India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వెలగపూడిలోని సచివాలయంలో CM చంద్రబాబును కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ అధికారులు, పూతలపట్టు MLA మురళీ మోహన్ కలిశారు. స్వామివారి శేషవస్త్రాలతో CMను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను CM చేతుల మీదుగా ఆవిష్కరించి ఆహ్వానించారు. అలాగే దేవాదాయ శాఖ మంత్రి నారాయణ రెడ్డిని, CS నీరభ్ కుమార్ను కూడా బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానం పలికారు.

కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి స్పెషల్ ఆఫీసర్లుగా IASలను నియమించింది. చిత్తూరు జిల్లాకు పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఎం.నాయక్ IAS(2005), తిరుపతి జిల్లాకు ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ IAS(2006), అన్నమయ్య జిల్లాకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ సూర్యకుమారి IAS(2008)ని కేటాయించింది.

పెద్దబంగారునత్తం చెరువులో శుక్రవారం ఉదయం మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు కుప్పం పోలీసులకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహిళ కుప్పం బాలుర ఉన్నత పాఠశాలలో గణిత ఉపాద్యాయురాలిగా పనిచేస్తున్న శ్రీదేవి (48)గా సమాచారం. ఇటీవలే ఆమెకు కవల పిల్లలు పుట్టి 28 రోజులు అయిందని, ఈమె ప్రస్తుతం ప్రసూతి సెలవులలో ఉన్నట్టు తోటి అధ్యాపకులు తెలిపినట్లు పోలీసులు వివరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ATM కేంద్రంలో ఏమార్చి.. కార్డు మార్చేసి రూ.86వేలను అపహరించిన ఘటన ఈ నెల 22న కల్లూరులో చోటుచేసుకుంది. కల్లూరు ASI రాజారెడ్డి కథనం మేరకు.. మండలంలోని కట్టకిందపల్లెకు చెందిన గురుమూర్తినాయుడు ఈనెల 22న కల్లూరులోని ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో నగదు తీసేందుకు యత్నించగా రాలేదు. పక్కనే ఓ గుర్తు తెలియని వ్యక్తి సాయం చేస్తున్నట్లు నటించి ఏటీఎం కార్డు మార్చేశాడు.మరుసటిరోజు 86 వేలు డ్రా చేసుకున్నాడు.

పిల్లల గొడవపై పంచాయితీ పెట్టి కాళ్లు విరగ్గొట్టిన ఘటన పీటీఎం మండలంలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. కమ్మచెరువుకు చెందిన నరేశ్ ఆటో నడుపుతుంటాడు. తన ఇద్దరు పిల్లలు గ్రామానికి చెందిన నరసింహులు పిల్లలతో నిన్న గొడవపడ్డారని రాత్రి పెద్ద మనుషులతో నరసింహులు పంచాయతీ పెట్టించాడు. అక్కడ తన పిల్లల్ని కొడుతుంటే నరేశ్ తిరగబడ్డాడు. దీంతో రెచ్చిపోయిన నరసింహులు వర్గం నరేశ్పై కర్రలతో దాడిచేసి కాళ్లు విరగ్గొట్టారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని టీటీడీ ఈఓ శ్యామల రావు అన్నారు. గురువారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన అమ్మవారి ఆలయం, వాహన మండపం, నాలుగు మాడా వీధులు, పుష్కరిణి ప్రాంతాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. తిరుమల తరువాత అంతటి ప్రాశస్త్యం కలిగిన అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

తిరుపతి : శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జూలై నెలలో పీజీ (PG) M.A, M.SC 4వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు గురువారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

మాజీ ఎంపీ రెడ్డప్పకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నూతన కారును అందజేశారు. పుంగునూరులో జరిగిన అల్లర్లలో టీడీపీ శ్రేణులు మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీలో నష్టపోయిన వారికి తాను అండగా ఉంటానని ఎంపీ మిథున్ గతంలోనే ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు ఆయన రెడ్డప్పకు కొత్త కారును అందజేశారు.

కలికిరి JNTU కళాశాలలో ర్యాగింగ్కు గురైన విద్యార్థి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా, మైదుకూరు జీవి సత్రానికి చెందిన సి.ప్రవీణ్(21) ఈనెల 12న కలికిరి JNTUలో బీటెక్ చదివేందుకు కాలేజీలో జాయిన్ అయ్యాడు. ప్రవీణ్ను సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో ఇంటికి వెళ్లి 26 రాత్రి విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు తిరుపతి రుయాకు తీసుకెళ్లగా గురువారం మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు.

నగలు కాజేసిన ఇద్దరు మహిళలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తిరుపతిలో బెంగుళూరుకు బస్సు ఎక్కిన ఉమాదేవితో బంగారుపాళెం వద్ద బస్సు ఎక్కిన మహిళలు పక్కనే కూర్చుని మాటలు కలిపారు. ఆమె వద్ద ఉన్న నగల సంచి మాట్లాడుతూనే కాజేసి పలమనేరులో దిగిపోయారు. మహిళ పోలీసులను ఆశ్రయించింది. సీఐ నరసింహరాజు బృందం వారిని పట్టుకుని రూ.4.5 లక్షల విలువైన ఆభరణాలు ఉమాదేవికి అప్పగించారు. నిందితులు చిత్తూరు వాసులుగా గుర్తించారు.
Sorry, no posts matched your criteria.