India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ఓ ప్రేమ జంట పోలీసుల రక్షణ కోరింది. చిత్తూరుకు చెందిన రితిక, రామసముద్రం(M) సింగంవారిపల్లికి చెందిన పి.సాకేత్ కుమార్ ప్రేమించుకున్నారు. తిరుమలలో పెళ్లి చేసుకున్నారు. పెద్దల నుంచి ప్రాణహాని ఉందని రామసముద్రం పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ చంద్రశేఖర్ రితిక తల్లిదండ్రులకు ఫోన్ చేయగా వాళ్లు రాలేదు. చివరకు ఎస్ఐ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడారు. రితికను బాగా చూసుకోవాలని చెప్పి వాళ్లతో పంపారు.
చిత్తూరు జిల్లాలో త్రివిధ దళాలకు చెందిన 3380 మంది ఉద్యోగులు సర్వీసు ఓటర్లుగా నమోదయ్యారు. అత్యధికంగా పూతలపట్టులో 1075, అత్యల్పంగా నగరిలో 139 ఓట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం(ETPBS) ద్వారా వీరంతా ఓటు వేసేలా అవకాశం కల్పించారు. ఈక్రమంలో ఇప్పటి వరకు 800 మంది ఓటు వేశారు. కౌంటింగ్ జరిగే జూన్ 4వ తేదీ ఉదయం 7 గంటలలోగా మిగిలిన వాళ్లు ఓటు వేయవచ్చు.
చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన, ఘర్షణలకు పాల్పడుతున్నా వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు గాని, డయల్ 100/112 నెంబర్లకు గాని, పోలీస్ WhatsApp నెంబర్ 9440900005 కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ తెలిపారు.
చంద్రగిరి సమీపంలో ఇవాళ ఉదయం జరిగిన ప్రమాదంలో నలుగురు <<13322392>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. మృతులు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నరసాపురానికి చెందిన సమీ, శేషయ్య, పద్మమ్మ, జయంతిగా గుర్తించారు. తిరుమల దర్శనం అనంతరం కాణిపాకానికి బయల్దేరారు. మార్గమధ్యలో డివైడర్ను ఢీకొట్టి కారు కాలువలోకి దూసుకెళ్లడంతో నలుగురు చనిపోయారు. ఇద్దరు గాయపడగా ఆసుపత్రికి తరలించారు.
బి కొత్తకోట మండలంలో స్కూటర్ ఢీకొని రైతు దుర్మరణం చెందినట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు. అర్ధరాత్రి సమయంలో బి.కొత్తకోటలోని బెంగళూరు రోడ్డు, పెట్రోల్ బంక్ సమీపంలోని అయ్యవారి పల్లె క్రాస్ వద్ద దాస్ అలియాస్ శ్రీరాములు అనే రైతును స్కూటర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రైతు శ్రీరాములు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందినట్టు చెప్పారు. మృతదేహాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వడమాలపేట మండల పరిధిలోని పాదిరేడు బైపాస్ రోడ్డు వద్ద బైక్ ను కంటైనర్ ఢీకొనడంతో తమిళనాడుకు చెందిన ప్రజ్ఞ అనే మహిళ(35) అక్కడికక్కడే మృతి చెందింది. శనివారం తిరుమలకు వెంకటేశ్వర స్వామి దర్శనార్థం పొన్నేరికి చెందిన విజయకాంత్, ప్రజ్ఞ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి వెళ్తుండగా పాదిరేడు బైపాస్ వద్ద వెనుక వస్తున్న కంటైనర్ ఢీకొంది .మృతదేహాన్ని పుత్తూరు ఆసుపత్రికి తరలించారు.
గుడిపాల మండలం చిత్తపార గ్రామానికి చెందిన నందిని (18) వ్యవసాయ పొలం వద్దకు వచ్చిందని అకారణంగా ఆమె అన్న కొడుకు విజ్జి విచక్షణ రహితంగా దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. నందినికి తండ్రి లేడని, తల్లికి మతిస్థిమితం లేని కారణంగా గ్రామస్థులే యువతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పైన గుడిపాల పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సహకార వ్యవసాయ పరపతి సంఘాల ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. ఉద్యోగ విరమణ వయస్సు 62 సంవత్సరాలు చేయాలన్న హైకోర్టు తీర్పుతో జిల్లాలోని 76 సహకార సంఘాల్లో పని చేస్తున్న 200 మంది ఉద్యోగులకు మేలు చేకూరనుంది. వైసీపీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచింది. దీన్ని సహకార సంస్థలకు వర్తింపజేయలేదు. ఈ మేరకు సహకార ఉద్యోగులకు కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది.
రేణిగుంట-కడప జాతీయ రహదారిలోని చెంగారెడ్డిపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉన్నట్లు గుర్తించారు. మృతుడు రైలు నుంచి జారి పడిపోయాడా లేదా ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్నది విచారణలో తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
భూవివాదం నేపథ్యంలో మాజీ జడ్జితో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు బి.కొత్తకోట సీఐ సూర్యనారాయణ తెలిపారు. మదనపల్లె రోడ్డులోని కొంత భూమి విషయంలో పట్టణానికి చెందిన మాజీ జడ్జి రామకృష్ణకు ఆయన సోదరుల మధ్య వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో రామచంద్ర, శంకరప్పలపై గత ఆదివారం రామకృష్ణ, అతని అనుచరులు దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో మాజీ జడ్జితో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Sorry, no posts matched your criteria.