India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిత్తూరు: పుంగనూరులోని కొత్త ఇండ్లు మున్సిపల్ పాఠశాలలో తమ పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. పాఠశాలలో 750 మంది విద్యార్థులకు చదువుకోవడానికి మౌళిక వసతులు ఉన్నప్పటికీ ఇప్పటికే దాదాపు 1000 మందికిపైగా విద్యార్థులు ఉన్నట్లు హెచ్ఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. 6వ తరగతిలో ఇప్పటికి 150 మంది చేరారని అన్నారు.
ఆహారంలో విషపూరిత జెర్రి ప్రత్యక్షమైన ఘటన తిరుపతిలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తిరుపతిలోని ఓ సినిమా హాలు సమీపంలోని ఓ హోటల్లో తినే ఆహారంలో జెర్రి ప్రత్యక్షం కావడంతో కస్టమర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా ఏలూరిని నియమించాలని చంద్రబాబు సర్కార్ చూస్తోందని సమాచారం. రాష్ట్ర మంత్రిమండలిలో ఏలూరికి స్థానం దక్కకపోవడంతో ఆయనకు సముచిత స్థానం కల్పించాలని అధిష్ఠానం చూస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే బాపట్ల జిల్లాలో ఎన్డీఏ కూటమి ఘన విజయానికి కారకులైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకి టీటీడీ ఛైర్మన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు ధీమాగా ఉన్నారు.
తాడేపల్లిలో వైసీసీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరయ్యారు. వారితోపాటు మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, విజయానంద రెడ్డి, మాజీ మంత్రి రోజా తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యకలాపాలపై దిశా నిర్దేశం చేశారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బదిలీ అయ్యారు. మైనింగ్, జియాలజీ శాఖ కమిషనర్గా పదోన్నతిపై వెళ్తుండడంతో కలెక్టరేట్ అధికారులు ఆయనను ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.
ఇవాళ జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఓడిపోయిన, గెలిచిన అభ్యర్థులతో జగన్ చర్చించనున్నారు. ఈ సమావేశానికి వెళ్లడానికి చిత్తూరు, అనంతపురం జిల్లాకు చెందిన నాయకులు బెంగళూరు నుంచి విజయవాడకు విమానం బుక్ చేసుకున్నారు. ఇవాళ ఉదయం 7.30కి బయల్దేరాల్సి ఉండగా చివరి నిమిషంలో విమానం రద్దు అయ్యింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తదితరులు సమావేశానికి దూరమయ్యారు.
తిరుపతి కేంద్రంగా భారత, ఆంధ్ర పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ, అప్లయిడ్ న్యూట్రీషియన్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్.రమణప్రసాద్ తెలిపారు. ఇంటర్, డిగ్రీ పాస్ లేక ఫెయిల్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఓటమి తర్వాత వైసీపీ అభ్యర్థులు, నేతలు ప్రజల్లోకి రాలేదు. కొందరు ఆ పరాభవం నుంచి ఇంకా తేరుకోలేదు. జిల్లాలో కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి సైతం ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇటీవల పుంగనూరు పర్యటన ఖరారైనప్పటికీ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఇవాళ జగన్ గెలిచిన, ఓడిపోయిన అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి పెద్దిరెడ్డి హాజరవుతారా? ఓటమిపై ఏమైనా సందేశం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.
శ్రీ సిటీలోని ALSTOM కంపెనీలో ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు APSSDC తిరుపతి జిల్లా అధికారి లోకనాథం పేర్కొన్నారు. డిప్లమా, ఐటిఐ వెల్డర్ పూర్తిచేసి 18-22 సంవత్సరాల్లోపు యువతి, యువకులు అర్హులన్నారు. మొత్తం 60 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు https://forms.gle/zHku28A3SuT8a24E6 వెబ్ సైట్ లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 28.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లాలో మైనింగ్ మాఫియా నడిపారని వైసీపీ కాంట్రాక్టర్లు చంద్రశేఖర్రెడ్డి, కూడేరు రవి ఆరోపించారు. తాము అన్ని రకాల అనుమతులు తీసుకున్నా.. అక్రమ కేసులు పెట్టి తమ క్వారీలను లాక్కున్నారని మండిపడ్డారు. అమిగోస్ మినరల్స్ ద్వారా రూ.1000 కోట్ల ఖనిజం దోచేశారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నించిన తమను పెద్దిరెడ్డి అనుచరులమంటూ అమిగోస్ ప్రతినిధులు బెదిరించారన్నారు.
Sorry, no posts matched your criteria.