Chittoor

News June 15, 2024

తిరుపతిలో యువకుడు దారుణ హత్య

image

తిరుపతి: అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్‌లోని ఓఆయిల్ షాపు వద్ద ఓ వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. మృతుడు ముంగిలిపట్టుకు చెందిన మాదం ప్రసాద్‌గా గుర్తించారు. మద్యంమత్తులో గుర్తుతెలియని వ్యక్తులు ప్రసాద్‌తో శుక్రవారం రాత్రి 2 గంటల వరకు గొడవపడి, వెంటబడి హత్య చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఈస్ట్ డీఎస్పీ రవిమనోహరచారి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

News June 15, 2024

కె.వి పల్లి: గురుకులంలో ఉద్యోగ అవకాశాలు

image

కేవీ పల్లి మండలంలోని గ్యారంపల్లె గురుకుల కళాశాలలో ఖాళీగా ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ, ఆంగ్లంలో బోధించేందుకు తాత్కాలిక అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ చెన్నకేశవులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ప్రిన్సిపల్ ను సంప్రదించాలని కోరారు.

News June 15, 2024

అర్జున్ కుమార్తె రిసెప్షన్‌కు హాజరైన ఆర్కే రోజా

image

యాక్షన్ కింగ్, ప్రముఖ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య రిసెప్షన్ వేడుకలు ఘనంగా జరిగాయి. తమిళ హాస్యనటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడైన ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య పెళ్లయిన విషయం తెలిసిందే. శుక్రవారం చెన్నైలోని ఓ ప్యాలెస్‌లో వీరి రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆర్కే రోజా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

News June 15, 2024

తిరుపతి: 16న UPSC ప్రిలిమ్స్ పరీక్ష

image

తిరుపతి జిల్లాలో ఈనెల 16న ఆదివారం UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు జరగనున్నాయి. సంబంధిత ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లాలో ఈ పరీక్షలకు 11 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 5,518 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు.

News June 14, 2024

ఐదేళ్లు ఈవోగా కొనసాగిన ధర్మారెడ్డి

image

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ EOగా ఏవీ ధర్మారెడ్డిని నియమించారు. ఆయన రక్షణ శాఖకు చెందిన ఉద్యోగి. జగన్ సీఎం అయిన తర్వాత ధర్మారెడ్డిని డిప్యూటేషన్ మీద రాష్ట్రానికి తీసుకు వచ్చి మరి ఈవో పోస్టు అప్పగించారు. ప్రభుత్వం మారడంతో ఆయనపై వేటు పడింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్యామలరావును నూతన ఈవోగా నియమించింది.

News June 14, 2024

కాణిపాకం: ముగ్గురు యువకుల మృతి

image

చిత్తూరు జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాణిపాకం నుంచి బంగారుపాలేనికి బైకుపై వెళ్తున్న ముగ్గురు యువకులను ఇరువారం జంక్షన్ వద్ద లారీ ఢీకొట్టింది. సంక్రాంతిపల్లెకు చెందిన ముగ్గురు యువకులు చనిపోయారు. లారీ రాంగ్ రూట్లో రావడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తాలూకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News June 14, 2024

పెద్దిరెడ్డి అక్రమాలపై చంద్రబాబుకు లేఖ

image

గత ఐదేళ్లలో పెద్దిరెడ్డి, ఆయన కుటుంబం, అనుచరులు అరాచకాలు, భూకబ్జాలు, గనుల దోపిడీ చేశారని బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ఆరోపించారు. విద్యుత్తు ఒప్పందాల్లోనూ అవినీతి జరిగిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. వీటిపై సమగ్ర విచారణకు మూడు రకాల కమిటీలు వేయాలని.. పెద్దిరెడ్డిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

News June 14, 2024

వ్యభిచార ముఠాలో తిరుపతి వ్యక్తులు

image

హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా పోలీసులకు దొరికింది. విజయవాడకు చెందిన సూర్యకుమారి HYD మధురానగర్‌లో ఉంటోంది. అక్కడే ఆమెకు తిరుపతికి చెందిన విజయశేఖర్ రెడ్డి పరిచయమయ్యాడు. అతను కస్టమర్ల డేటా యాప్‌లో ఉంచుతాడు. యువతులకు డబ్బు ఆశ చూపి వాళ్లని వేణుగోపాల్ బాలాజీ(తిరుపతి) సహకారంతో కస్టమర్లు చెప్పిన హోటళ్లకు తీసుకెళ్లేవాడు. సూర్యకుమారి డబ్బులు తీసుకునేది. నిన్న పంజాగుట్టలోని ఓ హోటల్లో సోదాలు చేయగా దొరికిపోయారు.

News June 14, 2024

TPT: రేపు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

image

TTD ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు శనివారం ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ కార్యాలయం పేర్కొంది. పీడియాట్రిక్ అసోసియేట్& అసిస్టెంట్, పీడియాట్రిక్ ఇంటెన్స్‌ విస్ట్ , అసిస్టెంట్ అనస్తీషియా మొత్తం 4 పోస్టులు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://www.tirumala.org/ వెబ్‌సైట్ చూడాలన్నారు.

News June 14, 2024

CTR: మంత్రులు లేకున్నా.. సీఎం మనవారే

image

గతంలో ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులుగా వ్యవహరించారు. నారాయణ స్వామి డిప్యూటీ CM, ఎక్సైజ్ మంత్రిగా పని చేశారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కీలకమైన విద్యుత్తు, మైనింగ్ శాఖ.. రోజా పర్యాటక, క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజా కేబినెట్‌లో ఎవరికీ చోటు లేకపోయినా.. కుప్పం నుంచి గెలిచిన CM చంద్రబాబు సాధారణ పరిపాలన, లాండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలు ఉంచుకున్నారు.

error: Content is protected !!