India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఆవేశ పడకు బొత్సా అక్కడ ఉంది జగన్ కాదు చంద్రబాబు అని కౌంటర్ ఇచ్చారు. మీ జగన్ రాగానే, ఏ చర్చలు లేకుండా అప్పన్నంగా ఏపీ భవనాలు అప్పగించింది మర్చిపోలేదని తెలిపారు. ఢిల్లీలో ఏపీ భవన్ ఇచ్చేస్తామని చెప్పిన మాటలు మర్చిపోలేదని తెలిపారు.
జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU) నందు 2024-25 విద్యా సంవత్సరానికి ప్రాక్ శాస్త్రి (Praak Sastri) కోర్సులో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://nsktu.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
బాలుడిని సవతి తండ్రి నేలకేసి కొట్టి చంపిన ఘటన చిత్తూరులో జరిగింది. ఎస్ఐ వెంకటసుబ్బమ్మ వివరాల ప్రకారం.. చిత్తూరు రూరల్ దిగువ మాసపల్లికు చెందిన శిరీషకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆమె మొదటి భర్తకు దూరంగా ఉంటూ ప్రదీప్ అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. ప్రదీప్ తాగిన మైకంలో శిరిష ఏడాదిన్నర కొడుకు దినేశ్ను నేలకేసికొట్టి చంపాడు. శిరిష ఫిర్యాదుతో ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పుంగనూరు పలమనేరు మార్గమధ్యంలోని కోగిలేరు సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా 25 మందికి తీవ్ర గాయాలు అయినట్లు గంగవరం సీఐ కృష్ణమోహన్ తెలిపారు. అనంతపురం జిల్లాకు చెందిన టూరిస్ట్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మిగిలిన క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.
పెద్దమండ్యం మండలం బిక్కవాండ్లపల్లెకు చెందిన కీర్తన(20) నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ చలపతి తెలిపారు. మదనపల్లె పంచాయతీ, పెంచు పాడుకు చెందిన ఓ వ్యక్తితో 8నెలల క్రితం వివాహమైంది. 4రోజులు క్రితం పుట్టినిల్లు బిక్కవాండ్లపల్లెకు వచ్చిన ఆమె, కడుపు నొప్పి తాళలేక నిద్ర మాత్రలు మింగడంతో తల్లి దండ్రులు రాయచోటి ఆసుపత్రికి, అక్కడి నుంచి కడపకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు.
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం పుత్తూరు రైల్వేస్టేషన్లో జరిగింది. రేణిగుంట రైల్వే ఎస్ఐ రవి కథనం మేరకు.. పుత్తూరు మండలం ఉత్తరపు కండ్రిగ దళితవాడకు చెందిన వడివేలు కుమారుడు నారాయణమూర్తి(30) శుక్రవారం ఉదయం పుత్తూరు రైల్వేప్లాం-1 సమీపంలో చెన్నై నుంచి విజయవాడకు వెళ్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి తీవ్ర గాయాలై మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
తిరుమల రెడ్డిపల్లెకు చెందిన సీనియర్ IAS అధికారి సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ను ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో తెలంగాణ GAD సెక్రటరీగా ఉన్న సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించింది. ఈయన 2002 IAS బ్యాచ్కు చెందిన అధికారి.
విద్యుత్తు అక్రమ వాడకంపై ఎస్పీడీసీఎల్ తిరుపతి సర్కిల్ పరిధిలో అధికారులు శుక్రవారం రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి 2,719 సర్వీసులు తనిఖీలు చేసి అక్రమంగా విద్యుత్తు వాడుతున్న 501 మంది సర్వీసుదారులపై కేసులు నమోదు చేసి రూ.10.17 లక్షల జరిమానా విధించామని ఎస్ఈ సురేంద్రనాయుడు తెలిపారు.
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో చేరిన 24 మంది వైసీపీ కార్పొరేటర్లు, మేయర్ డిప్యూటీ మేయర్లను సస్పెండ్ చేస్తూ
వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ సందర్భంగా వారి పేర్లు మీడియాకు విడుదల చేశారు.
SVU: తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మొదటి సెమిస్టర్, మూడవ సెమిస్టర్ రీవాల్యూయేషన్ ఫలితాలు విడుదల చేశారు. స్టూడెంట్స్ తమ ఫలితాలను SVU వెబ్సైట్లోకి వెళ్లి చెక్ చేసుకోవాలని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి ధామాల నాయక్ తెలిపారు. దీ దీంతోపాటు ఫలితాలను www.manabadi.com వెబ్ సైట్లో చెక్ చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.