్థులకు చిరుత కనిపించిందని సెక్యూరిటీ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఫారెస్ట్ అధికారులకు యూనివర్సిటి సిబ్బంది సమాచారం ఇచ్చారు. కుక్కలు, దుప్పిల కోసం చిరుత వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వేదిక్ యూనివర్సిటీలో పాద ముద్రలు ఉన్నట్లు గుర్తించారు.

తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియమితులయ్యారు. ఆయనకు గతంలోనూ తిరుపతి ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ ఎస్పీ సుబ్బరాయుడును బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన్ను తిరిగి తిరుపతిలోనే ఎర్రచందనం టాస్క్పోర్స్ ఎస్పీగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

కలిచర్లలో యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు ఎస్ఐ పీవీ రమణ తెలిపారు. పెద్దమండెం మండలం, ఖాదర్ షరీఫ్ కుమారుడు ఉస్మాన్(21) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో ఉస్మాన్ ఊరికి సమీపంలోనే ప్రభుత్వ కళాశాల సమీపంలోని వ్యవసాయ బావి వద్ద చెట్లపొదల్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చిత్తూరు జిల్లాలో సంక్రాంతి సెలవులు ముగియడంతో నేటి నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. వారం నుంచి ఇంటి వద్ద సంతోషంగా గడిపిన చిన్నారులు స్కూళ్లకు బయలుదేరారు. స్నేహితులతో ఆటలు, అమ్మచేతి కమ్మని వంట, బంధువుల ఆప్యాయత మధ్య గడిపిన మధుర క్షణాలను నెమరు వేసుకుంటూ స్కూళ్లకు వెళ్లారు. పలువురు ‘అమ్మా.. ఇవాళ నాకు కడుపు నొప్పి.. నేను బడికి వెళ్లను అంటూ మారం చేస్తున్న ఘటనలు అక్కడక్కడా జరుగుతున్నాయి. మీరు ఇలానే చేశారా?

చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా ఉన్న మధుబాలను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో గ్రంథాలయ ఛైర్మన్లను నియమించారు. అయితే ఇవి నామినేటెడ్ పోస్టుల కావడంతో కొందరు ప్రభుత్వం మారిన కొనసాగుతున్నారు. దీంతో వారిని తొలగిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు విడుదల చేశారు.

ఈ నెల 20వ తేదీన జరగవలసిన కానిస్టేబుల్ల అప్పీల్ కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసినట్లు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. అప్పీల్ చేయవలసిన అభ్యర్థులు గమనించాలని కోరారు. తల్లితండ్రులు దళారులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అలాంటివారు ఎవరైనా ఉంటే 112, 9440900005 నంబర్లకు మెసేజ్ చేయాలని కోరారు.

చిత్తూరు జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఈక్రమంలో ఓ మహిళ గాయపడింది. వెంటనే రిక్రూట్మెంట్ ఇన్ఛార్జ్, సత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న సంబంధిత సిబ్బంది ద్వారా ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు వాయల్పాడుకు చెందిన షకీలాగా గుర్తించారు. 1600 మీటర్ల పరుగు పందెంలో కాలుజారి కిందపడటంతో గాయపడ్డారు.

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై గవర్నర్ కార్యదర్శి, ముఖ్యమంత్రిని ప్రతివాదులుగా చేర్చుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తొక్కిసలాటకు గవర్నర్ కార్యదర్శి, సీఎం ఎలా బాధ్యులవుతారని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ప్రతివాదులుగా ఉన్నారని.. వెంటనే పిటిషన్లో సీఎం, గవర్నర్ కార్యదర్శి పేర్లను తొలగించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే బుధవారం(22వ తేదీ)కి వాయిదా పడింది.

డీఆర్డీఏ, సీడాప్ ఆధ్వర్యంలో పీఎంఎఫ్ఎంఈ ద్వారా తిరుపతి జిల్లాలో రిసోర్స్ పర్సన్ ఎంపిక చేయనున్నట్లు పీడీ శోభన్ బాబు తెలిపారు. ఏపీ పుడ్ ప్రొసెసింగ్ సొసైటీ ద్వారా మండల స్థాయిలో పని చేసే అవకాశం ఉంటుంది. మైక్రో పుడ్ ప్రోసెసింగ్ ఏర్పాటుతో పాటు మొబిలైజేషన్ చేపట్టాల్సి ఉంటుంది. జీతం ఉండదు. కేవలం ఇన్సెంటివ్పై పనిచేయాల్సి ఉంటుంది. ఈనెల 20వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

చిత్తూరు గంగాసాగరం రోడ్డు ప్రమాదంలో అనేక విషాద ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తిరుపతిలోని సప్తగిరి నగర్కు చెందిన పొన్ను చంద్ర(38) తల్లితో కలిసి మధురైలోని ఆసుపత్రికి బయల్దేరారు. తల్లి కింద సీటులో కూర్చోగా.. చంద్ర పైన సీటులో నిద్రించారు. బస్ బోల్తా పడినప్పుడు ఓ కరెంట్ స్తంభం బస్లోకి దూసుకొచ్చింది. దీంతో చంద్ర చనిపోగా.. తల్లి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ కళ్లెదుటే కొడుకు చనిపోవడంతో నిర్ఘాంతపోయారు.
Sorry, no posts matched your criteria.