India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా అంతటా అవగాహన సదస్సులు నిర్వహించాలని ఎస్పీ మణికంఠ సూచించారు. పోలీసు అధికారులతో మంగళవారం ట్రైనింగ్ సెంటర్లో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ క్రైమ్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అవగాహన కల్పించాలన్నారు. అక్రమ రవాణా నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.

శ్రీకాళహస్తి: తొండమనాడు మార్గం అమ్మపాళెం సమీపంలో ఓ మహిళ మెడలోని తాళిబొట్టు లాక్కుని ఇద్దరు దుండగులు పరారైన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. అమ్మపాళెం గ్రామానికి చెందిన ఓ మహిళ వాకింగ్ చేస్తూ వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు బైక్పై వచ్చి మహిళ మెడలోని తాళిబొట్టు లాక్కొని పరారయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని TTD ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతి పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వ అటవీ,TTDఅటవీ,ఇంజనీరింగ్,భద్రత విభాగాలతో ఈవో సమీక్షించారు. ప్రస్తుతం ఉన్న ట్రాప్ కెమెరాలే కాకుండా చిరుతలు, ఇతర జంతువుల సంచారం తెలుసుకొనేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.

తిరుపతి జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎస్.వెంకటేశ్వర్ నియామకమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. సెకండరీ హెల్త్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన తిరుపతి కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

చిత్తూరు డెవలప్మెంట్ అథారిటీ (చూడ) ఛైర్మన్ పదవికి వైసీపీ నేత పురుషోత్తం రెడ్డి రాజీనామా చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నామినేటెడ్ పోస్టుల పదవికి రాజీనామాల పర్వం మొదలైంది. ఈ నేపథ్యంలో చూడ ఛైర్మన్ పదవికి పురుషోత్తం రెడ్డి ఇచ్చిన రాజీనామా లేఖను మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి ఆమోదించారు.

ఏపీ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని మంగళవారం ఎంపీ కలిశారు. రాష్ట్రంలోని సమస్యలను కేంద్ర మంత్రికి వివరించారు. అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పరిశ్రమల స్థాపన, ఆత్మనిర్భర్ పథకాల అమలుకు సహకారం అందించాలని కోరారు.

ఇండియన్ వుమెన్ క్రికెటర్ స్మృతి శ్రీనివాస్ మంధాన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేదాశీర్వచనంతో తీర్థప్రసాదాలు అందజేశారు.

పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించిన ఘటన పుంగనూరులో జరిగింది. మున్సిపల్ కమిషనర్ లక్ష్మీనరసింహ ప్రసాద్ వివరాల మేరకు.. పట్టణంలోని 6వ వార్డు సెంటర్ లాడ్జి ప్రాంతంలో నిన్న పింఛన్ల పంపిణీ జరిగింది. మహేశ్ అనే సచివాలయ ఉద్యోగి రూ.2.50 లక్షలు కాజేశాడు. తోటి ఉద్యోగులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహేశ్ బంధువులు నగదు తిరిగి ఇచ్చేశారు.
NOTE: ఫొటోలో ఉన్నది కమిషనర్.

నెల్లూరు సెంట్రల్ జైలులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి ములాఖత్ అయ్యారు. కేసు వివరాలను తెలుసుకున్నారు. మాజీ మంత్రులు మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 8.30 గంటల వరకు జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో తిరుపతి జిల్లా 7, చిత్తూరు జిల్లాకు 22వ స్థానం దక్కిందని కలెక్టరేట్ అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 93.75 శాతం పెన్షన్లు పంపిణీ చేయగా, తిరుపతి జిల్లాలో 95.75 శాతం పెన్షన్లు పంపిణీ చేసి ఏడవ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టరేట్ అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.