India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అవును ఇది అక్షరసత్యం. గడిచిన ఐదేళ్లలో తిరుపతి జిల్లాలో 3746 మంది మిస్సింగ్పై పోలీసులకు ఫిర్యాదులు అందాయని లోక్సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఇందులో బాలికలు 1389 మంది, 2357 మంది యువతులు, మహిళలు ఉన్నారు. అలాగే గడిచిన ఐదేళ్లలో 3848 మంది ఆచూకీ గుర్తించారు. ఇందులో 1420 మంది బాలికలు, 2418 మంది యువతులు ఉన్నారు. 2019 ముందు కేసులను కలపడంతోనే ఐదేళ్లలో ఆచూకీ దొరికన వారి సంఖ్య పెరిగింది.

తిరుపతి : శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది నవంబర్ నెలలో ఎం ఫార్మసీ (M.Pharmacy) 2వ సెమిస్టర్, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో MBA (CBCS) 1వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు బుధవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

టైర్ల కంపెనిలో పని చేయడానికి వచ్చిన కార్మికుడిని కత్తితో పొడిచి హత్యచేసి, మరొక వ్యక్తిపై దాడిచేసిన కేసులో నిందితునికి మదనపల్లె 2వ అదనపు జిల్లాజడ్జి బందెల అబ్రహాం జీవితఖైదు విధిస్తూ బుధవారం సంచలన తీర్పుచెప్పారు. ఏపీపీ, టూ టౌన్ సీఐ యువరాజ్, ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపిన వివరాలు.. మదనపల్లి భాగ్యలక్ష్మి రైస్ మిల్లులో టైర్ల తయారీకి వచ్చిన కేరళ మణికంఠన్ను 2016లో సుబ్రహ్మణ్యం హత్యచేయడంతో శిక్ష పడింది.

చిత్తూరు జిల్లాలోని పలువురు DSPలు బదిలీ అయ్యారు. రాజారావు(TPT)ను విజయవాడ ACPగా, జి శ్రీనివాసరావు(TPT)ను నెల్లూరు రూరల్ SDPOగా, ఉమమహేశ్వరరెడ్డి(SKHT), శరత్ రాజ్ కుమార్ (చంద్రగిరి), ప్రసాద్ రెడ్డి(MPL), షను షెక్(TPT)ను పోలీసు Hqtrకు, రవిమనోహారాచారి(TPT)ని CID DSPగా, శ్రావణ్ కుమార్(CTR)ను ఏలూరుటౌన్కు, B.మురళి(TPT)ను పులివెందులకు, శ్రీనివాసాచారి(తిరుమల) కర్నూల్ దిశ DSPగా బదిలీ అయ్యారు.

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు ముదివేడు ఎస్ఐ మల్లికార్జున రెడ్డి తెలిపారు. కురబలకోట రామిగానిపల్లి మధుసూదనరెడ్డి ఒక్కగానొక్క కొడుకు నవీన్ కుమార్(29) తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్లో రెండు సబ్జక్టులు ఫెయిలయ్యాడు. 2వ సంవత్సరం చదవనివ్వరని అమ్మానాన్నకు వాయిస్ మెసేజ్ పంపి సీటీఎం వద్ద ఉరేసుకున్నాడు.

కుప్పంలో వైసీపీకి షాక్ ఇస్తూ పలువురు ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని కుప్పం, శాంతిపురం, గుడిపల్లి మండలాలకు చెందిన 14 మంది వైసీపీ ఎంపీటీసీలతోపాటు కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బుధవారం అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి పెద్దిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రామచంద్రారెడ్డి, ఆయన ముఠా దాదాపు 20 వేల ఎకరాలు కబ్జా చేశారని, వాటి విలువ రూ.45 వేల కోట్లు ఉంటుందన్నారు. దీనిని తప్పించుకోవడానికే మదనపల్లె ఆర్డీవో కార్యలయంలో 22A ఫైళ్లు దగ్ధం చేశారన్నారు. మొత్తం 14 వేల ఎకరాలకు సంబంధించి ఫైళ్లు బూడిదయ్యాయన్నారు. అంతే కాకుండా పెద్దిరెడ్డికి చెందిన కంపెనీ PLR కు చెందిన టిప్పర్లపై విచారణ చేపడతామన్నారు.

చిత్తూరులోని కొంగారెడ్డిపల్లికి చెందిన స్వరూప్, ప్రియాంక దంపతుల కుమారుడు శరణ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. ఒక సంవత్సరం 9 నెలల వయసు ఉన్నప్పుడు 50 మీటర్ల రన్నింగ్ రేస్ను 28 సెకండ్లలో పూర్తిచేశాడు. తల్లిదండ్రులు వీడియో రికార్డ్ చేసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు పంపారు. వాళ్లు పరిశీలించి బాలుడి రికార్డును నమోదు చేసి సర్టిఫికెట్ అందజేశారు.

టెలికాం సంస్థల రేట్ల ప్రభావం చిత్తూరు జిల్లాలోనూ కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 3.5 లక్షలమంది BSNL కస్టమర్లు ఉన్నారు. ఫైబర్ నెట్ను 28 వేల మంది, ల్యాండ్ లైన్ సేవలను 4500 మంది వినియోగించుకుంటున్నారు. ఒక్క జులైలోనే ఈసంస్థకు 19వేల మంది కస్టమర్లు పెరిగారు. సాధారణ రోజుల్లో నెలకు 5 వేల మంది పెరుగుతుంటారు. త్వరలోనే 4G సేవలు అందుబాటులోకి తెస్తామని తిరుపతి ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ CAరెడ్డి వెల్లడించారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన భార్య స్వర్ణలత, కుమారుడు మిథున్ రెడ్డి పేరిట 236 ఎకరాలు ఉన్నట్లు తేలింది. ‘మీ భూమి’ పోర్టల్ ప్రకారం పెద్దిరెడ్డి పేరుతో 41.35, మిథున్ రెడ్డి పేరిట 23.42, స్వర్ణలత పేరిట 171.23 ఎకరాలు ఉన్నాయి. పుంగనూరు మండలం రాగానిపల్లె, మేలుపట్ల, భీమగానిపల్లె, చౌడేపల్లె మండలం దిగువపల్లె, మంగళంపేట, వెంకటదాసరపల్లె, తిరుచానూరు తదితర గ్రామాల్లో భూములు కొన్నారు.
Sorry, no posts matched your criteria.