Chittoor

News May 12, 2024

తిరుపతిలో రాజకీయం వర్సెస్ జర్నలిజం

image

ఎన్నికలు చివరి దశకు చేరుకున్న తరుణంలో తిరుపతి రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ఎన్నికల ప్రచారం చివరి రోజు టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తిరుపతికి చెందిన ఓ పత్రిక విలేకరులపై చేసిన వ్యాఖ్యలు జర్నలిస్టుల నుంచి తీవ్ర వ్యతిరేకతకు దారి తీశాయి. రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలను అన్ని జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. మరో వైపు తిరుపతి జర్నలిస్టులు ఎస్పీకి, కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

News May 12, 2024

చిత్తూరు: 3000 మంది సిబ్బందితో భారీ బందోబస్తు

image

చిత్తూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 3000 పోలీస్ సిబ్బందితో ఎన్నికల నిర్వహణకు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న గ్రామ, పట్టణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగంచుకునే విధంగా అన్ని రకాల భద్రత ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. NCC, NSS, పదవి వివరణ చేసిన పోలీసులు, మాజీ సైనికులతో బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు.

News May 12, 2024

చిత్తూరు: ఏనుగు దాడిలో ఒకరు మృతి

image

జిల్లాలోని తవణంపల్లె మండలం వెంగంపల్లె ST కాలనీలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన పి.చిన్నయ్య(50) ఆదివారం ఉదయం కాలనీకి సమీపంలోని మామిడి తోటలో బహిర్భూమికి వెళ్లాడు. ఏనుగును చూసిన కుక్కలు మొరిగాయి. దీంతో చిన్నయ్య అటుగా వెళ్లగా.. ఆయనను ఏనుగు వెంబడించి చంపేసింది. స్థానికులు స్థానిక అటవీ శాఖ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News May 12, 2024

మంగళగిరిలో బాబు.. పుంగనూరులో పెద్దిరెడ్డి

image

ఈసారి ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు వాళ్లకి వాళ్లే ఓటు వేసుకునే అవకాశం లేదు. కుప్పంలో పోటీ చేస్తున్న చంద్రబాబు మంగళగిరిలో ఓటు వేస్తారు. వైసీపీ తంబళ్లపల్లె అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి పుంగనూరు నియోజకవర్గంలోని తన స్వగ్రామం ఎర్రాతివారిపాలెంలో, నగరి అభ్యర్థి భానుప్రకాశ్ రామచంద్రాపురం మండలంలో, పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎస్ బాబు చిత్తూరు మండలం వెంకటాపురం హరిజనవాడలో ఓటు వేస్తారు.

News May 12, 2024

పెద్దిరెడ్డి తోక కత్తిరిస్తా: చంద్రబాబు

image

చిత్తూరు జిల్లాను పాపాల పెద్దిరెడ్డి కుటుంబం లూటీ చేసిందని TDP అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ‘పెద్దిరెడ్డి మంత్రి, ఆయన కొడుకు MP, తమ్ముడు MLA. అన్ని కాంట్రాక్టులు, రాజకీయ పదవులన్నీ పెద్దిరెడ్డి కుటుంబానివే. ఈ రాష్ట్రం ఏమైనా వాళ్లబ్బ సొత్తా? ఇంకెవరూ అవసరం లేదా? మేము అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డి ఫ్యామిలీ తిన్నదంతా కక్కిస్తా. పెద్దిరెడ్డి తోక కత్తిరిస్తా’ అని చిత్తూరు సభలో చంద్రబాబు అన్నారు.

News May 12, 2024

తిరుపతి: రాజకీయ పార్టీలు సహకరించాలి

image

ఓటర్లు ప్రశాంతంగా స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నడుచుకోవాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ కోరారు. శనివారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో, అభ్యర్థులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పోలింగ్ కు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సహకరించాలని కోరారు.

News May 11, 2024

మదనపల్లె: బస్సు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

image

మదనపల్లె పట్టణం వారపు సంతలో బస్సు ఢీకొని గుత్తిని వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 45 ఏళ్లు ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. సమాచారాన్ని తెలుసుకున్న రెండో పట్టణ ఎస్సై వెంకటసుబ్బయ్య మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు.

News May 11, 2024

మదనపల్లె టమోటా మార్కెట్‌కు రెండు రోజులు సెలవు

image

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మదనపల్లె టమోటా మార్కెట్‌కు ఆర్‌ఓ హరిప్రసాద్ 2రోజులు సెలవు ప్రకటించారు. మదనపల్లెలో ఎన్నికలు 13న జరగనున్న నేపథ్యంలో ఐదు పోలింగ్ కేంద్రాలు నీరుగట్టువారిపల్లెలో ఉన్నాయి. దీంతో మదనపల్లె టమోటా మార్కెట్ యాడ్‌ను ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం సాయంత్రం 7గంటల వరకు ఎలక్షన్ ఆఫీసర్ల అధీనంలో ఉంటుంది. ఆది, సోమవారాలు టమోటా రైతులు మార్కెట్‌కు టమోటాలు తీసుకురావద్దని కోరారు.

News May 11, 2024

చిత్తూరులో బార్లు, వైన్ షాపులు బంద్

image

చిత్తూరులోని ప్రైవేటు బార్ అండ్ రెస్టారెంట్లు, ప్రభుత్వం వైన్ షాపులకు ఎక్సైజ్ అధికారులు శనివారం సాయంత్రం మూడు గంటల నుంచి సీల్ వేయడం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు ఓపెన్ చేయరాదని నిర్వాహకులకు సూచనలు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News May 11, 2024

తిరుపతిలో సాయంత్రం 6 గంటల నుంచి 141 సెక్షన్

image

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, SP కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో 100% వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను నిర్వహిస్తామన్నారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 141 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. సుమారు 5వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

error: Content is protected !!