Chittoor

News August 8, 2024

రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి

image

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు రేణిగుంట విమానాశ్రయంలో బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. భాను ప్రకాశ్ రెడ్డి, కోలా ఆనంద్ తదితరులు శ్రీకాళహస్తీశ్వర స్వామి శేష వస్త్రంతో సన్మానించి.. స్వామివారి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రెడ్డి, పుల్లయ్య నాయుడు, హరీష్, భరత్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

News August 8, 2024

బస్సు డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్సీ

image

కుప్పం-తిరుపతి బస్సు సర్వీసును ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు. ఆయన రిబ్బన్ కట్ చేసి, పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన బస్సును నడిపారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణికుల సౌకర్యార్థం నూతన బస్సులను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం పెంచులయ్య, సీఎంఏ నరసింహులు, కౌన్సిలర్లు జిమ్ దాము, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

News August 8, 2024

త్వరలో తిరుపతికి ఓబరాయ్ హోటల్స్

image

తిరుపతిలో ఏడు నక్షత్రాల ఓబెరాయ్ హోటల్స్ కు స్థలాన్ని కేటాయించినా గత ప్రభుత్వంలో కొన్ని కారణాలు చేత ప్రాజెక్టు అటకెక్కింది. ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు తిరుపతి ఎస్వీ జూపార్కు సమీపంలో (దేవలోక్) ఓబెరాయ్ హోటళ్ల కోసం కేటాయించిన స్థలాన్ని టూరిజం, రెవిన్యూ అధికారులతో కలిసి కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పరిశీలించారు. సంబంధిత అధికారులకు కలెక్టర్ తగు సూచనలు చేశారు.

News August 8, 2024

తిరుపతి సెబ్ డీఎస్పీ బదిలీ

image

తిరుపతి సెబ్ డీఎస్పీ వెంకటాద్రిని రేణిగుంటకు బదిలీ చేస్తూ DGP ద్వారక తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా రేణిగుంట DSP భావ్య కిశోర్ రాజమండ్రికి, పుత్తూరు శ్రీనివాస రావు CID DSPగా, RSASTF DSP రవిబాబు పుత్తూరుకు, సెబ్ DSP వెంకటనారాయణను తిరుపతి డిఎస్పీగా బదిలీ అయ్యారు.

News August 8, 2024

పలమనేరు: 19మంది మెప్మా సిబ్బందిపై వేటు

image

‘డాయ్’ యాప్ మోసాలపై మెప్మా సిబ్బందిపై వేటు పడింది. డాయ్ యాప్ మోసాలపై త్రిసభ్య కమిటీ విచారణ జరిపి నివేదిక ఇచ్చింది. దీని మేరకు సిటీ మిషన్ మేనేజర్ ఉమేష్ జాదవ్, ముగ్గురు కమ్యూనిటీ ఆర్గనైజర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్ రాజేశ్, 14 మంది ఆర్పీలను తొలగించేలా మెప్మా పీడీ ఆదేశాలను జారీ చేశారు. అలాగే వీరిపై క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశించారు.

News August 8, 2024

కురబలకోట: కారు ఢీకొని యువకుడి దుర్మరణం

image

కురబలకోట(మం), కంటేవారిపల్లె వద్ద కారు ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడినట్లు ముదివేడు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. తంబళ్లపల్లె మండలం, కోటాలకు చెందిన నాని నాయక్(20), రఘు నాయక్ (21) బైకులో కంటేవారిపల్లెకు వినాయకుని విగ్రహాలు చూడడానికి వచ్చారు. విగ్రహాలు చూసి తిరిగి ఇంటికి వెళ్తుండగా కారుఢీకొని నాని మృతి చెందాడు. రఘునాయక్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు.

News August 8, 2024

చిత్తూరు: లక్ష్యాలను పూర్తి చేయాలి-కలెక్టర్

image

జిల్లాలో పీఎం ఆవాస్ యోజన లక్ష్యాలను చేరుకునేలా సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గృహ నిర్మాణాలపై కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. 22,125 గృహాల నిర్మాణాల పూర్తికి లబ్ధిదారులతో చర్చించి.. నిర్మాణాలను పూర్తిచేసేలా చూడాలన్నారు. నిర్మాణాలు పూర్తి కాకపోవడానికి గల కారణాలను ప్రతి లబ్ధిదారులతో మాట్లాడాలన్నారు. డీఆర్‌డీఎ ద్వారా మహిళా సంఘ సభ్యులకు రుణాలు అందించేలా చూడాలన్నారు.

News August 7, 2024

కురబలకోట: డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

image

ఒంటరి జీవితంపై విరక్తితో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ముదివేడు మల్లికార్జునరెడ్డి తెలిపారు. కురబలకోట మండలం, తెట్టుకు చెందిన లేట్ మహేశ్వర్ కొడుకు జయకృష్ణ (21) మదనపల్లెలోని ప్రయివేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. తండ్రి ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం, దానికితోడు ఒంటరిజీవితం గడపడం జీర్ణించుకోలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు.

News August 7, 2024

వికోట: రన్నింగ్‌లో ఊడిన ఆర్టీసీ బస్సు చక్రం

image

కుప్పం డిపోకు చెందిన బస్సు వీకోట మండలం ముదురం దొడ్డి వద్ద వెళ్తుండగా బస్సు వెనకాల చక్రం రన్నింగ్‌లో ఊడిపోయింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. కుప్పం ఆర్టీసీ డిపో పరిధిలో బస్ సర్వీసులను పెంచిన ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్నారంటూ ప్రయాణికులు వాపోతున్నారు. 22 మంది ప్రయాణికుల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపీరి పీల్చుకున్నారు.

News August 7, 2024

9న తిరుపతిలో జాబ్ మేళా

image

తిరుపతి SV యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో 9వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. డిక్సన్, మారుతి సుజుకి కంపెనీ ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వాళ్లు అర్హులు. మొత్తం 365 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. వివరాలకు https://forms.gle/aPNi5UoTf8ARRnT6 గూగుల్ పామ్ చూడాలి.