Chittoor

News April 30, 2024

చిత్తూరు: సమాచారం ఇవ్వండి.. వివరాలు గోప్యంగా ఉంచుతాం

image

చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా అక్రమ మద్యం నిల్వలు, ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం వస్తే ఫ్లయింగ్ స్క్వాడ్ మెంబర్లకు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
కె.లక్ష్మీ ప్రసన్న, శిక్షణ, డిప్యూటీ కలెక్టర్ చిత్తూరు-ఫోన్ నెం :9603404789, శేషగిరి ఎస్సై-
9849962578, కృష్ణ కిషోర్ ఎస్సై-8019396602, విజయభాస్కర్-9491077011.

News April 30, 2024

ఏసీబీ వలలో కురబలకోట విద్యుత్ ఏఈ

image

కురబలకోట విద్యుత్ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కురబలకోట మండలంలో ట్రాన్స్ కో కార్యాలయం ఏఈగా వెంకటరత్నం పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు కోసం ఓ రైతు వద్ద రూ.32 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

News April 30, 2024

తిరుపతిలో 46 మంది పోటీ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో జిల్లాలోనే అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానానికి 46 మంది పోటీ చేస్తున్నారని రిటర్నింగ్ ఆఫీసర్ అదితి సింగ్ ప్రకటించారు. YCP నుంచి భూమన అభినయ్ రెడ్డి, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు బరిలో ఉన్నారు. సీపీఐ నుంచి మురళి పోటీ చేస్తున్నారు. చంద్రగిరిలో 24 మంది, అత్యల్పంగా నగరిలో 7 మంది బరిలో ఉన్నారు.

News April 30, 2024

కుప్పంలోనూ గాజు గ్లాస్ గుర్తు

image

చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తు కూటమి అభ్యర్థులను కలవరపెడుతోంది. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలోనూ గ్లాస్ గుర్తు ఈవీఎంలో ఉండనుంది. ఇక్కడ మొరసన్నపల్లి YCP సర్పంచ్ జగదీశ్ భార్య నీలమ్మ స్వతంత్ర అభ్యర్థిగా ఉండటంతో గ్లాస్ గుర్తు కేటాయించారు. చంద్రగిరి, మదనపల్లె, శ్రీకాళహస్తి, నగరిలోనూ ఇండిపెండెంట్లకు ఈ గుర్తు ఇచ్చారు. అక్కడ ఫలితాలపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి మరి.

News April 30, 2024

TDP నుంచి జేడీ రాజశేఖర్ సస్పెండ్

image

తిరుపతి జిల్లా సత్యవేడుకు చెందిన JD రాజశేఖర్‌ను TDP సస్పెండ్ చేసింది. 2019 ఎన్నికల్లో ఆయన TDP అభ్యర్థిగా పోటీ చేసి YCP అభ్యర్థి ఆదిమూలం చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మాజీ MLA హేమలతకు TDP ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆదిమూలానికి TDP టికెట్ దక్కడంతో రాజశేఖర్, హేమలత రెబల్‌గా నామినేషన్ వేశారు. హేమలత నామినేషన్ తిరస్కరణకు గురైంది. రాజశేఖర్ పోటీలో కొనసాగుతుండటంతో ఆయనపై TDP వేటు వేసింది.

News April 30, 2024

బ్యాంక్ ఖాతాకు పెన్షన్లు జమ: జిల్లా కలెక్టర్

image

మే 1వ తేదీన పెన్షనర్ల బ్యాంకు ఖాతాకు పెన్షన్లను జమ చేస్తామని జిల్లా కలెక్టర్ పగిలి షన్మోహన్ పేర్కొన్నారు. ఆధార్ సీడింగ్ అయిన బ్యాంక్ ఖాతాలకు నేరుగా నిధులు జమ చేస్తామన్నారు.2,72, 864 మంది పెన్షనర్లు ఉన్నారన్నారు.79 కోట్ల 87 లక్ష రూపాయలు పెన్షన్ మొత్తం పంపిణీ జరగాలన్నారు. ఇందులో 1,92,021 మందికి బ్యాంకు ఖాతాకి జమ చేస్తారు. 20,843మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

News April 29, 2024

బాలయ్య రాకతో జనసంద్రమైన చిత్తూరు గాంధీ సర్కిల్

image

స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా చిత్తూరుకు విచ్చేసిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చిత్తూరు ప్రజలు ఘన స్వాగతం పలికారు. బాలయ్య రాకతో చిత్తూరు గాంధీ సర్కిల్ జనసంద్రమైంది. బాలయ్య మాట్లాడుతూ..  సైకో జగన్ ప్రభుత్వం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందలేదని,  రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మంచి చేకూరుతుందని అన్నారు.

News April 29, 2024

చిత్తూరు జిల్లా ఫలితాలపై సర్వత్రా ఆసక్తి

image

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జిల్లాలో టీడీపీకి మెజార్టీ సీట్లు రాలేదు. 2009లో కాంగ్రెస్‌కు 7, టీడీపీకి 6, పీఆర్పీకి ఓ స్థానం వచ్చింది. 2014లో వైసీపీకి 8, టీడీపీకి 6 దక్కాయి. 2019లో వైసీపీకి 13 రాగా టీడీపీ కుప్పంతో సరిపెట్టుకుంది. మరి ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయో కామెంట్ చేయండి.

News April 29, 2024

మదనపల్లె ఇండిపెండెంట్ అభ్యర్థికి గ్లాస్ గుర్తు కేటాయింపు

image

మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్.షాజహాన్‌కు గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు. దీంతో స్థానిక జనసేన పార్టీ నేతల్లో కలవరం చోటు చేసుకుంది. గాజు గ్లాసు గుర్తు షాజహాన్‌కు కేటాయించడం తగదన్నారు. మదనపల్లె జనసేన పార్టీ నేత దారం అనిత తదితరులు ఎన్నికల అబ్జర్వర్ కవిత(ఐఏఎస్), ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.

News April 29, 2024

చంద్రగిరి : టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానికి 1+1 భద్రత

image

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానితో పాటు కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేసినా సెక్యూరిటీ ఇవ్వలేదని నాని హైకోర్టును ఆశ్రయించారు. నాని తరఫున న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. పోటీ చేసిన అభ్యర్థికి భద్రత ఇవ్వాలి కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇవాళ నుంచి 1+1 సెక్యూరిటీ ఇవ్వాలని ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.