Chittoor

News April 1, 2024

చిత్తూరు: ఫోటో గుర్తింపు కార్డులతో ఓటేయండి

image

ఓటరు గుర్తింపు కార్డులను చూపించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చిత్తూరు కలెక్టర్ ఎస్.షన్మోహన్ కోరారు. ఎపిక్ కార్డు లేని వారు ప్రత్యామ్నాయంగా ఫోటో గుర్తింపు కార్డులను చూపించి ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆధార్ కార్డ్, ఉపాధి హామీ కార్డ్, బ్యాంక్/ పోస్టాఫీసు జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్‌బుక్‌లు లాంటి 12 రకాల కార్డులు చూపించి ఓటు వేయవచ్చని సూచించారు.

News March 31, 2024

ఇద్దరు మాజీ సీఎంల ఓటమిపై పెద్దిరెడ్డి గురి..!

image

ప్రస్తుత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలపై అందరి దృష్టి నెలకొంది. YCPలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన ఈసారి ఎలాగైనా కుప్పంలో చంద్రబాబును ఓడించాలని ప్రయత్నిస్తున్నారు. తరచూ కుప్పంలో పర్యటిస్తూ బాబుకు సవాల్ విసురుతున్నారు. రాజంపేట MP అభ్యర్థిగా పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి మాజీ సీఎం కిరణ్ కుమార్ కావడంతో పెద్దిరెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

News March 31, 2024

చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న ఎండలు

image

రోజు రోజుకు పెరుగుతున్న ఎండలతో చిత్తూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పులిచెర్ల మండలంలో అత్యధికంగా 41.9 డిగ్రీలు, రామకుప్పంలో అత్యల్పంగా 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిండ్రలో 41.7, SRపురంలో 41.4, తవణంపల్లె, నగరిలో 41.1, బంగారుపాళ్యం, పలమనేరులో 41, గుడుపల్లెలో 40.6, పుంగనూరులో 40.3, గుడిపాలలో 40, శాంతిపురం, సదుం, వెదురుకుప్పంలో 39.2, సోమల, రొంపిచెర్ల, చౌడేపల్లెలో 39.1 డిగ్రీలు నమోదైంది.

News March 31, 2024

వరదయ్యపాలెం: ఈతకు చెరువులో దిగి వివాహిత మృతి

image

కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు చెరువులో దిగిన ఓ గిరిజన వివాహిత నీట మునిగి మృతి చెందింది. ఈ ఘటన వరదయ్యపాళెంలో శనివారం చోటుచేసుకుంది. పవన్, నాగరాణి దంపతులు శుక్రవారం సాయంత్రం కాలనీ సమీపంలోని చెరువులో సరదాగా ఈత కోసం దిగారు. భర్త పవన్ చెరువు ఒడ్డున దుస్తులు ఆరబెడుతుండగా.. ఈత రాకపోవడంతో నాగరాణి(40) నీట మునిగి శవమై తేలింది. వీరికి నలుగురు సంతానం. ఘటన పై కేసు నమోదు చేశారు.

News March 31, 2024

మదనపల్లిలో రైతును కొడవళ్లతో నరకడంతో చేతి వేళ్లు కట్

image

మదనపల్లిలో రైతుపై హత్యాయత్నం జరగడం తీవ్రకలకలం రేపుతోంది. పోలీసుల కథనం.. మండలంలోని పాలెంకొండకు చెందిన నాగరాజకు , అదే ఊరిలోని చిన్నప్పకు ఆస్తికోసం గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం పొలం వద్ద ఇరువర్గాలు గొడవపడ్డారు. ఈఘర్షణలో రైతు నాగరాజపై ప్రత్యర్థులు మురళి, చిన్నప్ప, చిన్నక్కలు కొడవళ్లతో నరకడంతో చేతి వేళ్లు కట్ అయ్యాయి, తలకు గాయమైంది. బాధితునికి మదనపల్లెలో చికిత్స చేయించి రుయాకు వెళ్లారు.

News March 31, 2024

బి.కొత్తకోట: ప్రియురాలు ప్రేమను నిరాకరించిందని విషం తాగాడు

image

ప్రియురాలు ప్రేమను నిరాకరించిందని విషం తాగి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. బి.కొత్తకోట కాండ్లమడుగు క్రాస్, ఈడిగపల్లికి చెందిన నవీన్ టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నవీన్ ఓ అమ్మాయిని ప్రేమించగా.. నిరాకరించడంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు బాధితుణ్ని చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించగా, డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించగా కోలుకుంటున్నాడు.

News March 31, 2024

బంగారుపాలెం: గన్నేరు పప్పు తిని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

image

కుటుంబ కలహాల కారణంగా గన్నేరు పప్పు తిని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనబంగారుపాలెం మండలం వెంకటాపురంలో జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. వెంకటాపురానికి చెందిన రఘు (50) అనే వ్యక్తి కుటుంబ కలహాలతో మన స్థాపం చెంది గన్నేరు పప్పు తిని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 31, 2024

చిత్తూరు: వడ్డీ మాఫీకి నేడే ఆఖరు

image

2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులపై వడ్డీ మాఫీకి ఆదివారం ఆఖరు రోజు అని, ఈ అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ డా. జె అరుణ కోరారు. పన్ను బకాయిల మొత్తాన్ని ఒకేసారి చెల్లించిన వారికి వడ్డీ మాఫీ ఉంటుందన్నారు. ఆదివారం రోజైనా నగరపాలక కార్యాలయంలోని పురసేవ కేంద్రం పనిచేస్తుందన్నారు.

News March 31, 2024

తిరుపతి: ‘తాగునీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’

image

వేసవిలో తాగునీటి ఎద్దడిపై కలెక్టరేట్‌లో శనివారం సంభందిత అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర, నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో పట్టణాల్లో, గ్రామాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా అధికారులు చూడాలని చెప్పారు.

News March 30, 2024

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. మహిళ మృతి

image

తిరుమల మొదటి ఘట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఏనుగులు అర్చ్ దాటిన తర్వాత ఓ కారు అదుపు తప్పి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి కారులో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళే క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పెద్దలు పిల్లలకు గాయాలు కాగా.. అశ్వినిని ఆసుపత్రికి తరలించారు. ఈవో ధర్మారెడ్డి గాయపడిన వారిని పరామర్శించారు.