India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి పరీక్షా పత్రాల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందని DVEO.సయ్యద్ మౌలా శనివారం తెలిపారు. ఈ నెల 18 నుంచి 24 వరకు సబ్జెక్టుల వారీగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 24 నుంచి జూన్ ఒకటి వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని డీవీఈవో తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు మే 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరుగుతాయన్నారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాహు కేతు పూజలు చేయించారు. దర్శనం అనంతరం స్వామి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్ వి నాగేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.
అంగళ్లు మిట్స్ కళాశాల స్ట్రాంగ్ రూంకు ఈవీఎం పెట్టెలు చేరినట్లు ఎస్సై మల్లికార్జున రెడ్డి తెలిపారు. సార్వత్రిక, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈవీఎంలను భద్రపరిచిన పెట్టెలను శనివారం కురబలకోట మండలం, అంగళ్లు మిట్స్ కళాశాల స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద కేంద్ర పార మిలిటరీ బలగాలతో పటిష్ఠ భద్రత ఏర్పాటుచేశామని తెలిపారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో రమేష్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఏవిఎస్వో సతీష్ కుమార్, ఆర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫలితాలు రావడం, ఆదివారం తమిళ ఉగాది కావడంతో శనివారం తిరుమలలో భక్తల రద్దీ పెరిగింది. నడక మార్గం, రోడ్డు మార్గం ద్వారా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తిరుమలకు వస్తున్నారు. భక్తుల కోసం టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. సర్వ దర్శనానికి 20 గంటలు సమయం పడుతుందన్నారు.
పుంగనూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఆ పార్టీ కార్యాలయం శనివారం తెలిపింది. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సెక్టర్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్ల పాత్ర ఎంతో కీలకమని జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి నియోజకవర్గ పరిధిలోని సెక్టార్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, మాస్టర్ ట్రైనర్లకు శనివారం నగర పాలక కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ, కోడ్ అమలు పోలింగ్ రోజు నిర్వహించాల్సిన విధులపై అవగాహన పెంచుకోవాలన్నారు.
భీమవరం, గాజువాకలో ఓడిపోవడంతో పిఠాపురంలో పవన్ కొత్తగా ప్రచారం చేసుకుంటున్నారని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. 175 నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి అక్కడ వంగాగీత బలమైన నేత అని, ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి సూట్ కేసు తీసుకోని బీజేపీలో చేరారని ఎద్దేవా చేశారు. పిఠాపురంలో వంగాగీత గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ నందు కాంట్రాక్ట్ ప్రాతిపదికగా రీసెర్చ్/ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ రజిని ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం రెండు ఖాళీలు ఉన్నాయి. పిజి డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ/ ఫార్మసిటికల్ సైన్స్/ ఎంటెక్ లైఫ్ సైన్స్ పూర్తి చేసిన వారు అర్హులు. ఇతర వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 22.
తాను మరణించినా అవయవదానంతో మరికొందరికి ప్రాణం పోయాలనే ఆలోచన ఈరోజుల్లో కొంతమందికే కలుగుతోంది. తమ వాళ్లు మరణించినా అంత దు:ఖంలోనూ అవయవదానానికి ముందుకు వచ్చే వాళ్లకు నిజంగా హ్యాట్సాఫ్. శనివారం ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలు నుండి గుండె, లివర్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. అనంతరం అక్కడ నుండి పోలీసుల భద్రత నడుమ ప్రత్యేక ఆంబులెన్స్ లలో గుండెను శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ ఆసుపత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.