India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుపతి శ్రీవేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి శాస్త్రి, ఆచార్య, డిప్లొమా, సర్టిఫికెట్ మొదలైన 21 విభాగాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు రిజిస్ట్రార్ రాఘవేంద్ర త్రిపాఠి పేర్కొన్నారు. అర్హత, ఇతర వివరాలకు svvedicuniversity.ac.in వెబ్సైట్ చూడాలని సూచించారు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 30.

ఈ నెల 25, 26 తేదీల్లో సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ షన్మోహన్ పరిశీలించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసీ శ్రీనివాసులు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.

నీట్ పరీక్ష ఫలితాల అవకతవకలపై విచారణ జరిపించాలని వైఎస్ షర్మిల విజయవాడ లెనిన్ సెంటర్లో శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పీలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి నల్ల దుస్తులు ధరించి పాల్గొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో పేపర్ లీక్ అయిందన్నారు. ప్రశ్నపత్రం లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు.

జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో ప్రాక్ శాస్త్రి (Praak Shastri) కోర్సులో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ కోర్సుకు ఎంపికైన వారి జాబితాను శుక్రవారం విడుదల చేసినట్లు అకడమిక్ డీన్ ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://nsktu.ac.in/ వెబ్ సైట్ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాను తెలుసుకోవచ్చని సూచించారు.

చిత్తూరు: ఇరువరంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) నందు APSSDC, PMKV సంయుక్త ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎలక్ట్రిషన్, అసిస్టెంట్ ప్లంబర్ కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు సెంటర్ ఏడీ సతీశ్ చంద్ర పేర్కొన్నారు. పదో తరగతి పాసై, 15-45 సంవత్సరంలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు PH కాలనీ వద్ద గల NAC కార్యాలయంలో సంప్రదించగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 28.

తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ (SPMVV)లో ఈ ఏడాది ఫిబ్రవరిలో M.Tech మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలైనట్టు మహిళా యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారిణి పేర్కొన్నారు. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రమోషన్పై మైనింగ్ శాఖ కమిషనర్గా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా జేసీ ధ్యానచంద్రను నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసే శాలువాతో సత్కరించారు.

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం అమరావతిలో కలిశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమయ్యారు. అసెంబ్లీ, శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పెద్దిరెడ్డితో పాటు ఇతరులకు జగన్ దిశానిర్దేశం చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను జూన్ 24న ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్వెల్, ఫాస్ట్ట్రాక్, తదితర కంపెనీల వాచీలున్నాయి. ఆదేవిధంగా వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో, తదితర కంపెనీల మొబైల్ ఫోన్లు ఉన్నాయి.

పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా.. అందుకు భిన్నంగా పెద్దిరెడ్డి ఇంగ్లిషులో ప్రమాణం చేశారు. అనంతరం ఆయన ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అభివాదం చేశారు.
Sorry, no posts matched your criteria.