India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో సీఐడీ అధికారుల విచారణ మొదటి అంకం ముగిసింది. సోమవారం సాయంత్రం మదనపల్లెకి చేరుకున్న CID చీఫ్ రవిశంకర్ అయ్యర్, జిల్లా SP విద్యాసాగర్ నాయుడు, CID DSP వేణుగోపాల్ సబ్ కలెక్టరేట్లో రెవెన్యూ సిబ్బందిని విచారించారు. అదేరోజు రాత్రే సీఐడీ చీఫ్, జిల్లా ఎస్పీ వెళ్లిపోగా మంగళవారం డీఎస్పీ వేణుగోపాల్ విచారణ కొనసాగించారు.

కర్ణాటక-ఆంధ్ర సరిహద్దు దండుపాళ్యం గేటు వద్ద బుధవారం రాత్రి కారు- ఓ ప్రైవేటు వాహనం ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు మరణించారు. మరో పన్నెండు మంది గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడ్డ వారిలో తిరుపతికి చెందిన జగదీశ్వరి ఉన్నారని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.

విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు, పదవీ విరమణ పొందిన వారితో ఎస్పీ సుబ్బారాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన ప్రయోజనాలపై సమీక్ష చేశారు. పోలీసు శాఖలో పనిచేసిన వారికి ఎప్పుడూ అండగా ఉంటామని తెలియజేశారు. ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని కోరారు.

మద్యం కుంభకోణాన్ని వెనకుండి నడిపించింది జగన్ అయితే.. ఆ వ్యవహారాన్ని చక్కబెట్టింది పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డేనని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్(RCY) ఆరోపించారు. ‘మద్యం డబ్బును హాంకాంగ్లోని మకావ్ అనే ప్రాంతానికి తరలించారు. అక్కడ రియల్ ఎస్టేట్, మాల్స్లో పెట్టుబడులు పెట్టారు. ఇన్నీ చేసినా కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి దోపిడీపై ఎందుకు కేసులు పెట్టడం లేదు’ అని RCY ప్రశ్నించారు.

చిత్తూరు కలెక్టరేట్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సుబ్రమణ్యం అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని హల్ చల్ సృష్టించాడు. తనకు తెలియకుండా తన సోదరి ఇంటి స్థలాన్ని విక్రయించిందని ఆరోపించాడు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తనుకు చావే శరణ్యమని ఆవేదని వ్యక్తం చేశాడు .

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు తెలిపారు. శ్రావణమాసం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

చిత్తూరు జిల్లాలో ఏనుగులతో జరుగుతున్న నష్ట పరిహారాలను రైతులకు అందించేందుకు అటవీ శాఖ ‘గజ-ప్రజా’యాప్ను రూపొందించింది. దీని ద్వారా ఏనుగులతో పంట నష్టం జరిగిందని రైతులు ఫిర్యాదు చేయగానే ఎఫ్బీవో యాప్లో ఫోటో, వివరాలు అప్ లోడ్ చేస్తారు. తర్వాత సంబంధిత అధికారులకు అలెర్ట్ వస్తుంది. వారు పరిశీలించి, నిధుల కోసం నివేదిక పెడతారు. దీంతో పరిహారం అందుతుంది. ప్రస్తుతం యాప్ పనులు జరుగుతున్నట్లు తెలిపారు.

అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను గుర్తించి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సోమశేఖర్ రెడ్డి తెలిపారు. రామకుప్పానికి చెందిన కృష్ణనాయక్, రాజేంద్రనాయక్ గంజాయి అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని విచారించారు. కర్రిపల్లెకు చెందిన ఆనందప్ప అనే రైతు తన బీన్స్ పొలంలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. వీరి నుంచి దాదాపు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.

మాయమాటలు చెబుతూ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న కేసులో నలుగురు నిందితులను మంగళవారం శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ నెల 22వ తేదీన పట్టణ పరిధిలో తల్లిదండ్రులు లేని మైనర్ బాలిక(13)పై తరచూ అఘాయిత్యానికి పాల్పడుతుండగా స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధు, సునీల్, చంద్రశేఖర్, అదిల్ (సన్నీ), కార్తీక్ను నిందితులుగా చేర్చారు.

‘సీఐ భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారు.. అత్యవసరంగా నగదు పంపండి’ అంటూ ఓ ఏఎస్సై పేరిట ఫోన్ చేసి వ్యాపారిని బురిడీ కొట్టించారు సైబర్ మోసగాళ్లు. వారు చెప్పిన విధంగా స్కానరుకు రూ. 95 వేల నగదు పంపి మోసపోయారు. ఈ ఘటన బంగారుపాళ్యంలో మంగళవారం వెలుగుచూసింది. ఇది మోసం అని గ్రహంచిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు విచారణ చేపట్టారు.
Sorry, no posts matched your criteria.