Chittoor

News July 17, 2024

చంద్రగిరిలో దొంగ ఓట్లపై సీఐడీ విచారణ

image

చంద్రగిరిలో దొంగ ఓట్లపై అప్పట్లో ఎమ్మెల్యే పులివర్తి నాని ఫిర్యాదు చేశారు. చెవిరెడ్డి ఆఫీసు నుంచే ఒక్క రాత్రిలోనే దొంగ ఓట్లకు 10 వేల అప్లికేషన్లు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓటర్ల జాబితా తయారీ తిరుపతి RDO చేయాల్సినప్పటికీ.. చెవిరెడ్డి దగ్గర పనిచేసిన గూడూరు RDO ఇందులో కీలకంగా వ్యవహరించారని విమర్శలు ఉన్నాయి. ఈనేపథ్యంలో నిన్న CID అధికారులు తిరుపతి ఆర్డీవో, తుడా ఆఫీసులకు వెళ్లి వివరాలు ఆరా తీశారు.

News July 17, 2024

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

image

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారిని మంగళవారం 71,409 మంది దర్శించుకున్నారు. 26,128 మంది తలనీలాలు సమర్పించారు. రూ.4.15 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారని టీటీడీ అధికారులు బుధవారం తెలిపారు.

News July 17, 2024

పెద్దిరెడ్డి ఫ్యామిలీ 3వేల ఎకరాలు కబ్జా చేసింది: మంత్రి

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై రవాణ శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి 3 వేల ఎకరాలను కబ్జా చేశారు. పులిచెర్ల, అంగళ్లు, పుంగనూరు, తిరుపతిలో భూములు కాజేశారు. పోలీసులను అడ్డంపెట్టుకుని రూ.కోట్ల విలువైన ఎర్రచందనాన్ని చైనాకు తరలించారు. తమిళనాడు, కర్ణాటకకు ఇసుక తరలించి సొమ్ము చేసుకున్నారు’ అని మంత్రి ఆరోపించారు.

News July 17, 2024

తిరుపతి: IGNOUలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) నందు 2024-25 విద్యా సంవత్సరానికి యూజీ (UG), పిజి (PG), పీజీ డిప్లమా సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు తిరుపతి ప్రాంతీయ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు http://www.ignou.ac.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 31.

News July 17, 2024

కుప్పం ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ప్రణాళికలు

image

చిత్తూరు జిల్లా కుప్పంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కుప్పంతో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)కు సీఎం చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. కాగా చిన్నతరహా ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం కోసం 1,800 ఎకరాల భూమి అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి AAI వర్గాలు సూచించాయి.

News July 16, 2024

తిరుపతి : LLB ఫలితాలు విడుదల

image

తిరుపతి : శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 3/5 సంవత్సరాల ఎల్.ఎల్.బి (CBCS) 5,9 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణాధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. అభ్యర్థులు ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News July 16, 2024

TTD JEOగా వెంకయ్యచౌదరి

image

తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా 2005 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి వెంకయ్య చౌదరి నియమితులయ్యారు. డిప్యూటేషన్‌పై ఏపీలో మూడేళ్లపాటు పనిచేయనున్నారు. వెంకయ్య చౌదరిని డిప్యూటేషన్‌పై ఏపీకి పంపేందుకు కేంద్రప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది.

News July 16, 2024

విద్యార్థికి ఆర్థిక సాయం అందజేసిన కలెక్టర్

image

చిత్తూరు సంతపేట బండ్ల వీధికి చెందిన టింపుల్ అనే విద్యార్థి 6వ తరగతి చదువుతోంది. టింపుల్ తల్లిదండ్రులు మరణించారని, తన చదువు, ఆరోగ్య సంరక్షణ కోసం తమను ఆదుకోవాలని కలెక్టర్ ను ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కోరారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద కలెక్టర్ సుమిత్ కుమార్ రూ.25 వేలును టింపుల్ కు ఆర్థిక సహాయం అందజేశారు.

News July 16, 2024

REWIND: తిరుపతిలో గద్ద ముక్కు ఆటోలు

image

అవి 1980 నాటి రోజులు. అప్పుడే తిరుపతి పట్టణంగా అభివృద్ధి చెందుతోంది. ఆ రోజుల్లో తిరుచానూరు, రేణిగుంటకు వెళ్లాలంటే ఈ గద్ద ముక్కు ఆటోలే(టెంపోలు) దిక్కు. కోనేటి కట్ట దగ్గర(నేటి విష్ణు నివాసం) నుంచి చిత్తానూరు(తిరుచానూరు)కు ఇవి బయల్దేరేవి. రబ్బరు గొట్టం హారన్ మోగిస్తే వచ్చే శబ్దంతో ఎంతటోడైనా హడలేత్తి పక్కకు జరగాలసిందే. ఇందులో ప్రయాణం మరచిపోలేని అనుభూతి. మీరు ఇందులో ప్రయాణించి ఉంటే కామెంట్ చేయండి.

News July 16, 2024

నేడు, రేపు సెలవు: చిత్తూరు DEO

image

మొహర్రం సందర్భంగా చిత్తూరు జిల్లాలోని పాఠశాలలకు మంగళ, బుధవారాల్లో సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో దేవరాజు తెలిపారు. మంగళవారం ఆప్షనల్ సెలవుగా ఉంటుందన్నారు. ఆయా యాజమన్యాలు ఇష్టప్రకారమే మంగళవారం సెలవు అని.. బుధవారం ప్రభుత్వ సెలవు రోజని చెప్పారు. మరోవైపు తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోనూ మంగళవారం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు.