India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దాడుల నుంచి కాపాడి కార్యకర్తలకు అండగా ఉండేందుకు వైసీపీ కేంద్ర కార్యాలయం కమిటీలను ఏర్పాటు చేసింది. చిత్తూరు పార్లమెంటు పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భరత్, ఆర్కే రోజా, సునీల్ కుమార్, వెంకటేగౌడ, రెడ్డెప్ప, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కృపాలక్ష్మి, విజయానందరెడ్డిని కమిటీలో నియమించింది. జిల్లాలో ఎక్కడైనా దాడులు జరిగితే కమిటీ సభ్యులు బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అండగా ఉంటారు.
రాష్ట్ర ఎన్నికల ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు తిరుపతిలో సాదర స్వాగతం లభించింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన ముఖేష్ కుమార్ మీనాకి జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సాదర స్వాగతం పలికారు. తిరుపతిలో విశ్రాంతి అనంతరం తిరుమలకు చేరుకొని శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
తిరుపతిలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ట్రాన్స్ ఫార్మర్ గుంతలో పడి మృతి చెందినట్లు అలిపిరి SI రామస్వామి తెలిపారు. అలిపిరి బాలాజీ బస్టాండ్ వద్ద మద్యం మత్తులో ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్రాన్స్ ఫార్మర్ కోసం తీసిన గోతిలో పడ్డాడు. ఎవరు చూడకపోవడంతో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రుయాలోని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
తిరుపతి వినాయక నగర్లో దొంగలు చొరబడి షకీల ఇంట్లో 46 గ్రాముల బంగారం, రూ.80 వేల నగదును ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. వినాయక నగర్లో ఉండే షకీల బుధవారం రాత్రి పనిపై తాళం వేసుకొని బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేనిది గమనించిన దొంగలు తలుపులు పగల గొట్టి చోరీ చేయడాన్ని గురువారం గుర్తించింది. ఫిర్యాదుపై స్పందించి క్లూస్ టీం పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. 22 మండలాల్లో వర్షపాతం నమోదు అయ్యింది. గంగాధరనెల్లూరు 38.2 మి.మీటర్లు, నగరి 34.8, కార్వేటినగరం 34.2, బంగారుపాళ్యం 32.0, తవనంపల్లె 26.4, ఎస్ ఆర్ పురం 23.6, చిత్తూరు టౌన్ 23.0, బైరెడ్డిపల్లె 19.4, చిత్తూరు రూరల్ 15.0, నిండ్ర 11.6, సదుం 11.2 మీ. మీటర్లు కురవగా.. మిగిలిన మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి.
జాతీయ ఉపకార వేతన పరీక్ష(ఎన్ఎంఎంఎస్) ఫలితాలు విడుదలయ్యాయని డీఈవో దేవరాజు తెలిపారు. ఈ www.bse.ap.gov.in వెబ్ సైట్ లో ఫలితాలను తెలుసుకోవచ్చన్నారు. ఎంపికైన విద్యార్థులకు మెరిట్ కార్డులు త్వరలో రాష్ట్రం నుంచి జిల్లా కార్యాలయానికి వస్తాయని చెప్పారు. ఉపకార వేతనాలకు అర్హత సాధించిన విద్యార్థులు తమ తల్లి లేక తండ్రితో ఏదైనా జాతీయ బ్యాంకులో జాయింట్ ఖాతా తెరవాలని సూచించారు.
పాతపేటలో మంగళవారం రాత్రి టీడీపీ నాయకులు వైసీపీ సర్పంచ్ మమత భర్త రవిచంద్రపై దాడి చేసిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. విజయోత్సవ సంబరాల్లో పేల్చిన టపాకాయలు రవిచంద్ర ఇంటి వద్ద అతని కుమార్తె, సోదరుని కుమారుడిపై పడి గాయపడినట్లు ఫిర్యాదు చేశారని చెప్పారు. చిన్నారులకు గాయాలయ్యేలా టపాకాయలు ఎందుకు కాల్చారని ప్రశ్నించడంపై దాడి చేశారని ఆరోపించారన్నారు.
కుటుంబ సమస్యలతో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మదనపల్లె మండలంలో జరిగిందని సీఐ శేఖర్ తెలిపారు. కోటవారిపల్లె తండాకు చెందిన చిన్నరెడ్డప్పనాయక్ కుమారుడు కృష్ణానాయక్(35) ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా జీవితంపై విరక్తి చెందాడు. భార్య అమ్రూ కూలి పనులకు వెళ్లడంతో ఇంట్లోనే చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిచూడగా భర్త చనిపోవడంతో బోరున విలపించింది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అమరావతిలో కలిశారు. మంగళగిరి నుంచి భారీ మెజారిటీతో గెలిచిన లోకేశ్ను ఆరణి శ్రీనివాసులు దుశ్శాలువతో సత్కరించారు. తిరుపతి నుంచి ఘన విజయం సాధించిన ఆరణి శ్రీనివాసులును లోకేశ్ అభినందించారు. తిరుపతి అభివృద్ధికి అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని నారా లోకేశ్ ఆరణి శ్రీనివాసులుకు భరోసా ఇచ్చారు.
తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మార్చి నెలలో ఎంఈడీ( MEd) మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు బుధవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Sorry, no posts matched your criteria.