Chittoor

News August 3, 2024

అక్టోబరు 4 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

image

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో అధికారులతో సమీక్ష సమావేశంనిర్వహించారు. అడిషనల్ ఈ.ఓ మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

News August 3, 2024

తిరుపతిలో బంగారం ధరలు ఇవే..

image

AP బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ తిరుపతి వారి వివరాల మేరకు శనివారం సాయంత్రం బులియన్ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10gm బంగారం ధర రూ.72160, 22 క్యారెట్ల 1gm బంగారం ధర రూ.6674గా ఉంది. ఒక సవరం బంగారం (8gm) ధర రూ.53392లుగా ఉంది. వెండి 1కిలో రూ.85,000, రిటైల్ ధర 1gm రూ.87.00గా ఉంది.

News August 3, 2024

చిత్తూరు: ట్రాక్టర్ ఢీకొని రెండేళ్ల చిన్నారి దుర్మరణం

image

కోసువారిపల్లిలో ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ రోజు జరిగిన ఈ ఘటనపై తంబళ్లపల్లె SI శివకుమార్ ప్రకారం.. చరణ్, నందినిల కుమార్తె రూప(2) ఇంటి ముందు ఆడుకుంటుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని కుటుంబీకులు మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందిందినట్లు వైద్యులు తెలిపారు. చరణ్ దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

News August 3, 2024

సదుం: కోనేరులో పడి అవ్వ, మనుమడు మృతి

image

కోనేరులో పడి అవ్వ, మనుమడు మృతి చెందిన విషాదకర ఘటన సదుం మండలంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పీలేరుకు చెందిన తులసమ్మ (55) మనవడు అద్విక్ (3) తో కలసి మండలంలోని కొత్తపల్లిలో జరుగుతున్న గృహనిర్మాణం పరిశీలించేందుకు వచ్చారు. శనివారం కావడంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యలో విరుపాక్షమ్మ ఆలయం వద్దనున్న కోనేరులో ఇద్దరూ ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు.

News August 3, 2024

చిత్తూరు: బస్సు బోల్తా.. 13 మందికి గాయాలు

image

బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ రోడ్ వద్ద బెంగళూరు నుంచి వెళ్తున్న బస్సు వేకువ జామున బోల్తా పడింది. మొత్తం 28 మంది ప్రయాణికులు ఉండగా, 13 మందికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

News August 3, 2024

చిత్తూరు : వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

చిత్తూరు జిల్లాలోని డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) నందు -9 పోస్టులు, మిషన్ శక్తి ప్రాజెక్టు కింద -9 పోస్టులు, ICDS – నందు 8 మొత్తం 26 కాంట్రాక్ట్ ప్రాతిపదికగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత ఇతర వివరాలకు https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 10.

News August 3, 2024

తిరుపతి : B.Tech డైరీ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు

image

శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నందు 2024-25 విద్యా సంవత్సరానికి B.Tech డైరీ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ చంగల్ రాయులు ప్రకటనలో పేర్కొన్నారు. AP EAPCET-2024 ప్రవేశపరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.svvu.edu.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 12.

News August 3, 2024

మదనపల్లె వైస్ ఛైర్మన్‌పై ఏడు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు

image

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో పైళ్ల దగ్ధం కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఫైళ్ల దగ్ధంకు సంబంధించి మదనపల్లె మున్సిపల్ వైస్ ఛైర్మన్ జింక వెంకటచలపతిపై వన్ టౌన్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. జింక చలపతిపై ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్టుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే 8 మందిపై కేసులు నమోదు కాగా మాధవ రెడ్డి, బాబ్జాన్ తదితరులు పరారీలో ఉన్నారు.

News August 3, 2024

భక్తుల సౌకార్యాలకు ఎలాంటి ఆటంకం కలగకూడదు

image

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ను తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి శ్యామల రావు శుక్రవారం తనిఖీ చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై భక్తులను ఆరా తీశారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకూడదన్నారు. అలాగే మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

News August 3, 2024

స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నిర్వహించే వేడుకలను ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దిశా నిర్దేశం చేశారు. తిరుపతి కలెక్టరేట్లో పోలీసు పెరెడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల పై శుక్రవారం జిల్లా వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.