India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అత్తను అల్లుడు దారుణంగా కొట్టి చంపిన ఘటన కేవీ పల్లి మండలంలో చోటుచేసుకుంది. కేవీ పల్లి(M) వగళ్ల గ్రామం నార్మకలపల్లికి చెందిన సురేశ్ భార్య నీలవతి(46)ను అల్లుడు విజయ్ కుమార్ దారుణంగా కర్రతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కేవీ పల్లి పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కలకడ CI శ్రీనివాసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

చిత్తూరు జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి అడ్మిషన్లకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ దేవరాజు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25వ విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. సెప్టెంబర్ 16లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక పరీక్ష జనవరి 18న నిర్వహిస్తామన్నారు.

మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఆదివారం రాత్రి జరిగిన ఫైళ్ల దగ్ధం కేసులో పోలీసు అధికారులు దూకుడు పెంచారు. మదనపల్లె వైసీపీ నేత, మున్సిపల్ వైస్ ఛైర్మన్ జింక వెంకటచలపతిని పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొదట ఆయన ఇంట్లో పోలీసుల సోదాలు నిర్వహించి, పలు డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే మరో వైసీపీ నేత బాబ్ జాన్ ఇంట్లోను తనిఖీలు చేయడానికి వెళ్లిన అధికారులకు సహకరించలేదని సమాచారం.

కలికిరి మండలం మర్రికుంటపల్లి వీఆర్వో క్రిష్ణయ్యపై ఎంఆర్ఓ సమక్షంలో ఏసీబీ అధికారులు తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం విచారణ చేపట్టారు. కామాక్షి అనే మహిళకు గజ్జలవారిపల్లి గ్రామం వద్ద తల్లి నుంచి సంక్రమించిన 23సెంట్ల భూమి ఆన్లైన్ చేయాలని వీఆర్ఓ ను ఆశ్రయించింది. వీఆర్ఓ రూ.5లక్షలు తీసుకున్నట్లు ఆరోపించింది. ఆన్లైన్ చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా వారి ఆదేశాలతో ACB అధికారులు విచారణ చేపట్టారు.

తిరుపతి జిల్లా నాగలాపురంలో బాలుడు మిక్కి(4) శుక్రవారం రాత్రి నీటితొట్టిలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. బతుకుతెరువు కోసం నాగలాపురం వచ్చిన బాలుడి తల్లిదండ్రులు రాజేశ్, అనిత బాలుడి మృతదేహాన్ని 2000కి.మీ దూరంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాల్గంజ్ జిల్లా కేంద్రంలోని వారి స్వగృహానికి తరలించారు. ఏకైక సంతానం మరణించడంతో వారు పుట్టెడు దుఃఖంలో బాలుడిని తరలిస్తుంటే నాగలాపురం ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు.

కేంద్ర ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు చేస్తోందని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ చిత్తూరు సహాయ సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు. 9, 10వ తరగతి చదువుతున్న వారు అర్హులని చెప్పారు. ఆగష్టు 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.depwd.gov.in, scholarships.gov.in వెబ్సైట్లు చూడాలన్నారు.

తిరుపతిలో భార్యాభర్తల నయా దందా వెలుగులోకి వచ్చింది. తిరుపతి రూరల్ పుదిపట్లకు చెందిన ప్రణవ్ కృష్ణ తన సహచర విద్యార్థిని తన ఇంటికి తీసుకెళ్లింది. భర్త కృష్ణ కిషోర్ రెడ్డితో కలిసి కూల్డ్రింకులో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చారు. మైకంలో ఉండగా కృష్ణకిషోర్ లైంగిక దాడి చేసి వీడియో తీశారు. బాధిత మహిళ అన్న, కాబోయే భర్తకు వీడియో పంపి డబ్బు డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు.

తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో టీటీడీ ఈవో శ్యామలరావు వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమన్నారు. త్వరలో ఆహార భద్రత ప్రమాణాలపై అన్నప్రసాదం సిబ్బంది, హోటల్ యజమానులకు శిక్షణ ఇస్తామన్నారు. తిరుమలలోని ప్రతి హోటల్ వద్ద ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

తిరుపతి(రేణిగుంట) ఎయిర్పోర్టు పేరు త్వరలో మారనున్నట్లు తెలుస్తోంది. శ్రీవేంకటేశ్వర ఎయిర్పోర్టుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పే సమయంలో ఈ విషయాన్ని పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ వెల్లడించారు. అలాగే విజయవాడకు నందమూరి తారకరామారావు, ఓర్వకల్లుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేర్లను ప్రతిపాదించారు.

కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో యూజీ, పీజీ పరీక్ష ఫలితాలను ఇన్ఛార్జ్ వీసీ ప్రొ.ఎం. దొరస్వామి విడుదల చేశారు. వీసీ మాట్లాడుతూ జూన్, జులై 2024లో నిర్వహించిన యూజీ (బిఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ), పీజీ (ఏంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ) మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. పరీక్ష ఫలితాలను https://www.dravidianuniversity.ac.in/లో చూసుకోవచ్చని సూచించారు.
Sorry, no posts matched your criteria.