India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుపతి పార్లమెంట్ కౌంటింగ్ హోరాహోరీగా జరిగింది. తొలుత వైసీపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి వెనుకబడ్డారు. తర్వాత ప్రతి రౌండ్లోనూ బీజేపీ వరప్రసాద్ వరప్రసాద్తో హోరాహోరీ తలపడ్డారు. చివరకు గురుమూర్తికి 6,32,228 ఓట్లు దక్కాయి. సమీప ప్రత్యర్థి వరప్రసాద్ రావు 6,17,659 ఓట్లు సాధించారు. ఈక్రమంలో గురుమూర్తి 14,569 ఓట్లతో గట్టెక్కారు. ఉప ఎన్నికలో ఆయన 2,30,572 ఓట్లతో గెలవడం విశేషం.
వైసీపీ ఘోర ఓటమితో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వెంటనే తన రిజైన్ ఆమోదించాలని కోరారు. ఈ మేరకు ఆయన టీటీడీ ఈవోకు లేఖ రాశారు. వైవీ సుబ్బారెడ్డి తర్వాత గత ఆగస్టు నెలలలో ఆయన ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
పుంగనూరు ఓట్ల లెక్కింపు 19 రౌండ్లలో జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు 18 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 94,876 ఓట్లు సాధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 6,538 ఓట్ల లీడ్తో ఉన్నారు. చివరి రౌండ్ ఫలితం వచ్చి దాదాపు 2 గంటలవుతున్నా.. తర్వాత అధికారులు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదట. అక్కడ ఏం జరుగుతుందో తెలియక రెండు పార్టీల నేతలు అయోమయానికి గురవుతున్నారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు ఎంపీ స్థానాలు ఉన్నాయి. చిత్తూరులో టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు 1,63, 508 ఓట్ల ఆధిక్యంలో విజయం వైపు దూసుకెళ్తున్నారు. తిరుపతిలో వైసీపీ అభ్యర్థి గురుప్రసాద్ 27,520 ఓట్ల లీడ్లో కొనసాగుతున్నారు. మరోవైపు రాజంపేట వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి 59,127 ఓట్ల ఆధిక్యంతో ముందుకు వెళ్తున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే పలువురు గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో నగరి అభ్యర్థి గాలి భానుప్రకాశ్ ఏకంగా చంద్రబాబు ఆధిక్యాన్నే దాటేశారు. భానుకు 10 రౌండ్లలో 32,420 ఓట్ల ఆధిక్యం లభించింది. చంద్రబాబు కేవలం 23,610 ఓట్ల లీడ్లో కొనసాగుతున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలం పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులే గెలుపు దిశగా పయనిస్తున్నారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 6,764, తంబళ్లపల్లెలో ఆయన సోదరుడు ద్వారకనాథ రెడ్డి 6,363 ఓట్ల లీడ్తో ఉన్నారు. మరోవైపు పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ స్థానంలో 36,207 ఓట్లతో ముందంజలో ఉన్నారు. పుంగనూరులో 4, తంబళ్లపల్లెలో 10 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది.
తిరుపతి జిల్లాలో అన్ని చోట్లా టీడీపీ హవా ఉన్నప్పటికీ.. సత్యవేడులో మాత్రం నువ్వానేనా అన్నట్లు ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు రెండు రౌండ్ల ఫలితాలు విడుదలయ్యాయి. టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం 8,184 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేశ్కు 7,246 ఓట్లు వచ్చాయి. టీడీపీ 938 ఓట్ల మెజార్టీతో ముందుకు కొనసాగుతోంది. టీడీపీ రెబల్ అభ్యర్థి జేడీ రాజశేఖర్కు కేవలం 37 ఓట్లే వచ్చాయి.
పుంగనూరులో ఎట్టకేలకు మంత్రి పెద్దిరెడ్డి ఆధిక్యతలోకి వచ్చారు. మొదటి రౌండ్లో 136, రెండో రౌండ్లో 501 ఓట్లతో వెనుకంజలో కొనసాగారు. తాజాగా మూడో రౌండ్లో ఆయనకు 45 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఇప్పటి వరకు పెద్దిరెడ్డికి 16,816 ఓట్లు వచ్చాయి.
పుంగనూరులో ఇప్పటి వరకు రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తి అయ్యింది. వరుసగా రెండో రౌండ్లోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థికి 11,359 ఓట్లు వచ్చాయి. దీంతో రెండో రౌండ్లోనూ 501 ఓట్లతో వెనుకంజలోనే ఉన్నారు.
పుంగనూరులో అనుహ్య ఫలితాలు వస్తున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుపడ్డారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి 5,685 ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం చల్లా 136 ఓట్ల స్వల్వ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Sorry, no posts matched your criteria.