India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘అటవీ, మైనింగ్ శాఖలకు ఒకే మంత్రి ఎక్కడా ఉండరు. తొలిసారి గత ప్రభుత్వం ఈ రెండింటిని ఒకరికే కట్టబెట్టి, దొంగచేతికి తాళాలిచ్చి దోచేసింది’ అని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి సీఎం చంద్రబాబు అన్నారు. ‘పుంగనూరు, కార్వేటినగరంలో అటవీ భూమిని ఆక్రమించి 6.72 హెక్టార్లలో అక్రమ మైనింగ్ చేశారు. మండిపడ్డారు. ఇదే ప్రాంతంలో 19.581 హెక్టార్ల అటవీ భూమిని ఆక్రమించారు’ అని CM ఆరోపించారు.
పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. చిత్తూరు డివిజన్లో 67, తిరుపతి డివిజన్లో 79 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. చిత్తూరు డివిజన్లో 67, తిరుపతి డివిజన్లో 79 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
ప్రైవేటు బస్సును బైకు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషాదకర ఘటన సోమవారం సాయంత్రం మదనపల్లి మండలంలో చోటు చేసుకుంది. సీఐ శేఖర్ కథనం ప్రకారం.. మదనపల్లె పట్టణం, బెంగుళూరు రోడ్డులోని చీకిలబైలు సరిహద్దు చెక్పొస్ట్ వద్ద ఓ ప్రయివేట్ బస్సును బైకు ఢీకొంది. బైక్పై వెళ్తున్న ఇద్దరు గుర్తు తెలియని యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జూలై 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూలై 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి.
తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కడపకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా పోలీసు అధికారులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసు అతిథి గృహం వద్ద ఆదివారం రాత్రి జిల్లా అధికారులు పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఆయన సేవలను కొనియాడారు. తనకు సహకరించిన వారికి ఎస్పీ కృతజ్ఞతలు చెప్పారు. అడిషనల్ ఎస్పీలు విమలాకుమారి, కులశేఖర్ పలువురు అధికారులు పాల్గొన్నారు.
తల్లి, బిడ్డ చనిపోయిన విషాద ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. శ్రీకాళహస్తి(M) రామానుజపల్లి ఎస్సీ కాలనీకి చెందిన శారద(22), కుమార్తె గురువైష్ణవి (2), కుమారుడు గురు కార్తిక్(4)తో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో రామానుజపల్లి క్రాస్ వద్ద బస్సు దిగారు. భర్త వస్తాడని రోడ్డు పక్కన కూర్చొన్న వాళ్లపైకి చెన్నై వెళ్తున్న లారీ దసూకొచ్చింది . శారద, వైష్ణవి చనిపోగా కార్తిక్ చికిత్స పొందుతున్నాడు.
ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో పార్ట్ టైం, ఫుల్ టైం ప్రాతిపదికగా కోచ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్ & జిమ్, టెన్నిస్ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. B.P.ED చేసి, సంబంధిత క్రీడలో అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.iittp.ac.in వెబ్సైట్ చూడాలి. చివరి తేదీ జూలై 22.
రేణిగుంట ఎయిర్పోర్ట్ సమీపంలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్(IIDT)లో 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. AI/ML సైబర్ సెక్యూరిటీ/ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు iidt.ap.gov.in వెబ్సైట్ చూడాలి. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 31.
తిరుపతి జిల్లా బీఎన్ కండ్రిగ మండలం పుత్తేరిలో రైతు సేవా కేంద్ర భవనం ప్రారంభించారు. సంబంధిత శిలాఫలకంలో సీఎం చంద్రబాబు ఫొటో పెట్టినా.. ఆయన పేరును మాత్రం విస్మరించారు. ఎలాంటి ప్రొటోకాల్ లేని స్థానికుల పేర్లును సైతం అందులో పెట్టి సీఎం పేరు విస్మరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై స్థానిక టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు.
Sorry, no posts matched your criteria.