Chittoor

News June 16, 2024

తిరుమలలో చేయాల్సిన మార్పులేంటి..?

image

తన పాలనలో తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని CM చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ధర్మారెడ్డిని తొలగించి TTD ఈవోగా శ్యామలరావును నియమించారు. సర్వ, దివ్య, బ్రేక్ దర్శన విధానాలపై భక్తులు పెదవి విరుస్తున్నారు. అన్నప్రసాదం, లడ్డూల నాణ్యతపైనా విమర్శలు ఉన్నాయి. నిరంతరం అన్నప్రసాదం అందించాలనీ కోరుతున్నారు. తిరుమలలో ఇంకా ఏమేమీ మార్పులు చేయాలో కామెంట్ చేయండి.

News June 16, 2024

చిత్తూరు: రేపు జంతు బలి నిషేధం: కలెక్టర్

image

సోమవారం చిత్తూరు జిల్లాలో జంతుబలులు నిషేధం ఉందని కలెక్టర్ షన్మోహన్ స్పష్టం చేశారు. ఆయన అధికారులతో, ముస్లిం మత పెద్దలతో సమీక్ష నిర్వహించారు. కాగా నగరంలోని రెడ్డిగుంట, మురకంబట్టు ప్రాంతాలలో మేకపోతు, పొట్టేళ్ల వ్యాపారం అధికంగా జరిగింది.

News June 16, 2024

చిత్తూరు: ఆస్తిలో వాటా అడిగిన చెల్లెలుపై అన్న దాడి

image

ఆస్తిలో వాటా అడిగిన చెల్లెలుపై అన్న కర్రతో దాడిచేసిన ఘటన నిమ్మనపల్లెలో జరిగింది. SI లోకేష్ రెడ్డి కథనం.. మండలంలోని పారేసువారిపల్లెకు చెందిన రామకృష్ణ, అతని చెల్లి మనోహర్ భార్య రమాదేవి(40) అదే గ్రామంలో ఉంటుంది. తల్లిదండ్రులు పసుపు కుంకుమకు ఇచ్చిన 2 ఎకరాలను తనకు ఇవ్వాలని శనివారం రాత్రి రమాదేవి నిలదీసింది. దీంతో ఆగ్రహించిన రామకృష్ణ తన చెల్లెలుపై కర్రతో దాడిచేసి తీవ్రంగా గాయపరచగా ఆస్పత్రికి తరలించారు

News June 16, 2024

తిరుపతి: 578 కేసులు.. రూ.12.93 లక్షల జరిమానా

image

విద్యుత్తు అక్రమ వినియోగంపై ఎస్పీడీసీఎల్ తిరుపతి సర్కిల్ పరిధిలో అధికారులు శుక్రవారం రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించారు. ఎనిమిది డివిజన్ల పరిధిలో 3,095 సర్వీసులు తనిఖీ చేసి.. అక్రమంగా విద్యుత్తు వాడుతున్న 578 మంది సర్వీసుదారులపై కేసులు నమోదు చేశారు. రూ.12.93 లక్షల జరిమానా విధించామని ఉన్నతాధికారులు తెలిపారు.

News June 16, 2024

చిత్తూరు: తగ్గుతున్న తోతాపురి మామిడి ధరలు

image

చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి ధరలు క్రమేపి తగ్గుతున్నాయి. గత నాలుగురోజుల్లో టన్ను రూ. 27 వేల నుంచి శనివారానికి రూ.22 వేలకు పడిపోయింది. సీజన్ ప్రారంభంలో టన్ను కాయలు రూ.27 వేలకు అమ్ముడుపోయాయి. వ్యాపారస్తులు సిండికేట్ గా మారి ధరలు తగ్గింపుకు కారణం అవుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

News June 16, 2024

రామకుప్పం: ఏనుగు దాడిలో రైతు మృతి

image

రామకుప్పం మండల పరిధిలో ఆదివారం వేకువజామున ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. మండల పరిధిలోని పీఎంకే తాండ వద్ద రైతు కన్నా నాయక్ (50) పై ఒంటరి ఏనుగు దాడి చేసి తొక్కి చంపేసింది. దిగువ తాండ నుంచి పీఎంకే తండాకు వెళ్తున్న రైతు కన్నా నాయక్‌పై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఏనుగుల దాడుల నియంత్రణలో ఫారెస్ట్ అధికారులకు పూర్తిగా విఫలమయ్యారంటూ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

News June 16, 2024

చిత్తూరు: చుడా ఛైర్మన్ రాజీనామా

image

చుడా చైర్మన్ పదవికి కట్టమంచి పురుషోత్తంరెడ్డి రాజీనామా చేశారు. గతంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయనకు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చుడా ఛైర్మన్‌గా నియమించారు. పదవీకాలం ముగియడంతో మరో రెండేళ్లు పొడిగించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో తన పదవికి రాజీనామా చేశారు.

News June 16, 2024

శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. 21న ఆర్జిత సేవా, 22న‌ అంగప్రదక్షిణం టోకెన్లు, 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు.

News June 15, 2024

చిత్తూరు: 18 మందికి జరిమానా

image

చిత్తూరు పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 18 మందికి పదివేలు రూ.1,80,000 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు తెలిపారు. చిత్తూరు పరిధిలో నిర్వహించిన వాహనాల తనిఖీలలో శుక్రవారం 18 మంది పట్టుబడినట్లు చెప్పారు. వారిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో ప్రవేశ పెట్టగా జడ్జి ఉమాదేవి ఫైన్ విధించినట్లు తెలిపారు.

News June 15, 2024

శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. 21న ఆర్జిత సేవా, 22న‌ అంగప్రదక్షిణం టోకెన్లు, 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు.