Chittoor

News August 7, 2024

చిత్తూరులో 20 వేల చేనేత కుటుంబాలు

image

భారత ప్రభుత్వం 2015 నుంచి ఏటా ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 20 వేల కుటుంబాలు పైగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి, మదనపల్లె, వరదయ్యపాలెం, నారాయణవనం, పాలమంగళం, పులిచెర్ల ప్రాంతాల్లో సిల్క్, కంచి పట్టుచీరలు నేస్తుంటారు. 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం చేనేత కార్మికులను ప్రోత్సహించింది.

News August 7, 2024

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఇద్దరు మృతి

image

తిరుమలలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి కొండకు వస్తున్న బైకును.. అదే మార్గంలో తిరుమలకు వస్తున్న ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. మృతదేహాలు బస్సు కిందే ఇరుక్కుపోయాయి. మృతులు ఎవరనేది తెలియాల్సి ఉంది.

News August 7, 2024

నా సొంత డబ్బులు రైతులకు కట్టా: ఎంపీ

image

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పుంగనూరు ప్రాజెక్టుల నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రిజర్వాయర్ నిర్మాణంలో రైతులు నష్టపోకుండా తమ సొంత నిధులు రూ.1.49 కోట్లను నష్టపరిహారంగా చెల్లించామని గుర్తించారు. టీడీపీ కుట్రలతో ప్రాజెక్టులను అడ్డుకుందన్నారు.

News August 7, 2024

కార్వేటినగరం: డీఎల్ఈడీ ఫెయిల్ వారికి గమనిక

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రైవేటు డీఎల్ఈడీ కాలేజీల్లో 2018-20 రెగ్యులర్, స్పాట్ అడ్మిషన్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, ఆ కళాశాల మూతపడినట్లయితే కార్వేటినగరం ప్రభుత్వ డైట్ కళాశాలను సంప్రదించాలని ప్రిన్సిపల్ శేఖర్ సూచించారు. ప్రభుత్వ డైట్ కళాశాలలో సంప్రదించి పరీక్ష ఫీజు కట్టి రాయవచ్చన్నారు. మరిన్ని వివరాలకు కార్వేటినగరం డైట్ కాలేజీని సంప్రదించాలని సూచించారు.

News August 7, 2024

అవినీతి నిరూపిస్తే తప్పుకుంటా: పీలేరు సర్పంచ్

image

తనపై <<13792038>>అవినీతి <<>>ఆరోపణలు నిరూపిస్తే పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమని పీలేరు సర్పంచ్ జీనత్ షఫీ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ‘నేను పదవిలోకి వచ్చినప్పటి నుంచే పంచాయతీ అప్పుల్లో ఉంది. అయినా పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నా. పార్టీలకు అతీతంగా బాధ్యతతో పాలన చేశా’ అని చెప్పారు. పీలేరు రూ.కోట్లలో అవినీతి జరిగిందని నిన్న ఎంపీడీవో ప్రకటించిన విషయం తెలిసిందే.

News August 7, 2024

తిరుపతి జిల్లాలో చిరుత సంచారం?

image

తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం పరమాలలో అడవి జంతువు సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన శేషమ్మ సోమవారం రాత్రి తన పశువులను పొలాల సమీపంలో కట్టేసి ఇంటికి వచ్చారు. మంగళవారం ఉదయం పాలు పితికేందుకు వెళ్లగా తాడుకు కట్టేసిన దూడను చంపి తినడం గుర్తించారు. అటవీ బీట్ అధికారి కిషోర్ కుమార్ జంతువు పాద ముద్రలు సేకరించారు. దాడికి పాల్పడింది చిరుతా? లేదా రేసుకుక్కలా? అని తేలాల్సి ఉంది.

News August 7, 2024

తిరుపతి: 20వ తేదీ నుంచి పీజీ పరీక్షలు

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 20వ తేదీ నుంచి పీజీ M.A/M.Sc/M.Com ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం అవుతాయని తిరుపతి ప్రాంతీయ కార్యాలయ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.braouonline.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు. వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని చెప్పారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News August 6, 2024

మధ్యవర్తులను సంప్రదించవద్దు: టీటీడీ

image

ఆన్‌లైన్‌లో దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు మధ్యవర్తులను సంప్రదించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇటీవల వెరిఫికేషన్‌లో 545 మంది యూజర్ల ద్వారా దాదాపు 14,449 అనుమానిత శ్రీవాణి టికెట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్లు పేర్కొంది. అటువంటి వాటినీ బ్లాక్ చేశామని.. ఇకపై ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించింది.

News August 6, 2024

TTDలో సెల్ ఫోన్లు, వాచీల టెండర్ కం వేలం

image

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన సెల్ ఫోన్లు, వాచీలు ఆగస్టు 12, 13వ తేదీల్లో టెండర్ కం వేలం(ఆఫ్‌లైన్) నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు ఇతర వివరాలకు www.tirumala.orgను చూడాలని సూచించింది.

News August 6, 2024

మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో నిందితులను అరెస్టు చేయండి

image

మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం కేసులో నిందితులను అరెస్టు చేయాలని మదనపల్లె కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రెడ్డి సాహెబ్ డిమాండ్ చేశారు. సబ్ కలెక్టరేట్లో నిరసన తెలిపారు. గత నెల 21న గుర్తుతెలియని వ్యక్తులు రెవెన్యూ రికార్థులు దగ్ధం చేసిన విషయం తెలిసిందే. ఫైళ్ల దగ్ధం జరిగి 15 రోజులు గడుస్తున్న నిందితులను గుర్తించడం, అరెస్టు చేయడంగానిచేయలేదని అన్నారు. అనంతరం ఏవోకు వినతి పత్ర ఇచ్చారు.