Chittoor

News August 17, 2024

మదనపల్లె: పెళ్లి చేసుకుంటానని బాలికతో సహజీవనం.. ఆపై మోసం

image

మదనపల్లె తాలూకా పోలీసులు శుక్రవారం రాత్రి పోక్సో కేసు నమోదుచేశారు. CI కళా వెంకటరమణ కథనం.. మండలంలోని ఓగ్రామానికి చెందిన ఓ బాలిక(17)ను అదే గ్రామానికి చెందిన సయ్యద్ బాషా(22) పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేశాడు. బాలిక పెళ్లి చేసుకోవాలని కోరడంతో నిరాకరించాడు. దీంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు విచారణ అనంతరం నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

News August 17, 2024

కుప్పంలో 24 గంటలు వైద్య సేవలు బంద్

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌‌పై హత్యాచారం ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈనేపథ్యంలో కుప్పంలోని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ప్రైవేట్ ఆసుపత్రిలో ఓపీడీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ ప్రెసిడెంట్ మంజునాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

News August 16, 2024

SVU: మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల

image

ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1990 నుంచి 2015 వరకు చదివి ఒక సబ్జెక్టు, రెండు సబ్జెక్టులు, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయిన విద్యార్థులకు యూనివర్సిటీ మరొక్కసారి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడానికి అవకాశం కల్పించింది. ఈ మేరకు పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

News August 16, 2024

తిరుచానూరు పోలీసుల అదుపులో ప్రేమజంట

image

విజయవాడకు చెందిన పొట్లూరి అలేఖ్య చౌదరి(26) మందడంకు చెందిన సాంబశివరావు(33) 11ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరుకావడంతో అలేఖ్య తల్లిదండ్రులు పెళ్లికి అభ్యంతరం తెలిపారు. దీంతో ఇంట్లో తెలియకుండా ఆగస్టు15న పెళ్లి చేసుకుని శ్రీవారి దర్శనార్థం తిరుపతి వస్తుండగా తిరుచానూరు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తన తల్లిదండ్రులతో ప్రాణహాని ఉందని, తమకి రక్షణ కల్పించాలని అలేఖ్య వీడియో మెసేజ్ చేసింది.

News August 16, 2024

19న శ్రీసిటీకి CM చంద్రబాబు రాక

image

సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 19న ఆయన శ్రీసిటీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పరిశీలించారు. భద్రతా విషయాలపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో శ్రీసిటీ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

News August 16, 2024

చిత్తూరు: ఫ్రీ ట్రైనింగ్.. నేడే లాస్ట్

image

డీఎస్సీ గిరిజన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు చిత్తూరు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని గిరిజన నిరుద్యోగులు అర్హులని పేర్కొన్నారు. బీఈడీ, డీఈడీ, టెట్ ఉత్తీర్ణులైన ఎరుకల, సుగాలి, యానాది గిరిజన కులాలకు చెందిన వారు ఈనెల 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

News August 16, 2024

రెండేళ్లలో ప్రభుత్వం పడిపోతుంది: రవీంద్రనాథ్

image

ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో కూటమి ప్రభుత్వం రెండు నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని మాజీ సీఎం జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా వి.కోటలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇలాగే పరిపాలిస్తే రెండేళ్లలో ప్రభుత్వం పడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని.. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు.

News August 16, 2024

రోజాకు చిక్కులు తప్పవా?

image

ఆడుదాం ఆంధ్రా పేరిట భారీ అవినీతి జరిగిందని కొందరు సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేయాలని విజయవాడ పోలీసు కమిషనర్‌ని సీఐడీ ఆదేశించింది. గత ప్రభుత్వంలో క్రీడా శాఖా మంత్రిగా నగరి మాజీ ఎమ్మెల్యే రోజా పని చేశారు. అప్పట్లో క్రీడా పోటీలకు రూ.150 కోట్లు ఖర్చు చేశారు. నాసిరకమైన క్రీడా పరికరాలు కొనుగోలు చేసి రూ.కోట్లలో అవినీతి చేశారని ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నాయి.

News August 16, 2024

తిరుపతిలో ‘కమిటీ కుర్రోళ్లు’ సందడి

image

‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా బృందం తిరుపతిలో గురువారం సందడి చేసింది. గ్రూప్ థియేటర్‌కు చేరుకున్న సినిమా నిర్మాత నిహారిక, మూవీ సభ్యులు ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. వారాంతంతో పాటు సాధారణ రోజుల్లోనూ ఇంత రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉందని నిహారిక అన్నారు. ఇంతకీ మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.

News August 15, 2024

పుంగనూరు :ఒక్కసారిగా పూల ధరలకు రెక్కలు

image

శ్రావణ మాసం, అందులోనూ రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రాకతో పూల ధరలు అదరహో అనిపిస్తున్నాయి. శ్రావణమాసం ముందు వారం అంతంత మాత్రంగా ఉన్న పూల ధరలు ఒక్కసారిగా రెండు నుంచి మూడింతలు పెరిగాయి. బంతిపూలు కిలో ధర రూ.10 నుంచి రూ.50కి చేరింది. 300 ఉన్న మల్లెపూలు రూ.1000 చేరాయి. కనకాంబరాలు 600 నుండి ప్రస్తుతం రూ.2000 చేరింది అయితే ఇది హోల్‌సేల్‌ ధరలు మాత్రమే. రిటైల్‌కు వచ్చే సరికి పూల ధర రెట్టింపు అవుతాయి.