Chittoor

News June 11, 2024

SVU: రేపటి నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

image

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ (UG) రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు జూన్ 12 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. నిర్దేశించిన అన్ని కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. సుమారు 22,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News June 11, 2024

తిరుపతి : ప్యాసింజర్ రైలు తాత్కాలికంగా రద్దు

image

తిరుపతి – కాట్పాడి (07659) కాట్పాడి – తిరుపతి (07582) ప్యాసింజర్ రైలు ను మూడు వారాలపాటు తాత్కాలికంగా రద్దు చేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. తిరుపతి – కాట్పాడి సెక్షన్ నందు ఇంజనీరింగ్ వర్క్స్ కారణంగా రద్దయినట్లు తెలిపారు. నేటి నుండి జూన్ 30 వరకు ఈ రైలు తాత్కాలికంగా నడవదన్నారు . ప్రజలు, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News June 11, 2024

తిరుపతిజిల్లా మంగళంలో యువకుడు హత్య

image

తిరుపతి అర్బన్ మండలం మంగళం పరిధిలో యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. సోమవారం రాత్రి సమీపంలోని బొమ్మల క్వార్టర్స్ లో కాలనీకి చెందిన నలుగురు స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్టు స్థానికులు చెప్పారు. కొంత సమయం తర్వాత మద్యం మత్తులో అన్నామలై అనే యువకుడిని మిగిలిన వ్యక్తులు గొంతు మీద కాలేసి తొక్కి చంపినట్టు పోలీసులు తెలిపారు.
హత్యకు పాల్పడినట్టు చెబుతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News June 11, 2024

రామసముద్రం: సింగిల్ విండో అధ్యక్ష పదవికి కేశవరెడ్డి రాజీనామా

image

రామసముద్రం మండల సహకార బ్యాంకు అధ్యక్షులుగా ఉన్న కేశవరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సోమవారం రాజీనామా లేఖను ఉన్నతాధికారులకు పంపారు. కేశవరెడ్డి మాట్లాడుతూ.. గత 12 ఏళ్లుగా సింగల్ విండో అధ్యక్షులుగా పని చేసిన తనకు సహకరించిన అధికారులకు, బోర్డు సభ్యులకు, రైతులకు, ప్రజలకు, పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

News June 11, 2024

కుప్పం: స్నానానికి వెళ్లి విద్యార్థి మృతి

image

స్నానం కోసం వెళ్లి విద్యార్థి మృతి చెందిన సంఘటన కుప్పం మండలంలో జరిగింది. బెంగళూరులోని మహాలక్ష్మిపురంలో ఉంటున్న మునిరాజు కుమారుడు మౌనిశ్ (15) తల్లితో కుప్పం మండలం గుట్టపల్లెకాలనీకి వచ్చారు. అక్కడ బంధువుల వివాహం ముగించుకొని పాలారులో స్నానం చేసేందుకు తల్లితో కలిసి వెళ్లాడు. అక్కడ నీటిలో ఈతకొట్టేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News June 11, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

image

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచియున్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 15-18 గంటల సమయం పడుతోంది.. నిన్న శ్రీవారిని 78,064 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,869 వేల మంది తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసుని హుండీకి రూ.3.70 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ మంగళవారం వెల్లడించింది

News June 11, 2024

తిరుపతి: త్వరలో ఆంక్షలు ఎత్తివేత

image

వ్యవసాయ సర్వీసుల జారీపై విధించిన ఆంక్షలు త్వరలో ఎత్తివేయనున్నట్లు విద్యుత్తుశాఖ తిరుపతి ఎస్ఈ కృష్ణారెడ్డి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో నూతన వ్యవసాయ సర్వీసుల జారీ ప్రక్రియ నిలిపేశామని చెప్పారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిబంధనలు సడలించి ఆన్‌లైన్‌లో నమోదుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

News June 11, 2024

తిరుపతి: పండుగ వాతావరణంలో ప్రమాణస్వీకారం: కలెక్టర్

image

ఈ నెల 12 వ తేది జరగబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవం పండుగ వాతావరణంలో నిర్వహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఔత్సాహికులైన ప్రజలను నియోజకవర్గానికి నాలుగు బస్సుల ఏర్పాటు చేసి విజయవాడ సభకు తరలించాలని పేర్కొన్నారు. ప్రతి మండల కార్యాలయం, కళ్యాణ మండపాల్లో పండుగ వాతావరణంలో ప్రత్యక్ష ప్రసార వీక్షణకు
ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News June 10, 2024

చిత్తూరు: సెలవులపై వెళ్లిన టీటీడీ ఈవో

image

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఏపీ ప్రభుత్వం వారం రోజులు పాటు సెలవు మంజూరు చేసింది. అయితే రాష్ట్రం దాటి పోరాదని నిబంధన విధించింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సెలవు కోసం దరఖాస్తు చేసుకున్న ధర్మారెడ్డి సెలవును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పరిస్థితుల్లో వారం రోజులు పాటు సెలవు మంజూరు చేస్తూ రాష్ట్రం దాటి పోకుండా నిబంధన విధించడం సంచలనంగా మారింది.

News June 10, 2024

చిత్తూరు: శునకానికి పదవీ విరమణ

image

డాగ్ స్క్వాడ్ విభాగం ఆవరణలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బిందు అనే శునకానికి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. 11 ఏళ్ల పాటు డిపార్ట్మెంట్‌కు శునకం సేవలు అందించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ మణికంఠ హాజరై సన్మానించారు. అది చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డి.ఎస్.పి మహబూబ్ బాషా, ఆర్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!