Chittoor

News April 8, 2024

చిత్తూరు: నిన్న వైసీపీలోకి.. నేడు టీడీపీలోకి

image

గుడిపల్లి : మండల పరిధిలోని గుండ్ల సాగరం పంచాయతీ పరిధిలో ఆదివారం చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ శ్రేణులు 24 గంటలు గడవక ముందే మళ్లీ యూ టర్న్ తీసుకున్నారు. గుండ్ల సాగరం గ్రామానికి చెందిన పది కుటుంబాలు సోమవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో సొంత గూటికి చేరారు. కుప్పం నియోజకవర్గంలో ఇలా 24 గంటలు గడవక ముందే నేతలు సొంతగూటికి చేరుతుండడం రాజకీయంగా చర్చనీయంగా మారింది.

News April 8, 2024

REWIND.. రికార్డు సృష్టించిన గల్లా అరుణకుమారి

image

చంద్రగిరి నియోజకవర్గం నుంచి గల్లా అరుణకుమారి ఆరుసార్లు పోటీ చేసి నాలుగుసార్లు గెలిచారు. 1989 కాంగ్రెస్ నుంచి పోటీచేసి NRJ నాయుడుపై గెలిచారు. 1994లో పోటీ చేసి N రామ్మూర్తి నాయుడు చేతిలో ఓడిపోయారు. 1999,2004,2009లో మూడుసార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించి రికార్డు సృష్టించారు. 2014లో పోటీచేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈమె మూడుసార్లు మంత్రిగా పని చేశారు.

News April 8, 2024

తిరుపతి: ఈ మండలాల ప్రజలకు రెడ్ అలర్ట్

image

తిరుపతి జిల్లాలో పలు మండలాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నాగలాపురం 40, KVB.పురం 40,నారాయణవనం 42,పాకాల 42,పుత్తూరు 42,చిన్నగొట్టిగల్లు 42, BN.కండ్రిగ 42,పిచ్చాటూరు 43,చంద్రగిరి 42, తొట్టంబేడు 43,తిరుపతి రూరల్ 42,సత్యవేడు 40,రేణిగుంట 41,రామచంద్రాపురం 42,తిరుపతి అర్బన్ 42,వడమాలపేట 42,వరదయ్యపాలెం 39, ఏర్పేడు 40,ఎర్రావారిపాళెం 42 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 7, 2024

చిత్తూరు: ఎంపీపీపై మరోసారి దాడి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా బి.కొత్తకోట ఎంపీపీ లక్ష్మీనరసమ్మపై <<13008228>>వాలంటీర్ <<>>ఆదివారం రెండోసారి దాడి చేశాడు. బాధితురాలి వివరాల మేరకు.. బుచ్చిరెడ్డిపల్లికి చెందిన వాలంటీర్ నరేశ్ గ్రామంలో చెట్లు నరికేశాడని ఎంపీపీ లక్ష్మీనరసమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వాలంటీరు ఆమె కుటుంబ సభ్యులపై శనివారం దాడి చేసి గాయపరిచాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ ఎంపీపీ తన ఇంట్లో ఒంటరిగా ఉండడంతో మరోమారు దాడి చేశాడు.

News April 7, 2024

మదనపల్లె: చెరువులో పడిపోయిన బొలెరో

image

మదనపల్లె సమీపంలోని తట్టివారిపల్లి చెరువులో బొలెరో వాహనం పడిపోయిన సంఘటన ఆదివారం జరిగింది. తాలూకా పోలీసుల కథనం మేరకు.. మండలంలోని, సీటీఎంరోడ్డు తట్టివారిపల్లి చెరువులోకి ఓ బొలెరో వాహనం దూసుకెళ్లింది. డ్రైవర్ తాగిన మైకంలో వాహనం నడిపడంతో బొలెరో అదుపుతప్పి చెరువులో పడిపోయింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

News April 7, 2024

తవణంపల్లెలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె మండలంలో శనివారం అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పులిచెర్లలో 43.6, ఎస్ఆర్ పురం 42.9, విజయపురం, నగరి, నిండ్ర 42.8,పుంగనూరు, బంగారుపాళ్యం 41.5,సోమల 41.4,చిత్తూరు, సదుం 41.2,పాలసముద్రం, గుడిపల్లె 41,కుప్పం 40.9,చౌడేపల్లె, యాదమరి,రొంపిచెర్ల, ఐరాల 40.8, జీడీనెల్లూరు, వెదురుకుప్పం 40.7,కార్వేటినగరం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News April 7, 2024

సత్యవేడు: మద్యం మత్తులో బావిలో పడి మృతి

image

మద్యం మత్తులో బావిలో స్నానం చేయడానికి వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సత్యవేడు మండలంలో చోటుచేసుకుంది. ఎలుమలై (44) అనే వ్యక్తి మద్యం మత్తులో మండలంలోని నాగాలమ్మ దేవాలయం వద్ద బావిలో స్నానం చేయడానికి వెళ్లి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరాంజనేయులు తెలిపారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 7, 2024

పిచ్చాటూరు: ఆస్తికోసం అవ్వను చంపిన మనవడు అరెస్టు

image

పిచ్చాటూరు మండలంలో నాలుగు రోజుల క్రితం ఆస్తికోసం రాజమ్మను చిన్న కుమారుడు కృష్ణారెడ్డి, ఆమె మనవడు ఇళంగోవర్ రెడ్డి, కోడలు గౌరీ అతి దారుణంగా గొంతు కోసి చంపారు. వీరిలో మనవడు ఇళంగోవర్ రెడ్డిని శనివారం సీఐ భాస్కర్ నాయక్, ఎస్సై వెంకటేశ్వర్లు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కృష్ణారెడ్డి, గౌరీ లను, త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

News April 7, 2024

కల్లూరు: అడవి ప్రాంతంలో చిరుత పులి సంచారం

image

పులిచెర్ల మండలం కల్లూరు అడవి ప్రాంతంలో శనివారం రాత్రి చిరుతపులి సంచరించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కల్లూరు నుంచి కొమ్మిరెడ్డిగారిపల్లెకు కారులో వెళుతున్న స్థానికులు చిరుతపులి రోడ్డు దాటడాన్ని గుర్తించారు. వెంటనే కల్లూరు ఎస్సై రవి ప్రకాష్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. పులి సంచరించిన ప్రాంతానికి చేరుకున్న ఎస్సై పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News April 6, 2024

తిరుపతి : M.TECH ఫలితాలు విడుదల

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది డిసెంబర్ నెలలో ఎంటెక్ రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఫలితాలు శనివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in, www.schools9.com ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.