Chittoor

News August 1, 2024

కుప్పం: 18 మంది సస్పెండ్

image

సీఎం చంద్రబాబు సమక్షంలో నిన్న టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు ఎంపీటీసీలను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ భరత్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేసిన కుప్పం, గుడిపల్లి, శాంతిపురం మండలాలకు చెందిన 13 మంది ఎంపీటీసీలతో పాటు కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

News August 1, 2024

చిత్తూరు జిల్లాలో ఉదయం 11 కే 90.28% పెన్షన్ పంపిణీ

image

చిత్తూరు జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంది. ఉదయం 11 గం. ల వరకు 90.28% పెన్షన్ పంపిణీ చేశారు. పెన్షన్ పంపిణీ వివరాలు ఇలా ఉన్నాయి. యాదమరి-96.97, నగరి-94.99, విజయపురం-94.43, చిత్తూరు -94, పుంగనూరు-92, పెద్దపంజాని -92, కార్వేటినగరం-92, ఐరాల-92, నిండ్ర-92, పుంగనూరు-91, పులిచెర్ల-91, పలమనేరు-91, సోమల-91 పంపిణీ చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.

News August 1, 2024

పనులకు ప్రతిపాదనలు పంపండి: జడ్పీ ఛైర్మన్

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జడ్పీటీసీల పరిధిలో రూ.30 లక్షలు, ఎమ్మెల్యేల పరిధిలో రూ.50 లక్షల పనులు చేయడానికి ప్రతిపాదనలు పంపాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు కోరారు. ఇందులో 50 శాతం పనులు వాటర్ వర్క్స్, మిగిలినవి రోడ్లు, కాలువల పనులకు వాడుకోవాలన్నారు. మండలాల వారీగా జడ్పీటీసీలు సంబంధిత పనుల వివరాలు, అంచనా వ్యయంతో వివరాలను సిద్ధం చేసి రెండు వారాల్లోపు తమ కార్యాలయంలో అందజేయాలన్నారు.

News August 1, 2024

8న చిత్తూరు జిల్లాలో SMC ఎన్నికలు

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఆగస్టు 8న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ) ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమగ్రశిక్ష జిల్లా ఏపీసీ వెంకట రమణారెడ్డి తెలిపారు. 8వ తేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ ఉంటుందని చెప్పారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక, మధ్యాహ్నం 2 గంటలకు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు.

News August 1, 2024

చిత్తూరు: 11లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి

image

డీఎల్ఎడ్ రెండో సెమిస్టర్ పరీక్ష ఫీజు ఈనెల 11వ తేదీలోగా చెల్లించాలని డీఈవో దేవరాజు సూచించారు. 2023-25, 2021-23, 2022-24 బ్యాచ్ ఒన్స్ ఫెయిల్డ్ విద్యార్థులకు సెప్టెంబరులో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రూ.50 అపరాధ రుసుంతో ఈనెల 19 వరకు గడువు ఉందన్నారు. రెగ్యులర్ విద్యార్థులు, నాలుగు నుంచి ఆరు సబ్జెక్టులు తప్పినవారు రూ.150, మూడు సబ్జెక్టులకు రూ.140 అని చెప్పారు.

News August 1, 2024

TPT: యువతా.. ఆత్మహత్య చేసుకోకండి

image

అర్థం కాని పాఠాలు, చదువుల ఒత్తిడి విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి. కురబలకోట యవకుడు నవీన్ కుమార్ <<13746460>>ఆత్మహత్య <<>>ఘటనే ఇందుకు నిదర్శనం. ‘అమ్మా.. నాన్న.. తరగతిలో చెప్పే విషయాలు నాకు అర్థం కావడం లేదు. అందుకే నేను చచ్చిపోతున్నా’ తిరుపతిలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదివే నవీన్ చివరి మాటలు ఇవి. జీవితంలో పైకి రావడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. బలవన్మరణాలకు పాల్పడి తల్లిదండ్రులను బాధపెట్టడం సరికాదు.

News August 1, 2024

మదనపల్లె ఘటనపై CID విచారణ..!

image

మదనపల్లెలో రికార్డుల దగ్ధంపై CM చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. భూ బాధితులందరికీ న్యాయం జరగాలంటే ఈ కేసును CIDకి అప్పగించాల్సిందేనని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై అధికారులతో ఆయన సమీక్ష చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో బాధితులు ఉంటారనేది తాను అసలు ఊహించలేదని మదనపల్లెలో అర్జీలు స్వీకరించిన సిసోడియా సీఎంకు చెప్పారు. సీఐడీ విచారణపై రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.

News August 1, 2024

హోటల్‌గా మారనున్న కుప్పం వైసీపీ కార్యాలయం

image

కుప్పం పట్టణంలోని పాత వైసీపీ కార్యాలయం హోటల్‌గా మారనుంది. ఎన్నికల్లో ఓటమి అనంతరం పలువురు వైసీపీ నాయకులు స్థానికంగా అందుబాటులో ఉండటం లేదని సమాచారం. పార్టీ కార్యకలాపాలు పెద్దగా నిర్వహించడం లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన భరత్ తన క్యాంపు కార్యాలయంలోనే పార్టీ వ్యవహారాలు నడుపుతున్నారు. దీంతో పాత ఆఫీసు భవనాన్ని ఖాళీ చేశారు. సదరు యజమాని అందులో హోటల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

News August 1, 2024

చిత్తూరు: సీసీ కెమెరాలు ఉండేలా చూడాలి

image

గ్రామాలలోని ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని ఎస్పీ మణికంఠ సూచించారు. పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం ఎస్పీ నిర్వహించారు. కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించాలని ఆయన సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలన్నారు. పెండింగ్ కేసులపై శ్రద్ధ వహించి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.

News July 31, 2024

పెద్దిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

image

ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలన్న పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల అఫిడవిట్‌లో స్థిరాస్తుల వివరాలను పేర్కొనలేదని పిటిషనర్ తెలపడంతో పెద్దిరెడ్డిని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా పుంగనూరులో పోటీ చేసిన అభ్యర్థులనూ ప్రతివాదులుగా చేర్చాలంది. తదిపరి విచారణ ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది.