Chittoor

News August 22, 2024

తిరుమలలో వివిధ ప్రత్యేక దర్శనాలు రద్దు

image

తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వివిధ ప్రత్యేక దర్శనాలు కూడా అక్టోబరు 3నుంచి 12వ తేదీ వరకు రద్దయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు భక్తులు అధికంగా వచ్చేస్తారు. వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రేక్‌ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 

News August 22, 2024

తిరుపతి MLA ఇంట్లో కేక్ కట్ చేసిన మెగాస్టార్

image

తిరుమతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాసంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. తన నివాసానికి విచ్చేసిన చిరంజీవి దంపతులకు ఎమ్మెల్యే శ్రీనివాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చిరంజీవి కేక్‌ కట్‌ చేసి తన భార్య సురేఖతో పాటు ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులకు తినిపించారు. తేనీరు సేవించాక చిరంజీవి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

News August 22, 2024

తిరుపతిలో ఫైర్ యాక్సిడెంట్

image

తిరుపతి బైరాగిపట్టెడలోని ఓ స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించింది. స్కూల్‌‌లోని స్టోర్ రూమ్‌లో గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు పెద్ద ఎత్తున సంభవించడంతో స్కూల్ యాజమాన్యం విద్యార్థులను క్షేమంగా సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఫైర్ ఇంజిన్‌కి సమాచారం అందించగా.. అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకొని మంటలను అదుపు చేశారు.

News August 22, 2024

నేడు శ్రీవారి పుష్పయాగం టికెట్ల విడుదల…

image

నవంబర్ 9వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నేడు పుష్పయాగం టికెట్లను 10 గంటలకు టిటిడి వారు విడుదల చేయనున్నారు. పుష్పయాగంలో పాల్గొనదలచిన భక్తులు టికెట్లను కొనుక్కొని పాల్గొనవచ్చు. పుష్పయాగంలో పాల్గొనడంతో పాటు శ్రీవారి దర్శన భాగ్యం కూడా లభిస్తుంది. బ్రహ్మోత్సవాలకు ముందుగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

News August 22, 2024

చిత్తూరు: తల్లితో సహజీవం.. కూతురితో అసభ్య ప్రవర్తన

image

చిత్తూరులో ఓ బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. టూటౌన్ CI.నెట్టికంఠయ్య కథనం..తేనబండ పక్కనున్న బోడిగుట్టకు చెందిన నవీన్ అనేవ్యక్తి ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆమె కుమార్తె(14)తో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. మహిళ పనికి వెళ్లి వచ్చేసరికి, బాలిక ఏడుస్తోంది. అడిగితే తనపై నవీన్ లైంగికదాడికి ప్రయత్నించాడని బాలిక తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News August 22, 2024

చిత్తూరు: డ్రిప్ ఇరిగేషన్ సాగుకు ప్రోత్సాహం: కలెక్టర్

image

డ్రిప్ ఇరిగేషన్ సాగుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఈ క్రాపింగ్ తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 21 వేల హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ సాగుకు లక్ష్యంగా నిర్ణయించారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు పదివేల హెక్టార్లలో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు.

News August 21, 2024

తిరుపతి : ఉద్యోగాల పోస్టర్స్ ఆవిష్కరణ

image

APSSSDC ఆధ్వర్యంలో జెన్ పాక్ట్ కంపెనీ నందు కంటెంట్ మోడరేషన్, కస్టమర్ సర్వీస్ వాయిస్ సపోర్ట్ ఉద్యోగాల పోస్టర్ ను బుధవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం మాట్లాడుతూ.. 2022/23/24 మధ్య బీటెక్ ఏదైనా డిగ్రీ, పీజీ పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. https://bit.ly/46Wzqz6 వెబ్ సైట్ లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. చివరి తేదీ ఆగస్టు 28.

News August 21, 2024

తిరుపతి జిల్లాలో ప్రశాంతంగా భారత్ బంద్

image

తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల బస్సులు బస్టాండ్‌లకే పరిమితం అయ్యాయి. ప్రైవేటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బంద్ నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ప్రధాన సెంటర్‌లలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టింది.

News August 21, 2024

24న తిరుపతిలో అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

image

తిరుపతి ఎస్వీయూ స్టేడియంలో ఈనెల 24వ తేదీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-14, 16, 18, 20, 23 బాల, బాలికల అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి రాబర్ట్ పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి ఉన్నవాళ్లు ఎంపికలకు హాజరు కావాలని కోరారు.

News August 21, 2024

తిరుపతి SVU ఫీజులపై మీ కామెంట్..!

image

తిరుపతి ఎస్వీయూ పరిధిలోని బీఈడీ విద్యార్థులు ప్రతి రికార్డుకు రూ.2500 కట్టేలా ప్రస్తుతం నిబంధన ఉంది. దీనిని రద్దు చేయాలని NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నే మల్లికార్జున కోరారు. ఈ మేరకు ఆయన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. పాత పద్ధతిలోనే ఒక సెమిస్టర్‌కు రూ.2500 ఫీజు కట్టించుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని విన్నవించారు. మరి దీనిపై మీ కామెంట్.