India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుడిపల్లి మండలం చీకటపల్లి ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వెంకట్, కుప్పం మండలం టెక్నికల్ అసిస్టెంట్ మురుగేషన్ లను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కారణంగా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈసీ ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవ కేంద్రాలలో వివిధ సర్టిఫికెట్ల జారీని నిలిపివేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ధ్రువపత్రాలపై సీఎం జగన్ ఫొటో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం ఫొటో లేని కొత్త స్టేషనరీ వచ్చేవరకు ఎలాంటి సర్టిఫికెట్లు జారీ చేయొద్దని అధికారులు స్పష్టం చేశారు.
అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడుతో కలిసి కూతురే తండ్రిని హత్య చేయించిందని ములకలచెరువు ట్రైనీ DSP ప్రశాంత్ తెలిపారు. మండలంలోని మొరవపల్లి వద్ద కోళ్లఫారంలో వారం క్రితం టీడీపీ నేత రాజారెడ్డిని దారుణంగా హత్యగురైన విషయం తెలిసిందే. కాగా సోమవారం హత్యకేసులో నిందితులైన కూతురు బ్రాహ్మణి, ఆమె ప్రియుడు అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేసినట్లు హత్యకేసు వివరాలు వెల్లడించారు.
పోలింగ్ విధులపై అధికారులు పూర్తి అవగాహణ కలిగి ఉండాలని తిరుపతి కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అధికారుల సందేహాలను నివృత్తి చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా చూడాలన్నారు. లోటుపాట్లు లేకుండా పోలింగ్ విధులకు సిద్ధం కావాలన్నారు.
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది నవంబర్లో బీ ఫార్మసీ (B.Pharmacy) రెండవ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/, http://www.schools9.com/వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురిని మోసం చేసిన ఓ యువకుడి ఉదంతం ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో వెలుగు చూసింది. పట్టణంలోని బండ్లవంకకు చెందిన రెడ్డి సూర్యప్రసాద్ అలియాస్ భరత్ హైదరాబాద్, బెంగళూరులో నివాసం ఏర్పరచుకున్నాడు. నిరుద్యోగులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ముందుగా డిపాజిట్ రూపంలో రూ.10 కోట్లకు పైగా తీసుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ మోహన్ రెడ్డి కేసు నమోదు చేశారు.
చిత్తూరు జిల్లా పరిధిలో 33 మంది వాలంటీర్లను విధుల నుంచి తప్పించడం కలకలం రేపుతోంది. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో 18 మంది, పలమనేరు మున్సిపాల్టీలో 12 మంది, గుడిపాలలో ముగ్గురిని తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ఎస్.షన్మోహన్ ఆదివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. అర్జీలు ఇవ్వడానికి ఎవ్వరూ జిల్లా కేంద్రానికి రావద్దని విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా సేవలందించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలె ఆయన బీజేపీలో చేరారు. ఆదివారం ఆయన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ, CBN, PKతో కలిసి వేదికను పంచుకున్నారు. దీంతో ఆయన రానున్న ఎన్నికల్లో రాజంపేట MP అభ్యర్థిగా పోటీ చేస్తారనే వార్త గట్టిగా వినిపిస్తోంది.
ఎలక్షన్ కోడ్ ప్రకటించడంతో ప్రభుత్వ పథకాల్లో రాజకీయ నాయకుల ఫొటోలకు చెక్ పెట్టారు. చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున్న చిక్కీలపై ఉన్న ఫోటోలను తొలగించారు. రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా చిక్కీలను మాత్రమే విద్యార్థులకు అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు HMలకు ఆదేశాలు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.