Chittoor

News June 19, 2024

పూతలపట్టు మాజీ MLA రాజీనామాకు ఆమోదం

image

వైసీపీ ప్రభుత్వంలో పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి(PCB) సభ్యుడిగా వ్యహరించారు. ఈ ఎన్నికల్లో ఆయన పూతలపట్టు అభ్యర్థిగా బరిలో దిగి టీడీపీ అభ్యర్థి మురళి మోహన్ చేతిలో ఓడిపోయారు. అలాగే రాష్ట్రంలోనూ వైసీపీ అధికారం కోల్పోవడంతో సునీల్ కుమార్ తన PCB సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

News June 18, 2024

తిరుమల : పుకార్లను నమ్మవద్దు.. టీటీడీ విజ్ఞప్తి

image

వయోవృద్ధుల దర్శనార్థం వారి టికెట్లకు సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది పూర్తిగా అబద్దమని, ఇటువంటి ఫేక్ న్యూస్ భక్తులు నమ్మొద్దని TTDవిజ్ఞప్తి చేసింది. ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం TTD ప్రతినెల 23న 3నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోందన్నారు. www.tirumala.org, https://ttdevastanams.ap.inను మాత్రమే సంప్రదించగలరన్నారు.

News June 18, 2024

నగరి: శాలువాలు, పూలబొకేలు తీసుకురావద్దు: గాలి భానుప్రకాశ్

image

తనని కలవడానికి వచ్చేవారు శాలువాలు, పూలబొకేలు తీసుకురావద్దని నగరి  ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ విజ్ఞప్తి చేశారు. అభిమానం కోసం, శుభాకాంక్షలు తెలపడానికి ఏదైనా తీసుకురావాలంటే విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, పెన్నులు, స్టడీ మెటీరియల్ లాంటివి తీసుకు రావాలని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, నాయకులు దీనిని విన్నపంగా భావించాలని తెలిపారు.

News June 18, 2024

అమ్మవారి సేవలో సినీ దర్శకుడు త్రివిక్రమ్

image

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని మంగళవారం మాటల మాంత్రికుడు, ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద ఫోర్ట్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

News June 18, 2024

BNకండ్రిగ: గుండెపోటుతో టీచర్ మృతి

image

తిరుపతి జిల్లా BNకండ్రిగ మండలం సుగుపల్లి గ్రామానికి చెందిన తొడకాటి పురుషోత్తం గుండెపోటుతో చనిపోయారు. ఆయనకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. గణిత టీచర్‌గా ఎంతోమంది పిల్లలకు చదువు చెప్పారు. యోగా గురువు పోచినేని సురేష్ నాయుడు టీచర్ మృతిపై సంతాపం తెలిపారు.

News June 18, 2024

చిత్తూరు జిల్లాలో 64 శాతం మంది పాస్

image

ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లమెంటరీ ఫలితాల్లో చిత్తూరు జిల్లా విద్యార్థులు పర్వాలేదనిపించారు. జిల్లాలో 4,742 మంది పరీక్షలు రాయగా 3,043 మంది పాసయ్యారు. 64 శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. తిరుపతి జిల్లా 6,023 మందికి 3,602 మందే పాస్(60%) అవడంతో 13వ స్థానాన్ని పొందింది. ఒకేషన్లో చిత్తూరు విద్యార్థులు 750 మందికి 380 మంది.. తిరుపతి జిల్లా విద్యార్థులు 380 మందికి 235 మంది పాసయ్యారు.

News June 18, 2024

మదనపల్లెలో KG టమాటా రూ.80

image

ఆసియాలోనే మదనపల్లె టమాటా మార్కెట్ అతిపెద్దది. దేశంలో ఎక్కడ ధరలు పెరిగినా ఇక్కడి రేటు ఎంతో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతుంటారు. కాగా మంగళవారం ఇక్కడ కిలో టమాటా రూ.80 పలికిందని మార్కెట్ అధికారులు వెల్లడించారు. గత శుక్రవారం ఇక్కడ రూ.50 ఉండగా నాలుగు రోజులకే ధర బాగా పెరిగింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News June 18, 2024

నా సెలవు పొడిగించండి: ధర్మారెడ్డి

image

ఎన్నికల ఫలితాలు విడుదలైన 2 రోజుల తర్వాత తనకు సెలవు కావాలని టీటీడీ పూర్వ ఈవో ధర్మారెడ్డి కోరారు. అదే సమయంలో తిరుమలకు చంద్రబాబు రావడంతో ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవు మంజూరు చేశారు. ఈక్రమంలోనే ధర్మారెడ్డిని ఈవోగా తప్పించి శ్యామలరావును నియమించారు. ఇది ఇలా ఉండగా ఈనెలాఖరు వరకు తన సెలవు పొడిగించాలని ధర్మారెడ్డి సీఎస్‌ నీరబ్ కుమార్ ప్రసాద్‌కు మరో లేఖ రాశారు. ఈనెల 30న ఆయన రిటైర్ కానున్నారు.

News June 18, 2024

23న కుప్పానికి చంద్రబాబు రాక..?

image

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి చిత్తూరు జిల్లా కుప్పానికి చంద్రబాబు రానున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న ఆయన కుప్పంలో పర్యటిస్తారని టీడీపీ నేతలకు సమాచారం అందింది. రెండు రోజులు పాటు కుప్పంలోనే సీఎం ఉంటారని సమాచారం. ఈ మేరకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా చంద్రబాబు పర్యటన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

News June 18, 2024

చిత్తూరు: ఉద్యోగం పేరుతో చీటింగ్

image

ఉద్యోగం పేరుతో మోసం చేసిన ముగ్గురిపై చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు నగరం సంతపేటకు చెందిన వైష్ణవి(24) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. మురకంబట్టుకు చెందిన రాజేశ్, విజయ్ కుమార్‌తో పాటు మరో వ్యక్తి కలిసి ఉద్యోగం తీసిస్తామని చెప్పి ఆమె వద్ద రూ.2.90 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం తీసి ఇవ్వకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.