India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పూతలపట్టు మండలం మూర్తిగారి ఊరు దుర్గం గుట్టపైన చెట్టుకు ఉరి చేసుకొని వడివేలు (60) అనే వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం మేకలు మేపేవారు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. నెల రోజుల క్రితం మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మదనపల్లిలోని రామారావు కాలనీకి చెందిన పుంగనూరు శేషు దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి స్థానిక వైఎస్ఆర్ కాలనీలో శేషును ప్రత్యర్థులు పథకం ప్రకారం హత్యచేసినట్లు ప్రాథమిక సమాచారం. యువకుడి హత్య జరిగిన విషయాన్ని తెలుసుకున్న మదనపల్లి రెండో పట్టణ పోలీసులు ఘటనాస్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పద్మావతిపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 27న క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీ ప్రకటించారు. ఐటీఐ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) ట్రేడ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చంద్రగిరి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. పనపాకం గ్రామం వద్ద గుర్తు తెలియని ఓ వృద్దుడు హత్యకు గురైనట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. రెండు రోజుల క్రితం ఘటన జరిగినట్లు నిర్థారించారు. ఎవరో తలపై దాడి చేసి హత్య చేశారని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు.
పుంగనూరుకు చెందిన పగడాల రవి, భవాని దంపతుల కుమారుడు పగడాల హర్షల్ మూడు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని తల్లిదండ్రులు మానవత్వంతో అవయవాల దానానికి అంగీకరించారు. ఎంబీఏ పూర్తి చేసుకున్న మృతుడు.. రెండు రోజుల్లో స్వస్థలానికి రావాల్సి ఉండగా ఇలా జరిగిందని వాపోయారు.
తిరుమలలో భక్తుల వేసవి రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం దర్శనానికి 20 గంటలు పట్టవచ్చని టీటీడీ అధికారుల అంచనా వేస్తున్నారు. గురువారం శ్రీవారిని 65,416 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకలు రూ.3.51 కోట్లు వచ్చాయి. స్వామివారికి 36,128 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి దర్శనం కోసం శిలా తోరణం వరకు క్యూలైన్ ఉంది. వేసవి రద్దీ దృష్టిలో ఉంచుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
చిత్తూరు నగరంలోని మిట్టూరు నాయుడు బిల్డింగ్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 1-టౌన్ సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. మృతుని ఎడమ చేతికి కుడి చేతికి పచ్చబొట్టు ఉందన్నారు. మృతుడికి సంబంధించిన ఆచూకీ తెలిసినవారు ఈ నంబర్ 9440796707 కు సమాచారం ఇవ్వాలని కోరారు.
శ్రీవారి దర్శన టికెట్లు ఇప్పిస్తామని చెప్పి నగదు తీసుకుని భక్తులను మోసగించిన ముగ్గురు దళారులపై కేసు నమోదు చేసినట్లు తిరుమల టూటౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తుడి నుంచి రూ.20 వేలు తీసుకుని మోసం చేయగా బాధితుడు తిరుమల విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. ఘటనపై తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేసి నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
టెన్త్, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 3వ తేదీ వరకు జరిగే టెన్త్ పరీక్షలు 2,006 మంది విద్యార్థులు రాసేందుకు వీలుగా 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 1వ తేదీ వరకు వరకు నిర్వహిస్తారు. 10,019 మంది విద్యార్థులు రాసేందుకు గాను 31 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.
మదనపల్లె కూటమి MLA అభ్యర్థి షాజహాన్పై TDP అధిష్టానానికి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో షాజహాన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని,తమపై ఇష్టానుసారంగా దూషించారని రామసముద్రం మండలం కురిజల పంచాయితీలోని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజుకు ఫిర్యాదు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.