Chittoor

News July 10, 2024

పులిచెర్ల : కమలాపురంలో వర్షం

image

పులిచెర్ల మండలం కమలాపురంలో వాతావరణం పూర్తిగా మారింది. ఒక గంట క్రితం నుంచి వర్షం భారీగా కురుస్తోంది. దీనితో చెట్లు, కొమ్మలు విరిగిపడే అవకాశం ఉన్నందువలన స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. పిడుగులు పడే అవకాశాలు ఉన్నందున పంట పొలాలు దగ్గరికి వెళ్లకూడదని అన్నారు.

News July 10, 2024

సరికొత్త కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే శ్రీకారం

image

ప్రజల సమస్యల పరిష్కారం కోసం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి గురువారం డైలీ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి గురువారం ఉదయం 10గంటల నుంచి 11 గంటల వరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొని ఫోన్ ద్వారా సమస్యలను స్వీకరిస్తారు.

News July 10, 2024

తిరుపతి: సిగరెట్లు అమ్మితే రూ.200 ఫైన్

image

తిరుపతి జిల్లాలో పాఠశాలలు, కాలేజీల సమీపంలో సిగరెట్లు, బీడీలు అమ్మితే పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు రేణిగుంట పోలీసులు పలు దుకాణాల్లో సోదాలు చేశారు. కొందరు సిగరెట్, బీడీ అమ్ముతున్నట్లు గుర్తించి వారికి రూ.200 జరిమానా విధించారు. విద్యాసంస్థల వద్ద బీడీ, సిగరెట్ వంటి ధూమపాన వస్తువులు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 10, 2024

కాలువను శుభ్రం చేసిన తిరుపతి కలెక్టర్

image

పరిసరాల పరిశుభ్రతతో డయేరియాను అరికట్టవచ్చని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలం మంగళం పంచాయతీలో అతిసార నియంత్రణ మాసోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి కలెక్టర్ స్వయంగా కాలువను శుభ్రం చేశారు. పంచాయతీ కార్మికులతో కలిసి కాలువలోని పూడికలు తొలగించారు. అందరూ పరిసరాలతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు.

News July 10, 2024

శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

image

తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. స్వామివారిని మంగళవారం 67,245 మంది దర్శించుకున్నారు. 25,054 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు వచ్చింది.

News July 10, 2024

చిత్తూరులో టీచర్ ఆత్మహత్య

image

చిత్తూరులో ఓ టీచర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని గిరింపేట మున్సిపల్ హైస్కూల్లో షరీఫ్(38) హిందీ పండిట్‌గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో దిశా పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం పురుగు మందు తాగి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వేలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చనిపోయారు. వ్యక్తిగత కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.

News July 10, 2024

చిత్తూరు జిల్లాలో 68 మందికి మెమోలు

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 68 మంది టీచర్లు, నాన్ టీచింగ్ ఉద్యోగులకు డీఈఓ దేవరాజు మెమోలు జారీచేశారు. వాటిని డీవైఈఓ, ఎంఈవోలకు పంపారు. సక్రమంగా ఫేషియల్ అటెండెన్స్ వేయకుండా విధులకు డుమ్మా కొట్టడంతో మెమోలు జారీ చేసినట్లు చెప్పారు. 24 గంటల్లో లిఖితపూర్వక సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.

News July 10, 2024

పెద్దిరెడ్డి సంస్థ ఇసుక నిల్వలు స్వాధీనం

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా ములకలచెరువు(M) రెడ్డివారిపల్లి సమీపంలోని ఇసుక డంప్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి చెందిన PLR సంస్థ పాపఘ్ని నదిలో ఇసుక తవ్వి టిప్పర్ల ద్వారా రెడ్డివారిపల్లికి తరలించారు. హంద్రీ-నీవా కాలువ పనులు చెప్పి అప్పట్లో ఇసుక నిల్వ చేశారు. కొన్ని నెలలుగా కాలువ పనులు జరగడం లేదు. దీంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.

News July 10, 2024

తిరుపతి ఐఐటీలో JRFకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(JRF)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐఐటీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఎంటెక్(M.Tech) పాసైన అభ్యర్థులు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 11. ఇతర వివరాలకు www.iittp.ac.in వెబ్‌సైట్ చూడాలి.

News July 10, 2024

తలకోనలో అరుదైన కప్ప గుర్తింపు

image

శ్రీలంక భూభాగంలో కనిపించే అరుదైన జాతికి చెందిన కప్ప శేషాచలం అడవుల్లో దర్శనమిచ్చింది. గోధుమ రంగులో ఉండే ఈ కప్పను జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు, ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలి పరిశోధకులు కనుగొన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ద్రీతి బెనర్జీ మాట్లాడుతూ.. శ్రీలంకన్ స్యూడో ఫిలేటస్ రిజియస్‌గా పిలవబడే ఈ కప్ప తలకోనలో కనిపించిందని చెప్పారు.