Chittoor

News July 8, 2024

మదనపల్లెలో భార్యపై కత్తితో దాడి

image

భార్యపై భర్త కత్తితో దాడిచేసిన ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. టూ టౌన్ పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె, చౌడేశ్వరీ నగర్లో ఉండే ఎస్.ఆర్.దుర్గ (28), కే.భాస్కర్ నాయుడుకు ప్రేమ వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న భాస్కర్ మద్యానికి అలవాటు పడ్డాడు. భార్యపై అనుమానంతో కొడుతూ వుండేవాడు. రాత్రి కత్తితో దాడి చేయగా దుర్గ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

News July 8, 2024

త్వరలో పుంగనూరులో పర్యటించనున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి

image

పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి స్వగృహానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచ్చేసారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించి పుంగునూరు నియోజకవర్గ అభివృద్ధి పట్ల చర్చించారు. త్వరలోనే పుంగనూరు పట్టణంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించనున్నారు. పట్టణంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన హాజరు కానున్నట్లు విశ్వనీయ సమాచారం.

News July 7, 2024

తిరుపతి ఎస్వీ జూలో ఆడ పులి మృతి

image

తిరుపతి SV జూపార్క్‌లో ఆడ పులి మృతి చెందిందని జూపార్క్ క్యూరేటర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అనిమల్ ఎక్స్చేంజ్ అనే కార్యక్రమంలో భాగంగా లక్నోలో గల నవాబ్ మజీద్ అలీషా జువాలాజికల్ పార్క్ నుంచి జాలి అనే ఐదేళ్ల వయసు గల ఆడపులిని జూ పార్క్ కు తీసుకొచ్చారు. జూన్ మొదటి వారంలో డే కేర్ లో ఆడుతూ కిందపడి తీవ్రంగా గాయపడింది. మెరుగైన వైద్యం అందించినప్పటికీ పులి మృతి చెందిందని అన్నారు.

News July 7, 2024

చిత్తూరు: జింకల పార్క్ వద్ద బోల్తా పడ్డ లారీ

image

చిత్తూరు నగరంలోని జింకల పార్క్ వద్ద మధ్యాహ్నం లారీ ఆదుపు తప్పి బోల్తా పడింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు జేసీబీ సాయంతో లారీని లేపే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీంతో గిరింపేట నుంచి జింకల పార్క్ మీదుగా టౌన్ లోకి వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

News July 7, 2024

శ్రీకాళహస్తి: ఆశ చూపి మోసం చేశారని కేసు

image

శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామనగర్ కాలనీకి చెందిన సుధ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో నమ్మించి మోసం చేశారని ఫిర్యాదు చేయడంతో శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నరసింహారావు కథనం మేరకు.. ఓ ప్రకటనల కంపెనీలో పెట్టుబడులు పెట్టడంతో పెద్దఎత్తున ఆదాయాలు పొందవచ్చునని నర్మద కుటుంబ సభ్యులు సుధాని నమ్మించారు. దీంతో ఆమె ఏడాది పాటు రూ.39లక్షలు అందజేసింది. చివరికి ఇంటికి తాళంవేసి పరారయ్యారు.

News July 7, 2024

బీ. కొత్తకోట: సైబర్ మోసంపై కేసు నమోదు

image

ఆన్‌లైన్ ద్వారా మోసానికి పాల్పడిన ఓ యాప్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు. పట్టణానికి చెందిన మన్సూర్ అలీ ఆన్‌లైన్‌లో ట్రేడ్ బైమార్జిన్ యాప్‌లో పెట్టుబడులు పెట్టాడు. యాప్ ద్వారా ఇటీవల విడతల వారీగా రూ.3,14,300 చెల్లింపులు చేశాడు. ఈ నగదును తిరిగి చెల్లించకుండా బాధితుడి ఖాతాను మూసివేశారు. ఆన్‌లైన్ వ్యాపారంలో తాను నష్టపోయినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News July 7, 2024

చిత్తూరు: రేపటి నుంచి అందుబాటులో ఇసుక

image

జిల్లాలో గుర్తించిన ఇసుక
డిపోలలో ఈ నెల 8వ తేదీ నుంచి ఇసుక అందుబాటులో ఉంటుందని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. చిత్తూరు రూరల్ మండలం బీఎన్ ఆర్ పేట సమీపంలోని పాలూరు, అరతల సమీపంలోని దిగువమాసాపల్లి , గంగవరం మండలం గండ్రాజుపల్లి సమీపంలోని బైరెడ్డిపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఇసుక డిపోలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొనుగోలుకు వినియోగదారులు యూపీఐ విధానంలో నగదు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

News July 7, 2024

పుత్తూరు: రూ.14.18 లక్షలు స్వాహా చేసిన ఆర్పీ

image

స్వయం సహాయక సంఘాల నగదు రూ.14.18 లక్షలు ఆర్పీ భాగ్యలక్ష్మి స్వాహా చేయడంతో బాధితులు శనివారం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం మేరకు.. పుత్తూరులో ఆర్పీ భాగ్యలక్ష్మి పరిధిలో 28 సంఘాలున్నాయి. 2016-18 మధ్యలో 13 సంఘాలకు సంబంధించి పొదుపు, గ్రూపులకు వచ్చిన బ్యాంకు రుణాలు కలిపి రూ.14.18 లక్షలు స్వాహా చేసినట్లు సభ్యులు గుర్తించారు. సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

News July 7, 2024

తంబళ్లపల్లె: పవన్ కళ్యాణ్ పీఏగా మధుసూదన్

image

డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ PAగా తంబళ్లపల్లె మండలం కోటకొండకు చెందిన జీఆర్ మధు సూదన్ నియమితులయ్యారు. విధి నిర్వహణలో ఎక్కడా అవినీతి మచ్చ లేకుండా నిజాయితీ పరుడిగా పేరు తెచ్చుకున్న మధుసూదన్‌ను డిప్యూటీ సీఎం తన PAగా ఎంచుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మధుసూదన్ కడప RDOగా పనిచేస్తూ సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించారు. పవన్ పీఏగా ఎంపికవడం పట్ల మండల ప్రజలు కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

News July 7, 2024

టీటీడీ నిర్ణయించిన ధరలకే భక్తులకు విక్రయించాలి

image

తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరలకే వస్తువులను దుకాణదారులు విక్రయించాలని, అధిక ధరలు విక్రయిస్తే చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ  తెలియజేసింది. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు శనివారం టీటీడీ ఉద్యోగులు భక్తుల వలె శ్రీవారి మెట్టు వద్ద తనిఖీలు చేపట్టారు. వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో టీటీడీ ప్రకటన విడుదల చేసింది.