Chittoor

News April 4, 2024

చౌడేపల్లిలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

image

చౌడేపల్లి పట్టణంలోని బజారు వీధిలోని ఓ ఇంట్లో ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం.. స్థానిక ఉన్నత పాఠశాలలో సాయి రితీష్ (14) అనే విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు చెందిన పుస్తకాలు ఉన్న బ్యాగుతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తల్లి హేమ కళ్యాణి స్థానిక సచివాలయ ఉద్యోగిగా ఉంది. సాయి రితీష్ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 4, 2024

తిరుమల: రేపు డయల్ యువర్ ఈవో

image

టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జరగనుంది. భక్తులు తమ సందేహాలు, సూచనలను ఈవో ఏవీ ధర్మారెడ్డితో ఫోన్లో(0877-2263261) నేరుగా మాట్లాడి తెలపవచ్చని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 4, 2024

తిరుపతి జిల్లా సిద్ధమా..?: జగన్

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతోంది. నిన్న పూతలపట్టులో సభ అనంతరం ఆయన తిరుపతి జిల్లాలోకి ప్రవేశించారు. ఇవాళ తిరుపతి జిల్లాలో డ్రైవర్లతో సమావేశం అవుతారు. అలాగే రోడ్ షోతో పాటు నాయుడుపేటలో బహిరంగ సభ జరగనుంది. ఈక్రమంలో సీఎం జగన్ ‘Day-8 తిరుపతి జిల్లా సిద్ధమా…?’ అని ట్వీట్ చేశారు.

News April 4, 2024

చిత్తూరు: వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

image

చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆమెను జగన్ వద్దకు తీసుకు వెళ్లారు. ఆయన లలిత కుమారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పని చేస్తానని ఆమె చెప్పారు. 2004లో ఆమె పలమనేరు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014, 19లో పూతలపట్టులో అదే పార్టీ నుంచి పోటీ చేసినా ఓడిపోయారు.

News April 4, 2024

43 శాతం సామాజిక ఫించన్ పంపిణీ పూర్తి

image

తిరుపతి జిల్లాలో గురువారం సామాజిక ఫించన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ మాసంకు గాను జిల్లా వ్యాప్తంగా 2,71,477 సామాజిక భద్రత పెన్షనర్లకు సచివాలయాల పరిధిలో సాయంత్రం 7 గంటల వరకు 1,16,958 (43%) పెన్షన్ల పంపిణీ జరిగిందని జిల్లా అధికారులు తెలిపారు. మిగిలిన వారికి సైతం శుక్రవారం కూడా పంపిణీ చేస్తామని వివరించారు.

News April 3, 2024

తిరుపతి: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నర్సింగ్ ప్రాక్టీషనర్-01, వార్డు అసిస్టెంట్-01 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 08.

News April 3, 2024

43 శాతం సామాజిక ఫించన్ పంపిణీ పూర్తి

image

తిరుపతి జిల్లాలో గురువారం సామాజిక ఫించన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ మాసంకు గాను జిల్లా వ్యాప్తంగా 2,71,477 సామాజిక భద్రత పెన్షనర్లకు సచివాలయాల పరిధిలో సాయంత్రం 7 గంటల వరకు 1,16,958 (43%) పెన్షన్ల పంపిణీ జరిగిందని జిల్లా అధికారులు తెలిపారు. మిగిలిన వారికి సైతం శుక్రవారం కూడా పంపిణీ చేస్తామని వివరించారు.

News April 3, 2024

పూతలపట్టులో ముగిసిన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ సభ

image

పూతలపట్టులో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ సభ ముగిసింది. సభ వేదికపై సీఎం జగన్ ప్రతిపక్షలపై విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాలో పలువురు నాయకులను పరిచయం చేశారు. అనంతరం బస్సు యాత్ర పి.కొత్తకోట, పాకల క్రాస్, గదంకి, పనపాకం, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్ రేణిగుంట మీదుగా గురవరాజుపల్లె చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు.

News April 3, 2024

TPT: క్రీడలపట్ల అవగాహన కల్పించిన భారత కెప్టెన్

image

భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రజని టిటిడి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు క్రీడలకు సంబంధించి అవగాహన కల్పించారు. దేవస్థానం విద్యాశాఖ అధికారి భాస్కర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ముస్తాక్ అహ్మద్ ఆహ్వానం మేరకు బుధవారం ఆర్ట్స్ కళాశాలకు విచ్చేశారు. క్రమశిక్షణతో చేసే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చు అని ఆమె విద్యార్థులకు తెలియజేశారు. క్రీడాకారులకు 20 హాకీ స్టిక్స్ బహుమతిగా అందజేశారు.

News April 3, 2024

తిరుపతి: ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ అంజయ్య

image

తిరుపతిలో ఇండియా కూటమి పార్లమెంటు అభ్యర్థిగా డాక్టర్ అంజయ్య పోటీ చేయనున్నట్లు బుధవారం స్పష్టం చేశారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు తనకు ఒక అవకాశం ఇస్తే పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తామన్నారు.