Chittoor

News March 23, 2024

సుధీర్ రెడ్డిపై అసమ్మతి సెగ చల్లారేనా.?

image

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డిని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన పలువురు నాయకులను కలిసి మద్దతు కోరారు. ఆ మరుసటి రోజు టీడీపీ, జనసేన అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు ఎస్సీవీ నాయుడు సైతం తాను సుధీర్ రెడ్డికి మద్దతు ఇవ్వలేదని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో కూటమి సహకారం లేకుండా విజయావకాశాలు తక్కువ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

News March 23, 2024

ఏర్పేడు: వాలంటీర్ల తొలగింపు.. కండక్టర్‌పై విచారణ

image

మండలంలోని పెనుమల్లం, రావిళ్లవారి కండ్రిగకు చెందిన ఇద్దరు వాలంటీర్లను శుక్రవారం విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో గిడ్డయ్య ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించగా వాలంటీర్లు లత, గీత, ఆర్టీసీ కండక్టర్ మురళి పాల్గొన్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో వాలంటీర్లను తొలగించడంతో పాటు మురళిపై విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

News March 23, 2024

MCMC అనుమతి తప్పనిసరి: చిత్తూరు కలెక్టర్

image

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నికల ప్రచారానికి మీడియా సర్టిఫికెట్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి తప్పనిసరి అని చిత్తూరు కలెక్టర్ షన్మోహన్ అన్నారు. మీడియాలో వచ్చే ఎన్నికల ప్రచారం నిబంధనలకు లోబడి ఉందా లేదా అని పరిశీలించి ఫ్రీ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. దరఖాస్తులను వరుస క్రమం ప్రకారం అనుమతులు మంజూరు చేస్తామన్నారు.

News March 22, 2024

చిత్తూరు: ఆ 4 చోట్ల మహిళలు గెలవలేదు..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఓ కొన్ని స్థానాల్లో ఇప్పటి వరకు మహిళలు ఒక్కసారి కూడా గెలవ లేదు. అందులో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కూడా ఉండటం విశేషం. అలాగే పూతలపట్టు, జీడీనెల్లూరు, శ్రీకాళహస్తిలో ఇంత వరకు మహిళలు గెలవ లేదు. మరోవైపు గళ్లా అరుణకుమారి, రోజా, గుమ్మడి కుతుహలమ్మ వంటి నేతలు మంత్రులుగా పని చేశారు.

News March 22, 2024

కుప్పం: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి 

image

కుప్పం మండలం బురడ సిద్దనపల్లి గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మురుగేష్ కుమారుడు రాజశేఖర్ ఇంటర్ మీడియట్ చదువుతున్నాడు. మద్యాహ్నం మేకలకు మేత కోసం వెళ్లినప్పుడు పొలం వద్ద కిందకు వేలాడుతున్న కరెంటు తీగలు పొరపాటున తగిలి రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

News March 22, 2024

తిరుపతి: ఆన్‌లైన్‌లో వ్యవసాయ కోర్సులు

image

ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ పరిధిలో పుట్టగొడుగుల పెంపకం, సేంద్రియ వ్యవసాయంపై తెలుగు మీడియం ద్వారా ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు అందిస్తోంది. ఆసక్తి కలిగిన యువత, రైతులు దరఖాస్తు చేసుకోవాలని శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల కార్యాలయం పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు angrau.ac.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 25.

News March 22, 2024

27న పలమనేరులో చంద్రబాబు ప్రచారం

image

మాజీ సీఎం చంద్రబాబు
ఈనెల 27 నుంచి 31 వరకు రోడ్ షోలు నిర్వహించనున్నారు. సంబంధత పర్యటన వివరాలను టీడీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఈనెల 27న పలమనేరు, నగరి, మదనపల్లెలో ఎన్నికల ప్రచారం చేస్తారు. 28న అనంతపురం, శ్రీసత్యసాయి, 29న కర్నూలు, నంద్యాల, 30న కడప, తిరుపతిలో, 31న నెల్లూరు, ఒంగోలులో ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News March 22, 2024

చంద్రబాబు కుప్పం పర్యటనలో మార్పు

image

చంద్రబాబు కుప్పం పర్యటనలో మార్పులు జరిగాయి. తమ అధినేత పర్యటన ఒక్క రోజు వాయిదా పడినట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 24, 25న బదులు.. 25, 26న కుప్పం నియోజకవర్గంలో బాబు పర్యటిస్తారని చెప్పారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మార్పులు గమనించాలని ఆయన కోరారు.

News March 22, 2024

రిటైర్డ్ IRSకే చిత్తూరు MP టికెట్

image

టీడీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావును ప్రకటించారు. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి అయిన ఆయన తొలిసారి ఎంపీ బరిలో నిలవనున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారం చేస్తున్నారు. చిత్తూరు వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను బీజేపీ కేటాయించినట్లు తెలుస్తోంది. అక్కడ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

News March 22, 2024

చంద్రబాబు కుప్పం పర్యటనలో మార్పు

image

చంద్రబాబు కుప్పం పర్యటనలో మార్పులు జరిగాయి. తమ అధినేత పర్యటన ఒక్క రోజు వాయిదా పడినట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 24, 25న బదులు.. 25, 26న కుప్పం నియోజకవర్గంలో బాబు పర్యటిస్తారని చెప్పారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మార్పులు గమనించాలని ఆయన కోరారు.