India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బీసీ నేత, రాజ్యసభ MP ఆర్.కృష్ణయ్యపై రాయితో దాడి చేశారు. శ్రీకాళహస్తి MLA మధుసూదన్ రెడ్డి, కృష్ణయ్య నిన్న రాత్రి ఏర్పేడులో రోడ్ షో నిర్వహించారు. ఈక్రమంలో ఎవరో విసిరిన రాయి ఎంపీ వీపునకు తగిలింది. అప్రమత్తమైన వైసీపీ కార్యకర్తలు ఎస్ఐ జిలానీకి ఫిర్యాదు చేశారు. తనపై బీసీలు దాడి చేయరని.. ఇది టీడీపీ కుట్రేనని ఎంపీ ఆరోపించారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఇలా చేస్తున్నారని ఆయన విమర్శించారు.
తిరుపతి: పోలింగ్ రోజున ఉదయం 5 గంటలకే అభ్యర్థులు, ఏజెంట్లు పోలింగ్ కేంద్రానికి రావాలని 167 – తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ఏజెంట్ అదే పోలింగ్ స్టేషన్ లేదా పక్కన ఉన్న పోలింగ్ స్టేషన్లో ఓటర్ అయి ఉండాలని తెలిపారు. పోలింగ్ ఏజెంట్ తప్పనిసరిగా ఎపిక్ కార్డ్ / ఎన్నికల కమిషన్ సూచించిన ఏదైనా ఇతర ప్రత్యామ్నాయ పత్రాన్ని కలిగి ఉండాలని తెలిపారు.
కురబలకోట మండలం ముదివేడు క్రాస్ వద్ద గురువారం రాత్రి టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ముదివేడు ఎస్ఐ మల్లికార్జున రెడ్డి కథనం.. ముదివేడు గ్రామం, సాయిబులపల్లెకు చెందిన మహబూబ్ బాషా(35), సొంత పనిపై ముదివేడు క్రాస్ రోడ్డు వద్దకు వెళ్లగా టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ బాధితుణ్ని మదనపల్లెకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్ఐ తెలిపారు.
తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు తిరుపతి ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీలక్ష్మీ వెల్లడించారు. పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అర్హులన్నారు. iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 10.
చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్లో ట్రైనీ ఐపీఎస్లకు ఎస్పీ మణికంఠ, ప్రొబెషనరీ డీఎస్పీ పావన్ కుమార్ ఎన్నికల విధులపై గురువారం అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ గురించి వివరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పారు. వాహనాల తనిఖీ, నగదు రవాణా అరికట్టడం, పోలింగ్ స్టేషన్ల నిర్వహణ అంశాలను వివరించారు.
తిరుపతి ఎంపీ ఉపఎన్నికలో భారీగా దొంగ ఓట్లు వేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయా సంఘటనలపై ఈసీ కఠిన చర్యలు తీసుకుని పలువురు ఉద్యోగులపై వేటు వేసింది. దీంతో తాజా ఎన్నికలపై తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిణి అదితిసింగ్ కీలక ప్రకటన చేశారు. ప్రజలంతా నిర్భయంగా ఓటు వేయాలని కోరారు. పోలింగ్ స్టేషన్ వద్ద ఫేక్ ఓటరని గుర్తిస్తే.. సంబంధిత వ్యక్తిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని ఇంటర్ విద్యామండలి శుక్రవారం వరకు పొడిగించింది. ఈ మేరకు మండలి తిరుపతి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ నెలలో జరగనున్న సప్లిమెంటరీ పరీక్షలకు తత్కాల్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు బుధవారంతో గడువు ముగియగా, రెండు రోజులు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు.
ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో నాయకులు ఓటర్లను జోరుగా ప్రభావితం చేస్తున్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో ఉన్న ఓటర్లను రప్పించడానికి వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు నిన్న కలికిరిలో మోదీ సభ జరగడంతో పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన పలు పార్టీలు జోరుగా నగదు పంపిణీ చేశాయని సమాచారం. మీ ఏరియాలో ఓటుకు డబ్బు ఇచ్చారో లేదో కామెంట్ చేయండి.
సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో ఈనెల 13న తిరుపతి స్విమ్స్లో ఓపీ, ఓటీలకు సెలవు ప్రకటించారు. వైద్యులు, సిబ్బంది, రోగులు ఓటుహక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సెలవు ఇచ్చారు. ఆరోజు అత్యవసర సేవలు యథాతథంగా కొనసాగుతాయని సంచాలకులు డా.ఆర్వీ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
కేవలం రూ.30 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న శివశక్తి డెయిరీపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేయడం తగదని మంత్రి పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి అన్నారు. పుంగనూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పుంగనూరులో హెరిటేజ్తో పాటు అన్ని కంపెనీల డెయిరీలు పాలు సేకరిస్తున్నాయి. పాడి, మామిడి రైతులకు మా నుంచి ఇబ్బందులు ఎదురై ఉంటే ఎన్నికల్లో మాకు ఓట్లు వేయకండి’ అని మిథున్ రెడ్డి సూచించారు.
Sorry, no posts matched your criteria.