Chittoor

News April 5, 2024

చిత్తూరు: 95 శాతం పెన్షన్లు పంపిణీ

image

చిత్తూరు జిల్లాలో 95 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయినట్లు కలెక్టరేట్ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగిరి మున్సిపాలిటీ 98 శాతం, చిత్తూరు మున్సిపాలిటీ 98 శాతం, పలమనేరు మున్సిపాలిటీ 97%, పుంగనూరు మున్సిపాలిటీ 97% పెన్షన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే నగరి 97%, రామకుప్పం 97%, సోమల 97%, అత్యధికంగా పంపిణీ చేశారు. మిగిలిన ప్రాంతాల్లో 95 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయింది.

News April 5, 2024

పెద్దశేష వాహనంపై శ్రీ కోదండరాముడి వైభవం

image

తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శుక్ర‌వారం రాత్రి 7 గంటలకు పెద్దశేషవాహనంపై శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు కనువిందు చేశారు. గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

News April 5, 2024

తిరుపతి: టీడీపీలో చేరిన వైసీపీ ZPTC

image

తిరుపతి జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. పాకాల జడ్పీటీసీ నంగా పద్మజ, ఆమె భర్త బాబు రెడ్డి చెవిరెడ్డి తీరును నిరసిస్తూ నిన్న వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప.గో జిల్లా గోపాలపురంలో మాజీ సీఎం చంద్రబాబును కలిశారు. ఆయన సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం నంగా దంపతులు మాట్లాడుతూ.. కష్టపడిన వారికి వైసీపీలో గుర్తింపు లేదని.. ఆ పార్టీలో ఉత్సవ విగ్రహాలు లాగా ఉండలేక రాజీనామా చేశామని చెప్పారు.

News April 5, 2024

చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ

image

చిత్తూరు జిల్లా కలెక్టర్ షగిలి షణ్మోహన్‌ను నూతన ఎస్పీ మణికంఠ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొకే అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీగా విజయ్ మణికంఠ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

News April 5, 2024

తిరుపతి IITలో ఉద్యోగాలకు నేడు చివరి తేదీ

image

ఏర్పేడు సమీపంలోని తిరుపతి IITలో సీనియర్ రీసెర్చ్ ఫెలో-01, ప్రాజెక్టు అసిస్టెంట్-01 పోస్టుల దరఖాస్తులకు శుక్రవారంతో గడువు ముగియనుంది. యూజీ, పీజీ ఇన్ కంప్యూటర్ సైన్స్, గేట్ పాసైన అభ్యర్థులు అర్హులు. ఇతర వివరాలకు www.iittp.ac.in వెబ్‌సైట్ చూడాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 05.

News April 5, 2024

వీళ్లే నా స్టార్ క్యాంపెయినర్స్: జగన్

image

తిరుపతి జిల్లాలో నిన్న CM జగన్ బస్సు యాత్ర జరిగింది. రేణిగుంట నుంచి ఆయన యాత్ర ప్రాంభం కాగా దారి పొడవునా వివిధ వర్గాల ప్రజలను కలిశారు. కూలీలు, వృద్ధులతో మాట్లాడారు. ఆయనతో పలువురు సెల్ఫీ దిగారు. ‘వీళ్లే నా స్టార్ క్యాంపెయినర్స్’ అంటూ సంబంధిత ఫోటోలను జగన్ ట్విటర్(X)లో పోస్ట్ చేశారు. నిన్నటి కార్యక్రమంలో CM వెంట తిరుపతి MP గురుమూర్తి, శ్రీకాళహస్తి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉన్నారు.

News April 5, 2024

చిత్తూరు: రేపు షబ్‌-ఎ-ఖదర్‌ జరుపుకోండి

image

రంజాన్‌ ఉపవాసాల చివరివారం సందర్భంగా శనివారం జిల్లాలోని ముస్లింలు షబ్‌-ఎ-ఖదర్‌ పండుగను జరుపుకోవాలని జిల్లా ప్రభుత్వ ఖాజీ కమాలుల్లా జుహూరి జునైది ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం రాత్రి ముస్లింలు భక్తి ప్రపత్తులతో సమాజ శ్రేయస్సు కోసం అల్లాను ప్రార్థించాలని కోరారు. షబ్‌-ఎ-ఖదర్‌ సందర్భంగా ధనికులైన ముస్లింలు పేదలకు కనీసం 2.2కిలోల గోధుమలు లేదా వాటికి సరిపడా ధనం వితరణ చేయాలని సూచించారు.

News April 5, 2024

CTR: న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బదిలీ

image

చిత్తూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కరుణ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన్ను నెల్లూరు జిల్లాలోని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్)గా నియమిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరులో పనిచేస్తున్న అడిషనల్ సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) వెన్నెలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

News April 5, 2024

9న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు

image

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మ‌ధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

News April 4, 2024

తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్.. చిత్తూరు ఎస్పీగా మణికంఠ

image

చిత్తూరు జిల్లా నూతన ఎస్పీ గా 2018..IPS బ్యాచ్‌కి చెందిన మణికంఠ చందోలును నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ ఎస్పీగా ఆరిఫుల్లా విధులు నిర్వహిస్తున్నారు. తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్‌ని నియమించింది.