India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బి.కొత్తకోటలో జడ్జి రామకృష్ణ ఇంటిపై అర్థరాత్రి దాడికి పాల్పడ్డ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సూర్యనారాయణ కథనం మేరకు.. బి.కొత్తకోటలో కాపురం ఉంటున్న జడ్జి రామకృష్ణ ఇంటిపై మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు పథకం ప్రకారం వచ్చి ఇంటి తలుపులు, కిటికీలు, కారు అద్దాలు ద్వంసం చేశాన్నారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన అనంతరం జడ్జి ఇంటిపై దాడిచేసింది తమ్ముడు రామచంద్ర అన్నారు
ఎన్నికల విధులు కేటాయించబడిన పిఓ, ఎపీఓలకు రెండవ విడత శిక్షణ కొరకు రిటర్నింగ్ అధికారులు పక్కాగా ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ నుండి ఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పీ.ఓ, ఎపీఓలకు పక్కాగా శిక్షణ నిర్వహణ ఉండాలని సూచించారు.
ఈతకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు కథనం ప్రకారం.. తిరుపతికి చెందిన రమేశ్(40) గంగజాతర సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చాడు. అనంతరం బోయకొండ రోడ్డులో ఉన్న సిద్ధప్ప బావి వద్ద ఈతకు వెళ్లినట్లు మృతి చెందాడు. సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని గుర్తించి వెలికితీశామని అన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెన్షన్ డబ్బుల కోసం వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల సేవలు నిలిచాయి. ఈక్రమంలో నడవలేని వారికి ఇంటి వద్దే పింఛన్ డబ్బులు అందజేశారు. ఆధార్ కార్డు లింకు అయిన బ్యాంకు ఖాతాల్లో మరికొందరికి నగదు జమ చేశారు. ఆ డబ్బులు తీసుకోవడానికి వృద్ధులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
డయల్ యువర్ ఈవో కార్యక్రమం మే 3వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుంచి10 గంటల వరకు తిరుపతి టీటీడీ పరిపాలన భవంలోని మీటింగ్ హాల్లో జరుగనుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఫోన్ ద్వారా నేరుగా తెలపవచ్చు అన్నారు.
మదనపల్లెలో రియల్టర్ శ్రీనివాసులు రెడ్డిపై ప్రత్యర్థులు కొడవలి, కత్తులతో పట్టపగలే హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడి కుటుంబీకులు కథనం.. స్థానిక సీపీఎం రోడ్డు, ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉంటున్న రమణారెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డిలు శ్రీనివాసులు రెడ్డిపై కత్తులు కొడవళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. హత్యాయత్యానికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
చిత్తూరు జిల్లా సదుం మండలంలో జరిగిన అల్లర్ల కేసులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్తో పాటు 13 మందిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎస్ఐ మారుతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కట్టారు. అలాగే గ్రామంలోకి అనుమతి లేకుండా వెళ్ల వద్దని పోలీసులు సూచించినా.. లెక్కచేయకుండా వెళ్లడంతో రామచంద్ర యాదవ్తో పాటు పలువురిపై మరో కేసు నమోదు చేశారు.
చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఏడు చోట్ల హ్యాట్రిక్ ఓటమి ఎదురైంది. తిరుపతి లోక్సభ, పుంగనూరు, పీలేరు, మదనపల్లె, చంద్రగిరి, జీడీ నెల్లూరు, పూతలపట్టులో వరుసగా టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. అక్కడ 2009లో కాంగ్రెస్ అభ్యర్థులు, 2014, 2019లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. కుప్పంలో చంద్రబాబు వరుసగా ఏడు సార్లు గెలిచారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టారు.
చిత్తూరు పార్లమెంట్ పరిధిలో 16,43,593 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ ఎస్. షణ్మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నగరి, జి.డి.నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీలలో 8,06,070 మంది పురుషులు, 8,34,000 మంది స్త్రీలు మొత్తం 16,43,593 మంది ఓటర్లు ఉన్నారన్నారు.
రాజంపేట పార్లమెంటు బరిలో MP అభ్యర్థులుగా 18మంది బరిలో ఉన్నారు. NDA కూటమి-నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, YCP-మిథున్ రెడ్డి, కాంగ్రెస్-S.భాషీద్, BSP-యుగేంద్ర, అన్న YSR-అక్బర్, M.బాషా, జై భారత్ పార్టీ-రమణయ్య, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ-సల్మాన్ ఖాన్, ఇండిపెండెంట్లు-వేంకటాద్రి, ఓబయ్యనాయుడు, నాగరాజు, నాగేశ్వర్ రాజు, శ్రీనివాసులు, రెడ్డిశేఖర్, ప్రదీప్, శ్రీనివాసులు, మాడా రాజ, సుబ్బనరసయ్య ఉన్నారు.
Sorry, no posts matched your criteria.