India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రేణిగుంట విమానాశ్రయం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ప్రత్యేకంగా కేంద్ర మంత్రి అమిత్ షాకు వీడ్కోలు పలికారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఢిల్లీ వెళుతున్న అమిత్ షాను తిరుపతి, శ్రీకాళహస్తి నేతలు కలిశారు. నరేంద్ర మోదీ, అమిత్షా నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం ఖాయమని నినాదాలు చేశారు.
బేబి సినిమా ఫేం ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా గంగం గణేషా శుక్రవారం థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. సినిమాను చూసిన ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో సినిమా డైరెక్టర్ ఉదయ్ బొమ్మి శెట్టి తల్లిదండ్రులు పలమనేరు వాసులు కావడంతో వారు సినిమా చూసి సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమారుడు సినిమా రంగంలో ఇన్ని రోజులు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందన్నారు.
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ (UG) రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. నిర్దేశించిన అన్ని కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. సుమారు 22,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన వివేక్ కైలాస్, విక్రమ్ కైలాస్ రూ.1.5 కోట్లను స్వామివారికి చెందిన ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు విరాళం ప్రకటించారు. తమ కంపెనీ అక్షత్ గ్రీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట డీడీ తీశారు. తిరుమలలో టీటీడీ ఈవో ధర్మారెడ్డిని కలిసి ఆయనకు సంబంధిత పత్రాలు అందజేశారు. దాతలను పలువురు అభినందించారు.
తిరుపతి, చిత్తూరులో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పటిష్ఠంగా జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎస్వీ సెట్లో, తిరుపతి జిల్లాకు సంబంధించి పద్మావతి మహిళా యూనివర్సిటీలో కౌంటింగ్ నిర్వహిస్తారు. ఆయా కేంద్రాలను అధికారులు రెడ్జోన్గా ప్రకటించారు. వాటి చుట్టూ 2 కిలో మీటర్ల మేర ఎక్కడా డ్రోన్లు ఎగర వేయకూడదు. మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లెకు సంబంధించి రాయచోటిలో కౌంటింగ్ జరగనుంది.
చిత్తూరు జిల్లాలోని రైతులకు వ్యవసాయ రంగంలో సమగ్ర అభివృద్ధి సాధించాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆత్మ పథకాన్ని తీసుకు వచ్చింది. ఆత్మ సహకారంతో గ్రామస్థాయిలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేవారు. రైతులను విజ్ఞాన యాత్రకు తీసుకువెళ్లి వ్యవసాయ రంగంలో నూతన అంశాలను వివరించే వారు. ప్రస్తుతతం ఆత్మ సేవలు లేకపోవడంతో రైతులు చెందుతున్నారు. ఆ సేవలు కొనసాగించాలని రైతులు కోరుతున్నారు.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పలమనేరులో 287 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 21 రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారు. అత్యల్పంగా చిత్తూరులో 226, నగరిలో 229 పోలింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడి ఈవీఎంల లెక్కింపు 17 రౌండ్లలో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో చిత్తూరు లేదా నగరి ఎమ్మెల్యే ఎవరనేది ముందుగా తెలుస్తుంది. చివరగా పలమనేరు ఫలితం తేలే అవకాశం ఉంది. చిత్తూరు SVసెట్లో కౌంటింగ్ జరుగుతుంది.
ప్రేమ పేరుతో మోసగించిన ఘటన పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలంలో వెలుగు చూసింది. ఎస్ఐ ప్రతాప్ రెడ్డి వివరాల మేరకు.. దుర్గసముద్రం పంచాయతీ బుటకపల్లెకు చెందిన యువకుడు పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించాడు. ‘కులాలు వేరు కావడంతో నా తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. నువ్వు ఏమైనా చేసుకో’ అని యువకుడు బాలికతో అన్నాడు. దీంతో ఆమె ఉరేసుకుంది. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతోంది.
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నంజంపేటలో కత్తులతో దాడులు చేయడం కలకలం రేపింది. వైసీపీ నాయకుడు కృష్ణమూర్తి తన అనుచరులతో గ్రామంలోకి చొరబడి వీరంగం సృష్టించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలు ఉమాశంకర్, నాగభూషణం, గిరిప్రసాద్ ఇళ్ల వద్దకు వెళ్లి కత్తులతో దాడి చేశారని చెప్పారు. నాగభూషణం తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక మునిసిపాల్టీ పరిధిలోని బైరుగానిపల్లె సమీపంలోని ఓ చెట్టుకు యువకుడు ఉరేసుకుని ఉండటాన్ని స్థానికులు గురువారం సాయంత్రం గుర్తించారు. వెంటనే కుప్పం పోలీసులకు సమాచారం అందించారు. యువకుడు బైరుగానిపల్లెకు చెందిన చెందిన అంజి(30)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.