Chittoor

News April 3, 2024

చిత్తూరు జిల్లాలో CM పర్యటన ఇలా..!

image

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చిత్తూరు జిల్లాలోకి నేడు ప్రవేశించనుంది. జిల్లాలోని పూతలపట్టు వద్ద నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం పాకాల మండలం గాదంకి మీదుగా ముంగళిపట్టు, మామండూరు, ఐతేపల్లి, తిరుపతి మీదుగా రేణిగుంటకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

News April 3, 2024

చిత్తూరు: నాలుగు రోజుల్లో పెన్షన్ ప్రక్రియ పూర్తి చేయండి

image

జిల్లాలో ఈ నెల 3 వ తేదీ నుండి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.షణ్మోహన్ ఆదేశించారు. మంగళవారం జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. పెన్షన్ ల పంపిణీ ఈ నెల 3 వ తేదీ నుంచి 6 వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియకు ఎంపీడీవోలు సచివాలయ సిబ్బందిని ఎంపిక చేసి ఆదేశాలు జారీ చేయాలన్నారు. జిల్లాలో నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు.

News April 2, 2024

పిచ్చాటూరు: కన్నతల్లిని గొంతు కోసిన కసాయి కొడుకు

image

ఆస్తి తగాదాలతో కన్నతల్లి గొంతు కోసి చంపిన ఘటన పిచ్చాటూరు మండలంలోని అడవి కొడియంబేడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. రాజమ్మ (80) రెండో కొడుకు కృష్ణారెడ్డి, అతని కొడుకులు కలిసి రాజమ్మతో గొడవ పడి గొంతు కోసి చంపి పరారైనట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News April 2, 2024

మదనపల్లెలో ముగిసిన సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ

image

మదనపల్లెలోని టిప్పు సుల్తాన్ మైదానంలో ఏర్పాటు చేసిన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమం ముగిసింది. ఈ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థపైన మాట్లాడారు. అనంతరం వైసీపీ అభ్యర్థులను స్టేజీపైన ప్రకటించి వారిని గెలిపించాలని కోరారు. ఆయన సభ ముగిసిన తర్వాత నిమ్మనపల్లె క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది. అమ్మగారిపల్లెలో రాత్రి బసచేయనున్నారు.

News April 2, 2024

మదనపల్లెను హైటెక్ సిటీ చేశారా: సీఎం జగన్

image

మదనపల్లెలో సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు గతంలో ప్రతి నగరంలో హైటెక్ సిటీని నిర్మిస్తానని అన్నారని, మదనపల్లెలో నిర్మించాడా అని విమర్శించారు. ‘అరుంధతి సినిమాలో పశుపతి లాగా.. వదల బొమ్మాళీ వదల.. అంటూ పేదల రక్తం పీల్చేందుకు కేకలు పెడుతున్నారు’ అని ఫైరయ్యారు.

News April 2, 2024

తిరుపతి: పీజీ ఫలితాలు విడుదల

image

SV యూనివర్సిటీ పరిధిలో గత
ఏడాది సెప్టెంబర్ నెలలో PG మొదటి సంవత్సరం ఏంఏ హిందీ, ఎంఏ ఫిలాసఫీ, ఎమ్మెస్సీ బోటనీ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ అంత్రోపాలజీ రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in, http://www.schools9.com వెబ్ సైట్‌లో చూడాలన్నారు.

News April 2, 2024

తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశా బదిలీ

image

తిరుపతి జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, కలెక్టర్ లక్ష్మీశాను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ప్రతిపక్ష పార్టీల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా వారిలో కలెక్టర్ లక్ష్మీశా ఉన్నారు. అదేవిధంగా చిత్తూరు ఎస్‌పీ జాషువాను కూడా బదిలీ చేశారు.

News April 2, 2024

ఉమ్మడి చిత్తూరు జిల్లా కాంగ్రెస్ MLA అభ్యర్థులు వీళ్లే..

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలువురు MLA అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. * తంబళ్లపల్లి- చంద్రశేఖర్ రెడ్డి * పీలేరు- సోమశేఖర్ రెడ్డి * మదనపల్లె-పవర్ కుమార్ రెడ్డి * పుంగనూరు- మురళీమోహన్ యాదవ్ * చంద్రగిరి- కనుపర్తి శ్రీనివాసులు * శ్రీకాళహస్తి- రాజేశ్ నాయుడు * సత్యవేడు (SC) – బాలగురువం బాబు * నగరి- పి రాకేశ్ రెడ్డి * చిత్తూరు- తికరామ్ * పలమనేరు- శివశంకర్ *
కుప్పం- ఆవుల గోవిందరాజులు

News April 2, 2024

ఏర్పేడు : మల్టీ స్కిల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కు దరఖాస్తులు

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికగా మల్టీ స్కిల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఏదేని డిగ్రీ, అడ్మినిస్ట్రేషన్ లో మూడు సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 07.

News April 2, 2024

రెండుకు చేరిన పుంగనూరు రోడ్డు ప్రమాద మృతులు

image

పుంగనూరు మండలం,ఈడిగపల్లి వద్ద సోమవారం రాత్రి ఆటో ఢీకొని బైకు నడుపుతున్న మదనపల్లె అరవాండ్లపల్లి పూల లక్ష్మి నరసింహ(36) అక్కడి కక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటం పాఠకులకు తెలిసిందే. కాగా చికిత్స పొందు తున్న ఇద్దరిలో మంగళవారం సోమల మండలం, పెద్ద ఉప్పరపల్లికి చెందిన రమణ(45) మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పుంగనూరు రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య రెండుకు చేరింది.