Chittoor

News May 25, 2024

తిరుమల: వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

image

తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ రోజురోజుకు పెరగడంతో దేవస్థానం అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ప్రస్తుతం దైవ దర్శనానికి 20 గంటల సమయం పట్టడం గమనించదగ్గ అంశం. ఒకవైపు ఎన్నికలు ముగియడం మరోవైపు వేసవి సెలవుల కారణంగా తిరుమల కొండకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నెల చివరి వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

News May 25, 2024

దాడికి పాల్పడ్డ వారిని శిక్షించాలి: చంద్రబాబు

image

ఎన్నికల్లో ఓటమి ఖాయమవ్వడంతో విచక్షణ కోల్పోయిన వైసీపీ నేతలు టీడీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గం, 89పెద్దూరుకు చెందిన టీడీపీ కార్యకర్త శేషాద్రిపై వైసీపీ మూకలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన చంద్రబాబు.. దాడికి పాల్పడ్డ వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. శేషాద్రి కుటుంబానికి అండగా ఉంటానన్నారు.

News May 25, 2024

మదనపల్లె: శేషాద్రి హత్యకు ఆధిపత్య గొడవలే కారణమా..?

image

మదనపల్లెలో శనివారం వేకువ జామున రామారావుకాలనీకి చెందిన పుంగనూరు శేషాద్రిని వేటకొడవళ్లతో నరికి హత్య చేసిన విషయం తెలిసిందే. స్థానికంగా ఉండే ఓ ముఠా ఈ ఘాతుకానిక పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఆధిపత్య పోరులో భగంగా ముఠాలోని సుమారు 30 మంది ప్రత్యర్థులు శేషాద్రిని కత్తులు, వేట కొడవళ్లతో 70సార్లు అతికిరాతకంగా నరికి హతమార్చారు. పోలీసులు కత్తిపోట్లు చూసి విస్తుపోయారు.

News May 25, 2024

పూతలపట్టు: ఉరి వేసుకుని వ్యక్తి మృతి

image

పూతలపట్టు మండలం మూర్తిగారి ఊరు దుర్గం గుట్టపైన చెట్టుకు ఉరి చేసుకొని వడివేలు (60) అనే వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం మేకలు మేపేవారు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. నెల రోజుల క్రితం మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 25, 2024

మదనపల్లెలో యువకుడు దారుణ హత్య

image

మదనపల్లిలోని రామారావు కాలనీకి చెందిన పుంగనూరు శేషు దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి స్థానిక వైఎస్ఆర్ కాలనీలో శేషును ప్రత్యర్థులు పథకం ప్రకారం హత్యచేసినట్లు ప్రాథమిక సమాచారం. యువకుడి హత్య జరిగిన విషయాన్ని తెలుసుకున్న మదనపల్లి రెండో పట్టణ పోలీసులు ఘటనాస్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 25, 2024

తిరుపతి: 27న క్యాంపస్ డ్రైవ్

image

పద్మావతిపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 27న క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీ ప్రకటించారు. ఐటీఐ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) ట్రేడ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News May 24, 2024

చంద్రగిరిలో వ్యక్తి హత్య

image

చంద్రగిరి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. పనపాకం గ్రామం వద్ద గుర్తు తెలియని ఓ వృద్దుడు హత్యకు గురైనట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. రెండు రోజుల క్రితం ఘటన జరిగినట్లు నిర్థారించారు. ఎవరో తలపై దాడి చేసి హత్య చేశారని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. 

News May 24, 2024

ఢిల్లీ ప్రమాదంలో పుంగనూరు వాసి మృతి

image

పుంగనూరుకు చెందిన పగడాల రవి, భవాని దంపతుల కుమారుడు పగడాల హర్షల్ మూడు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని తల్లిదండ్రులు మానవత్వంతో అవయవాల దానానికి అంగీకరించారు. ఎంబీఏ పూర్తి చేసుకున్న మృతుడు.. రెండు రోజుల్లో స్వస్థలానికి రావాల్సి ఉండగా ఇలా జరిగిందని వాపోయారు.

News May 24, 2024

తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

image

తిరుమలలో భక్తుల వేసవి రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం దర్శనానికి 20 గంటలు పట్టవచ్చని టీటీడీ అధికారుల అంచనా వేస్తున్నారు. గురువారం శ్రీవారిని 65,416 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకలు రూ.3.51 కోట్లు వచ్చాయి. స్వామివారికి 36,128 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి దర్శనం కోసం శిలా తోరణం వరకు క్యూలైన్ ఉంది. వేసవి రద్దీ దృష్టిలో ఉంచుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

News May 24, 2024

చిత్తూరులో వ్యక్తి మృతదేహం లభ్యం

image

చిత్తూరు నగరంలోని మిట్టూరు నాయుడు బిల్డింగ్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 1-టౌన్ సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. మృతుని ఎడమ చేతికి కుడి చేతికి పచ్చబొట్టు ఉందన్నారు. మృతుడికి సంబంధించిన ఆచూకీ తెలిసినవారు ఈ నంబర్ 9440796707 కు సమాచారం ఇవ్వాలని కోరారు.

error: Content is protected !!