Chittoor

News May 15, 2024

చిత్తూరు సమీపంలో లారీ కిందపడి ఇద్దరు స్పాడ్ డెడ్ 

image

ప్రమాదవశాత్తు లారీ కింద పడి ఇద్దరు మృతి చెందిన ఘటన చిత్తూరు సమీపంలో జరిగింది. ఎన్‌ఆర్ పేట ఎస్‌ఐ వెంకట సబ్బమ్మ కథనం ప్రకారం.. జీడీ నెల్లూరు ఆవుల కొండకు చెందిన హజరత్ ఆలీ(20), ఘజియాబాషా (19) అనే ఇద్దరు బైక్‌పై తాళంబేడు వైపు వెళ్తున్నారు. ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయబోయి ప్రమాదవశాత్తు లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు.

News May 15, 2024

ఆసుపత్రి నుంచి పులివర్తి నాని డిశ్చార్జ్

image

నిన్న జరిగిన హత్యాయత్నంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం చంద్రగిరిలో ఉన్న గన్‌మెన్ ధరణి ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గన్‌మెన్, ప్రైవేట్ సెక్యూరిటీ లేకుంటే తన ప్రాణాలు పోయేవన్నారు . ఓటమి భయంతో వైసీపీ మూకలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.

News May 15, 2024

టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తుల

image

తిరుప‌తిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌లో 2024 – 25 విద్యా సంవత్సరానికి ప్ర‌వేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి మే 15 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ విద్యాశాఖాధికారి డా. భాస్కర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు admission.tirumala.org వెబ్ సైట్ ద్వారా గడువుకు ముందే సరైన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు.

News May 15, 2024

TPT: పోలీసుల పని తీరుపై విమర్శలు

image

తిరుపతి పద్మావతి వర్శిటీ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఘర్షణలను అదుపు చేయటంలో పోలీసులు సకాలంలో స్పందించలేదని విమర్శలున్నాయి. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు తిష్ఠవేసిన స్ట్రాంగ్ రూముకు కిమీ దూరంలో మధ్యాహ్నం 4.30 గంటలకు ఘర్షణ ప్రారంభమైంది. సాయంత్రం 6.30 గంటల వరకు అదే పరిస్థితి కొనసాగింది. అదనపు బలగాలు వచ్చాక పరిస్థితి అదుపులోకి వచ్చింది.

News May 14, 2024

ఓటు వేయని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి

image

జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆరణి శ్రీనివాసులు సొంత ఊరు చిత్తూరు. గత ఎన్నికల్లో ఆయన అక్కడే ఓటు వేశారు. జనసేనలో చేరిన తర్వాత ఆయన తన ఓటును తిరుపతికి ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్నారు. చివరి నిమిషంలో ఓటు బదిలీ కాలేదు. చిత్తూరులోనే ఆయన ఓటు ఉండిపోయింది. ఈక్రమంలో ఆయన నిన్న తనకు తానే ఓటు వేసుకోలేకపోయారు. అలాగే తిరుపతిలో పోలింగ్ సరళిని పరిశీలిస్తూ చిత్తూరుకు కూడా వెళ్లి ఓటు వేయలేదు.

News May 14, 2024

తిరుపతి: ఓటేసి వెళ్తుండగా మృతి

image

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గాదంకి టోల్ ప్లాజా సమీపంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు <<13243541>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. మృతుడు అమాసవారిపల్లికి చెందిన ఎ.గురుస్వామి(65)గా గుర్తించారు. ఆయన ఓటు వేయడానికి వెళ్లగా చీకటి పడింది. ఓటు వేసి తిరిగి ఇంటికి నడిచి వస్తుండగా.. రోడ్డు పక్కన గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఆయన అక్కడికక్కడే చనిపోయాడు.

News May 14, 2024

చిత్తూరు: లండన్ నుంచి వచ్చి ఓటు హక్కు వేసిన ఉద్యోగి

image

ఎస్ఆర్ పురం మండల కేంద్రానికి చెందిన పురుషోత్తం లండన్‌లో ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడ్డారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఎస్ఆర్ పురానికి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఒక భారతీయ పౌరుడిగా తన ఓటు హక్కు ఉపయోగించుకోవడం గర్వకారణంగా ఉందని అన్నారు. తాను ఓటు వేయడానికి సుమారు లక్ష రూపాయలు వరకు ఖర్చు చేసుకొని వచ్చానని తెలిపారు.

News May 13, 2024

చిత్తూరు: లండన్ నుంచి వచ్చి ఓటు హక్కు వేసిన ఉద్యోగి

image

ఎస్ఆర్ పురం మండల కేంద్రానికి చెందిన పురుషోత్తం లండన్‌లో ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడ్డారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఎస్ఆర్ పురానికి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఒక భారతీయ పౌరుడిగా తన ఓటు హక్కు ఉపయోగించుకోవడం గర్వకారణంగా ఉందని అన్నారు. తాను ఓటు వేయడానికి సుమారు లక్ష రూపాయలు వరకు ఖర్చు చేసుకొని వచ్చానని తెలిపారు.

News May 13, 2024

GREAT: ఒకే ఇంట్లో 30 మంది ఓటింగ్

image

ఎన్నికల వేళ చిత్తూరు జిల్లాలో అరుదైన ఘటన జరిగింది. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం రాగిమాను పెంటకు చెందిన వైస్ ఎంపీపీ-2 తోట జయకుమార్ కుటుంబం చాలా పెద్దది. వారింట్లోనే 30 మంది ఓటు వేయడం విశేషం. మండలంలోని తమ కుటుంబానికి చెందిన 30 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు.

News May 13, 2024

చిత్తూరు: ఓటు వేసిన వందేళ్ల బామ్మ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో భారీగా ఓట్లు పోలయ్యాయి. చౌడేపల్లె మండలం గాండ్లపల్లెకు చెందిన శాంతమ్మ(100) బైకుపై వచ్చి ఓటు వేశారు. ఆ వయసులోనూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడంపై పలువురు అభినందలు తెలిపారు. మరోవైపు కుప్పంలో చంటిబిడ్డల తల్లులు సైతం ఓటు వేయడం విశేషం.