Chittoor

News May 17, 2024

తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌పై బదిలీ వేటు

image

ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసపై సీఈసీ సీరియస్‌ అయ్యింది. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌పై బదిలీ వేటువేసింది. డీఎస్పీతో పాటు తిరుపతిలోని పలువురు సబార్డినేట్ అధికారులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసి 2 రోజుల్లో నివేదికలు ఇవ్వాలని తెలిపింది. ఫలితాల వేళ కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

News May 16, 2024

తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌పై బదిలీ వేటు

image

ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసపై సీఈసీ సీరియస్‌ అయ్యింది. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌పై బదిలీ వేటువేసింది. డీఎస్పీతో పాటు తిరుపతిలోని పలువురు సబార్డినేట్ అధికారులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసి 2 రోజుల్లో నివేదికలు ఇవ్వాలని తెలిపింది. ఫలితాల వేళ కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

News May 16, 2024

చిత్తూరు: చెరువులో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

image

వడమాలపేట మండలం గూళూరు చెరువులో ప్రమాదవశాత్తు నీట మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్లు గురువారం మృతి చెందారు. మృతులు ముగ్గురూ ఎస్‌బిఆర్‌ పురం గ్రామానికి చెందిన బాబు, విజయ దంపతుల కుమార్తెలు కావడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. గూళూరు చెరువులో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకోవడానికి దిగారు. ప్రమాదావశాత్తు ఒక్కరు నీటిలో పడిపోయారు. వీరిని కాపాడే ప్రయత్నంలో మిగిలిన ఇద్దరు పడి మృత్యువాత పడ్డారు.

News May 16, 2024

తిరుపతి: ఆన్‌లైన్‌లో టెన్త్ హాల్ టికెట్లు

image

పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈపరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని డీఈఓ డాక్టర్ వి.శేఖర్ తెలిపారు. హాల్ టికెట్లను సంబంధిత పాఠశాలలో కానీ www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా జిల్లా, పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీని నమోదు చేసి హాల్ టికెట్లను పొందవచ్చని డీఈఓ చెప్పారు.

News May 16, 2024

TPT: లక్ష మందికిపైగా ఓటింగ్‌కు దూరం

image

రాష్ట్రంలోనే అత్యల్పంగా తిరుపతిలో పోలింగ్ జరిగింది. 2019లో 65.93 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈసారి 2.61 శాతం తగ్గడంతో పోలింగ్ పర్సంటేజీ 63.32కి పరిమితమైంది. తిరుపతి నియోజకవర్గంలో మొత్తం 3,02,503 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,91,557 మంది మాత్రమే ఓటు వేశారు. 1,10,946 మంది ఓటింగ్ దూరంగా ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. రాజ్యంగం కల్పించిన హక్కును వినియోగించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

News May 16, 2024

చిత్తూరు జిల్లాలో 144 సెక్షన్

image

చిత్తూరు జిల్లా అంతటా 144 సెక్షన్ అమలు చేస్తునట్లు జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్ షన్మోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 14వ తేది సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఒకే చోట ఎక్కువ మంది గుమికూడటం, డ్రోన్లు ఎగరవేయడం, సమావేశాల నిర్వహణ నిషేధమని తెలిపారు. మరోవైపు తిరుపతి జిల్లాలోనూ 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు.

News May 16, 2024

TPT:21న సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ పోస్ట్ కు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ (IISER) తిరుపతి నందు ఈనెల 21వ తేదీన సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ పోస్ట్ కు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. మాస్టర్స్ డిగ్రీ నేచురల్/ అగ్రికల్చరల్ సైన్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/ వెబ్ సైట్ చూడగలరు.

News May 15, 2024

విజయపురం: శతాధిక వృద్ధురాలు మృతి

image

విజయపురం మండల కేంద్రంలో శతాధిక వృద్ధురాలు ఆర్. వెంకటమ్మ (111) బుధవారం మృతి చెందారు. ఈమె మృతి చెందే వరకు తన పనులు తానే చేసుకుంటూ ఆరోగ్యంతో జీవనం ముందుకు సాగించారు. శతాధిక వృద్ధురాలి కుమార్తె వయస్సు 85 సంవత్సరాలు కావడం విశేషం. ఈమె 2024 సంవత్సరం సార్వత్రిక సాధారణ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోంచుకుంది.

News May 15, 2024

చిత్తూరు: స్ట్రాంగ్ రూమ్‌లు పరిశీలించిన ఎస్పీ

image

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను ఎస్పీ మణికంఠ బుధవారం పరిశీలించారు. నిరంతరాయంగా కేంద్ర, పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. కళాశాల పరిసరాలు, పార్కింగ్ ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రశాంతంగా ఎన్నికలు ముగిసేలా సహకరించిన ప్రజలకు, అధికార యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు వెల్లడించారు.

News May 15, 2024

TPT : ఇన్ స్టంట్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఐదవ సెమిస్టర్ ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఇన్ స్టంట్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణాధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. విద్యార్థులు ఈనెల 21వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. పూర్తి వివరాలకు www.svuniversity.edu.in వెబ్ సైట్ చూడాలని సూచించారు.

error: Content is protected !!