Chittoor

News May 2, 2024

TPT: ఆన్ లైన్ లో ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్

image

ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి సేవలు ఆన్ లైన్ లో చేసుకునే అవకాశం కల్పించారు. ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్, రెన్యువల్, అదనపు అర్హతలు నమోదు మొదలైన సేవలు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చని ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయాధికారి శ్రీనివాసులు గురువారం పేర్కొన్నారు. అభ్యర్థులు https://www.employment.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా సేవలు పొందవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్ SMS ద్వారా పంపడం జరుగుతుందన్నారు.

News May 2, 2024

జగన్ సీఎం అయ్యాక నాపై దాడులు పెరిగాయి: మాజీ జడ్జి 

image

జగన్ సీఎం అయ్యాక నాపై దాడులు జరుగుతున్నాయని మాజీ జడ్జి రామకృష్ణ అన్నారు. మదనపల్లి ప్రెస్ క్లబ్‌లో అయన మాట్లాడుతూ..ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డిపై మార్చి 25న బీ కొత్తకోట స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే సీఐ పట్టించులేదన్నారు. అందుకే నాఇంటిని ధ్వంసం చేయించారని, జడ్జి తమ్ముడే ఈదాడి చేశారని సీఐ ప్రకటన ఇవ్వడం సరికాదన్నారు. ఎలాంటి విచారణ చేయకుండా తప్పుడు దర్యాప్తు చేశారని  ఆరోపించారు.

News May 2, 2024

చిత్తూరు: సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం

image

పోలింగ్ కేంద్రంలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సగిలి షన్మోహన్ పేర్కొన్నారు. గురువారం స్థానిక నాగయ్య కళాక్షేత్రంలో సాధారణ పరిశీలకులు యం. డి. షాదిక్ అలం, కైలాష్ వాంఖడే, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీలతో కలసి ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

News May 2, 2024

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

image

చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో ఈనెల 4వ తేదీన సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లను అడిషనల్ ఎస్పీ ఆరిఫుల్లా, ఎమ్మెల్యే వెంకటే గౌడ పరిశీలించారు. గంగవరంలోని యూనివర్సల్ స్కూల్ మైదానంలో హెలిపాడ్ స్థలం, ఎంబీటీ రోడ్డు వద్ద సభస్థలాన్ని అధికారులు పరిశీలించారు.

News May 2, 2024

కుప్పం మీదుగా రైళ్ల రాకపోకలు ఆలస్యం

image

కుప్పం మీదుగా బెంగళూరుకు రాకపోకలు సాగించే పలు రైలు 9వ తేదీ వరకు ఆలస్యంగా నడుస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు. కుప్పం-బంగారుపేట మార్గంలో వరదాపురం రైల్వే స్టేషన్ సమీపంలో అదనపు ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుప్పం మీదుగా రైలు ఆలస్యంగా నడుస్తాయని చెప్పారు. అలాగే 9వ తేదీ బెంగళూరు నుంచి కుప్పం మీదుగా జోలార్ పేట వెళ్లే పలు రైళ్లు బంగారుపేట వరకే నడుస్తాయి.

News May 2, 2024

చిత్తూరు: కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

మద్యం రవాణా, అక్రమ విక్రయాలను అడ్డుకుని ఎక్సైజ్ కేసులు తగ్గించడానికి ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా మద్య నిషేధ, అబ్కారీ శాఖ అధికారిణి షేక్ ఆయేషా బేగం తెలిపారు. సీఐ సుధాకర్ 95736 32427, కానిస్టేబుల్ కుమార్ జాన్సన్ 89191 60437, జూనియర్ సహాయకులు శ్రీనివాస యాదవ్ 93986 74616లు అందుబాటులో ఉంటారన్నారు. ఎక్సైజ్ నేరాలకు సంబంధించి ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు.

News May 2, 2024

చిత్తూరు: కిటకిటలాడుతున్న బ్యాంకులు

image

సామాజిక పింఛన్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. ఈక్రమంలో నగదును డ్రా చేసుకునేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బ్యాంకులతో పాటు బ్యాంకు సేవా కేంద్రాలు, మినీ ఏటీఎంల వద్ద లబ్ధిదారులు బారులుదీరారు. మరోవైపు దివ్యాంగులు, మంచానికి పరిమితమైన వారికి సచివాలయ ఉద్యోగులు ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.

News May 2, 2024

చిత్తూరు జైలుకు నాయకుల తరలింపు

image

పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో జరిగిన అల్లర్ల కేసులో 9 మంది బీసీవై నాయకులను రిమాండ్‌కు తరలించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. గత సోమవారం ఎర్రాతివారిపల్లెలో అనుమతి లేకుండానే బీసీవై నాయకులు ప్రచారానికి వెళ్లడంతో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది బీసీవై నాయకులు, అలాగే 9 మంది వైసీపీ నాయకులకు రిమాండ్‌ విధించగా.. వారిని చిత్తూరు జైలుకు తరలించారు.

News May 2, 2024

చిత్తూరు: మూడో తరగతి ప్రవేశానికి దరఖాస్తులు

image

గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మూడో తరగతి(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎస్.మూర్తి తెలిపారు. అర్హులైన గిరిజన విద్యార్థులు 20వ తేదీలోగా సంబంధిత గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌కు దరఖాస్తు చేసుకోవాలని.. వివరాలకు 9490957021లో సంప్రదించాలని కోరారు.

News May 2, 2024

వైసీసీ నుంచి వడమాలపేట ZPTC సస్పెండ్

image

నగరి నియోజకవర్గం వడమాలపేట ZPTC మురళి రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడినట్లు ఫిర్యాదు అదడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అతనిపై అభియోగాలు వాస్తవమని క్రమశిక్షణ కమిటీ ధ్రువీకరించడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాగే అతని పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.